Political News

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. అగ్రవర్ణాలలో అద్భుతమైన నైపుణ్యం ఉన్నవారు కూడా కేవలం రిజర్వేషన్లు లేవన్న కారణంతో అవకాశాలు కోల్పోతున్న వైనంపై నెటిజన్లు, కొందరు విద్యావేత్తలు, మేధావులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇక, ఆర్థిక ప్రాతిపదికన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించాలని మరికొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే మోడీ సర్కార్ గతంలో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో అగ్రవర్ణాల్లోని పేదలకూ విద్య, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను దేశవ్యాప్తంగా అమలు చేయాలని గతంలోనే ఆదేశించింది. అయితే, ఈ రిజర్వేషన్లు మాత్రం తెలంగాణలో అమలు కాకపోవడంపై విమర్శలు వచ్చాయి.

దీంతో, తెలంగాణలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయడం లేదని హైకోర్టు కూడా తెలంగాణ సర్కార్ ను ప్రశ్నించింది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఆల్రెడీ తెలంగాణలో బలహీన వర్గాలకు అమలవుతున్న 50 శాతం రిజర్వేషన్లకు ఈ 10 శాతం రిజర్వేషన్లు అదనమని చెప్పారు.

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో కలుపుకొని తెలంగాణలో రిజర్వేషన్ల శాతం 60కు చేరుకుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై మరో 2 రోజుల్లో ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి వాటికి సంబంధించిన విధివిధానాలు, నియమనిబంధనలు వెల్లడించే అవకాశముందని తెలుస్తోంది. దీంతో, రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రం తెచ్చిన 10% రిజర్వేషన్లను ఇకపై తెలంగాణలోనూ అమలు చేయబోతున్నారని విద్యార్థులు, నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on January 22, 2021 10:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెగా ఛాన్స్ వదిలేసిన విశ్వంభర

మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ ఫలితాన్ని విశ్వంభర క్యాష్ చేసుకునే దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగకపోవడం అభిమానులను బాధ…

9 minutes ago

హార్దిక్ పాండ్య ఏం సాధించాడు?

గత కొన్నేళ్లలో మోస్ట్ అన్ పాపులర్ ఇండియన్ క్రికెటర్ ఎవరు అంటే మరో మాట లేకుండా హార్దిక్ పాండ్య పేరు…

33 minutes ago

క‌విత న‌న్ను ప‌దికోట్లు అడిగారు: పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ సువార్తీకుడు కేఏ పాల్‌.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ…

1 hour ago

మ‌మ‌త ప‌రిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!

త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. బీజేపీ విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. త‌న‌కు అవ‌కాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…

4 hours ago

‘అడ్డంకులెన్నైనా.. ఆకివీడు రామాలయ నిర్మాణం ఆగదు’

ఏపీలో మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.…

5 hours ago

కెపాసిటీ లేకే ర‌జినీ సినిమా వ‌దిలేశా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో ఎంత త‌ల‌నొప్పి ఎదురైందో…

6 hours ago