రైతులపై బీజేపీ నేతలు నోరు పారేసుకుంటూనే ఉన్నారు. జైకిసాన్ అని ఓ వైపు రైతులకు సంబంధించి గొప్పగా చెప్పుకొంటూనే మరోవైపు అవకాశం వచ్చిన ప్రతిసారీ.. రైతులపై వివాదాస్పదవ్యాఖ్యలు చేస్తున్నా రు. ప్రస్తుతం రైతుల సాగు చట్టాలను తీసుకువచ్చిన కేంద్రంపై రైతులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతులను ఊరడించాల్సిన బీజేపీ నాయకులు.. వారిని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలుచేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఉద్యమం చేస్తున్న రైతులను ఉద్దేశించి పలువురు బీజేపీ నేతలు నోరు పారేసుకున్నారు.
రైతులు తిన్నది అరక్క ఉద్యమం చేస్తున్నారని.. ఒకరిద్దరు పరుషంగా వ్యాఖ్యానిస్తే.. మరికొందరు.. రైతులు పొరుగు దేశాలతో చేతులు కలిపి ఇక్కడ శాంతినిభగ్నం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. ఖలిస్తాన్ తీవ్రవాదులు సైతం రైతుల ఉద్యమంలో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పాటిల్, బీజేపీ నేత రామ్ మాధవ్లకు రైతులు నోటీసులు పంపారు. తక్షణమే బేషరతు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తీవ్ర వివాదం కావడంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రంగంలోకి దిగి సర్ది చెప్పాల్సి వచ్చింది. కేంద్ర మంత్రులు తర్వాత రోజుల్లో నోరు అదుపులో పెట్టుకున్నారు.
ఈ పరిణామాలు తెలిసి కూడా తాజాగా కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ రైతులపై నోరు పారేసుకున్నారు. ఆత్మహత్య చేసుకునే రైతులు మానసికంగా బలహీనులని, అలాంటి ఆత్మహత్యలను ప్రభుత్వం మెడకు చుట్టడం సరికాదని వ్యాఖ్యానించారు. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వాలు కారణం కాదని ఆయన తీర్పు చెప్పుకొచ్చారు.
అక్కడితో ఆగకుండా.. రాష్ట్రంలో కేవలం రైతులే ఆత్మహత్యలు చేసుకోవట్లేదని, పారిశ్రామికవేత్తలు, అధికారులు, ఇతరులూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారని అన్నారు. కేవలం క్షణికావేశంలోనే ప్రాణాలు తీసుకుంటున్నారని, అన్నింటికీ ప్రభుత్వం బాధ్యత వహించాలా? అని ఎదురు ప్రశ్నించడం గమనార్హం. ఎన్నికల సమయంలో రైతులకు అది చేస్తాం.. ఇది చేస్తాం.. వారికి అన్ని విధాలా భరోసా కల్పిస్తామని చెప్పే నాయకులు అధికారంలోకి వచ్చాక.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
స్టార్ హీరోయిన్లు ఏదైనా రామాయణ లాంటి పెద్ద సినిమాలో నటించినపుడు వారి ఇమేజ్కు తగ్గ పాత్రలు లేకపోతే.. అభిమానులు ఫీలవడం…
ఏపీలో కూటమి పాలనకు అప్పుడే రెండేళ్లు పూర్తి అయిపోయింది. ఇంకో మూడేళ్లు ఉంటే మరో ఎన్నికలకు కూటమి పార్టీలు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి.…
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…