భార్గవ్ రామ్..ఈపేరు ఇపుడు తెలుగురాష్ట్రాల్లో బాగా పాపులరైపోయింది. మాజీమంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ భర్త. ఓ కిడ్నాప్ కేసులు ఏ 3 నిందితునిగా ఉన్న భార్గవ్ అంటే ఇపుడు ఆళ్ళగడ్డ, నంద్యాలలో జనాలు బాగా మండిపోతున్నారట. కిడ్నాప్ కేసులో అఖిలప్రియతో పాటు మరో 15 మంది అరెస్టయి పోలీసుల విచారణను ఎదుర్కొంటున్నారు. అఖిలకు అయితే కోర్టు రెండోసారి కూడా బెయిల్ రెజెక్టు చేసింది. దాంతో చేసేదిలేక మాజీమంత్రి చంచల్ గూడలోని మహిళా జైలులో ఉంటున్నారు.
ఇక కిడ్నాప్ గ్యాంగులోని ఇతర పాత్రదారులు కూడా ఒక్కకొక్కళ్ళుగా పోలీసులకు పట్టుబడుతున్నారు. ఇంతమంది దొరుకుతున్నా భార్గవ్ మాత్రం ఎక్కడా ఆచూకీ దొరకటం లేదు. ఈ పాయింట్ మీదే కర్నూలు జిల్లాలోని భూమా నియోజకవర్గాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందట. కిడ్నాప్ కేసులో భార్య పోలీసులకు దొరికిపోయి జైలులో ఉంటే భర్తయి ఉండి భార్గవ్ పరారీలో ఉండటం ఏమిటంటూ భూమా మద్దతుదారులు మండిపోతున్నారట.
రాయలసీమలో ఫ్యాక్షన్ జిల్లాగా పేరుపొందిన కర్నూలులో భర్తలు ఎవరు కూడా తమ భార్యలను కేసుల్లో ఇరికించి పరారీలో ఉండరని భూమా మద్దతుదారులే కాకుండా మామూలు జనాలు కూడా చెప్పుకుంటున్నారట. కిడ్నాప్ చేశారా లేదా అన్న విషయాన్ని పక్కనపెట్టేస్తే భార్యకు అండగా ఉండాల్సిన సమయంలో భార్గవ్ తప్పించుకుని తిరగటం ఏమిటంటూ మండిపోతున్నారు. అలాగే అఖిల తమ్ముడు జగద్విఖ్యాత్ రెడ్డిని కూడా జనాలు తిట్టుకుంటున్నారట.
కిడ్నాప్ ఘటన వెలుగు చూసిన దగ్గర నుండి అఖిల భర్త భార్గవ్ పరారీలో ఉన్నట్లే తమ్ముడు జగద్విఖ్యాత్ కూడా ఆచూకీ దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. భార్గవ్ మహారాష్ట్రలో ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే తమ్ముడి ఆచూకీ మాత్రం ఇంతవరకు పోలీసులకు దొరకలేదు. ఇదే సమయంలో తన భర్త, తమ్ముడు ఎక్కడున్నారో కూడా తనకు తెలీదని అఖిల మొదటినుండి చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే.
This post was last modified on January 19, 2021 5:55 pm
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…