తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువుల కిడ్నాప్ ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనాన్ని రేపిందో తెలిసిందే. ఇటీవల ఈ కేసుకు సంబంధించి పలువురుని అరెస్టు చేశారు. తాజాగా కిడ్నాప్ కేసులో కీలకంగా వ్యవహరించారని చెబుతున్న నిందితులు సంపత్ కుమార్.. మల్లికార్జున రెడ్డిలను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఈ సందర్భంగా వారు పలు కీలక అంశాల్ని వెల్లడించినట్లుగా చెబుతున్నారు.
రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారిని కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. స్టేషన్ కు తీసుకొచ్చి.. కిడ్నాప్ ఉదంతానికి సంబంధించిన పలు ప్రశ్నలు వేసినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కిడ్నాప్ ఎపిసోడ్ లో కీలకభూమిక పోషించినట్లుగా వారు చెప్పారని వెల్లడించినట్లు సమాచారం. ఆమె ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి అని.. మిగిలిన విషయాలు తమకు తెలీవన్నట్లుగా తెలుస్తోంది.
తాజాగా ఈ నిందితుల్ని ఘటనాస్థలాలకు తీసుకెళ్లి.. సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేయించనున్నారు. ఏ కారులో తీసుకెళ్లారు? కారును మధ్యలో ఎక్కడైనా ఆపారా? వారితో సంతకాలు చేయించుకునే ముందు బాధితుల్ని ఎలా బెదిరించారు? లాంటి పలు ప్రశ్నల్ని సంధించనున్నారు. కిడ్నాప్ లో ఇతర నిందితుల పాత్రల మీద మరింత క్లారిటీ తెచ్చుకునేందుకు వీరి నుంచి సమాచారాన్ని సేకరించనున్నట్లుగా తెలుస్తోంది. చూస్తుంటే..కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియను పూర్తిగా ఫిక్స్ కానున్నట్లుగా చెబుతున్నారు.
This post was last modified on January 21, 2021 11:24 am
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…