తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువుల కిడ్నాప్ ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనాన్ని రేపిందో తెలిసిందే. ఇటీవల ఈ కేసుకు సంబంధించి పలువురుని అరెస్టు చేశారు. తాజాగా కిడ్నాప్ కేసులో కీలకంగా వ్యవహరించారని చెబుతున్న నిందితులు సంపత్ కుమార్.. మల్లికార్జున రెడ్డిలను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఈ సందర్భంగా వారు పలు కీలక అంశాల్ని వెల్లడించినట్లుగా చెబుతున్నారు.
రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారిని కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. స్టేషన్ కు తీసుకొచ్చి.. కిడ్నాప్ ఉదంతానికి సంబంధించిన పలు ప్రశ్నలు వేసినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కిడ్నాప్ ఎపిసోడ్ లో కీలకభూమిక పోషించినట్లుగా వారు చెప్పారని వెల్లడించినట్లు సమాచారం. ఆమె ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి అని.. మిగిలిన విషయాలు తమకు తెలీవన్నట్లుగా తెలుస్తోంది.
తాజాగా ఈ నిందితుల్ని ఘటనాస్థలాలకు తీసుకెళ్లి.. సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేయించనున్నారు. ఏ కారులో తీసుకెళ్లారు? కారును మధ్యలో ఎక్కడైనా ఆపారా? వారితో సంతకాలు చేయించుకునే ముందు బాధితుల్ని ఎలా బెదిరించారు? లాంటి పలు ప్రశ్నల్ని సంధించనున్నారు. కిడ్నాప్ లో ఇతర నిందితుల పాత్రల మీద మరింత క్లారిటీ తెచ్చుకునేందుకు వీరి నుంచి సమాచారాన్ని సేకరించనున్నట్లుగా తెలుస్తోంది. చూస్తుంటే..కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియను పూర్తిగా ఫిక్స్ కానున్నట్లుగా చెబుతున్నారు.
This post was last modified on January 21, 2021 11:24 am
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…
2022 లెజెండ్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన తమిళ వ్యాపారవేత్త శరవణన్ ని మూవీ లవర్స్ అంత ఈజీగా మర్చిపోలేరు.…