తిరుపతి లోక్ సభ తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి పనబాక లక్ష్మీ సొంతపార్టీ నేతలనే టెన్షన్ పెట్టేస్తున్నారు. బుధవారం తిరుపతిలో ప్రారంభమైన పార్లమెంటు కేంద్ర కార్యాలయం ప్రారంభానికి పనబాక గైర్హాజరయ్యారు. తొందరలో జరగబోతున్న తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పనబాక లక్ష్మితో పోటీ చేయించాలని చంద్రబాబునాయుడు తెగ ప్రయత్నిస్తున్నారు. తన సహజ మనస్తత్వానికి విరుద్ధంగా దాదాపు రెండు నెలల ముందే పనబాక అభ్యర్ధిత్వాన్ని అధినేత ప్రకటించేశారు. అభ్యర్ధిత్వాన్ని ప్రకటించినా ఆమె మాత్రం చాలాకాలం అసలు నోరే విప్పలేదు.
జనవరి 6వ తేదీన తన కూతురు వివాహం అయిపోగానే ప్రచారానికి దిగుతానని చెప్పారు. 6వ తేదీ అయిపోయినా ఇంతవరకు ప్రచారానికి దిగలేదు. పైగా నేతలకు కూడా పెద్దగా అందుబాటులో ఉండటం లేదని సమాచారం. సరే 21వ తేదీనుండి నేతలు, శ్రేణులందరూ పదిరోజుల పాటు లోక్ సభ నియోజకవర్గం పరిదిలోని 700 గ్రామాల్లో ప్రచారం చేయాలని ఆదేశించారు. ఈ నేపధ్యంలోనే తిరుపతిలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించాలని అనుకున్నారు.
తిరుపతిలోని ఆటోనగర్లో రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. తిరుపతిలోని కీలక నేతలంతా కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అయితే అభ్యర్ధి పనబాక మాత్రం అడ్రస్ లేరు. రాష్ట్ర అధ్యక్షుడే స్వయంగా పార్టీ కార్యాలయం ప్రారంభిస్తున్నారు కాబట్టి అభ్యర్ధి రాకపోతారా అని నేతలు అనుకున్నారు. పార్టీ కార్యాలయం ప్రారంభిస్తున్నట్లు పనబాకకు సమాచారం కూడా ఇచ్చారట.
పార్టీ కార్యాలయం ప్రారంభిస్తున్నారని, అచ్చెన్న వస్తున్నారని తెలిసినా పనబాక అడ్రస్ లేకపోయేసరికి నేతలంతా ఆశ్చర్యపోయారు. పోటీ చేసే విషయంలో అసలు ఆమె మనసులో ఏముందో నేతలకు అర్ధంకాక అందరు అయోమయంలో పడిపోయారు. పోటీచేసే విషయంలో అధినేతతో పాటు నేతలను ఇంత అయోమయానికి గురిచేసిన అభ్యర్ధి మరోకరు లేరనే చెప్పాలి. అసలు పనబాక పోటీ చేస్తారో లేదో కూడా ఎవరికీ తెలీక ఎవరికోసం ప్రచారం చేయాలనే టెన్షన్ నేతల్లో పెరిగిపోతోంది.
This post was last modified on January 21, 2021 11:42 am
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…