Political News

నేతలనే టెన్షన్ పెట్టేస్తున్న పనబాక

తిరుపతి లోక్ సభ తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి పనబాక లక్ష్మీ సొంతపార్టీ నేతలనే టెన్షన్ పెట్టేస్తున్నారు. బుధవారం తిరుపతిలో ప్రారంభమైన పార్లమెంటు కేంద్ర కార్యాలయం ప్రారంభానికి పనబాక గైర్హాజరయ్యారు. తొందరలో జరగబోతున్న తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పనబాక లక్ష్మితో పోటీ చేయించాలని చంద్రబాబునాయుడు తెగ ప్రయత్నిస్తున్నారు. తన సహజ మనస్తత్వానికి విరుద్ధంగా దాదాపు రెండు నెలల ముందే పనబాక అభ్యర్ధిత్వాన్ని అధినేత ప్రకటించేశారు. అభ్యర్ధిత్వాన్ని ప్రకటించినా ఆమె మాత్రం చాలాకాలం అసలు నోరే విప్పలేదు.

జనవరి 6వ తేదీన తన కూతురు వివాహం అయిపోగానే ప్రచారానికి దిగుతానని చెప్పారు. 6వ తేదీ అయిపోయినా ఇంతవరకు ప్రచారానికి దిగలేదు. పైగా నేతలకు కూడా పెద్దగా అందుబాటులో ఉండటం లేదని సమాచారం. సరే 21వ తేదీనుండి నేతలు, శ్రేణులందరూ పదిరోజుల పాటు లోక్ సభ నియోజకవర్గం పరిదిలోని 700 గ్రామాల్లో ప్రచారం చేయాలని ఆదేశించారు. ఈ నేపధ్యంలోనే తిరుపతిలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించాలని అనుకున్నారు.

తిరుపతిలోని ఆటోనగర్లో రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. తిరుపతిలోని కీలక నేతలంతా కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అయితే అభ్యర్ధి పనబాక మాత్రం అడ్రస్ లేరు. రాష్ట్ర అధ్యక్షుడే స్వయంగా పార్టీ కార్యాలయం ప్రారంభిస్తున్నారు కాబట్టి అభ్యర్ధి రాకపోతారా అని నేతలు అనుకున్నారు. పార్టీ కార్యాలయం ప్రారంభిస్తున్నట్లు పనబాకకు సమాచారం కూడా ఇచ్చారట.

పార్టీ కార్యాలయం ప్రారంభిస్తున్నారని, అచ్చెన్న వస్తున్నారని తెలిసినా పనబాక అడ్రస్ లేకపోయేసరికి నేతలంతా ఆశ్చర్యపోయారు. పోటీ చేసే విషయంలో అసలు ఆమె మనసులో ఏముందో నేతలకు అర్ధంకాక అందరు అయోమయంలో పడిపోయారు. పోటీచేసే విషయంలో అధినేతతో పాటు నేతలను ఇంత అయోమయానికి గురిచేసిన అభ్యర్ధి మరోకరు లేరనే చెప్పాలి. అసలు పనబాక పోటీ చేస్తారో లేదో కూడా ఎవరికీ తెలీక ఎవరికోసం ప్రచారం చేయాలనే టెన్షన్ నేతల్లో పెరిగిపోతోంది.

This post was last modified on January 21, 2021 11:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

5 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

6 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

6 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

6 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

6 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

7 hours ago