డబుల్ థమాకా అంటే ఇదేనేమో. టార్గెట్ చేసి మరీ కేసుల్లో ఇరికించి.. తీవ్రమైన మానసిక హింసకు గురి చేయటమే కాదు.. అంతులేని మనోవ్యధకు కారణమైన కేసుల సాలెగూటి నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ ఇంకా బయటకు రాలేదు. తెలంగాణ క్యాడర్ కు చెందిన ఆమె.. తన పోస్టింగ్ ను తెలంగాణ నుంచి ఏపీకి మార్చుకోవటంలో ఇటీవల సక్సెస్ కావటం తెలిసిందే.
సాంకేతికంగా తెలంగాణలో ఉన్నప్పటికీ.. తాను ఏపీ క్యాడర్ అని.. తనను ఏపీకి బదిలీ చేయాలని కోరిన ఆయన వినతిని క్యాట్ ఓకే చెప్పటంతో ఆమెను ఏపీకి బదిలీ చేశారు. ఇదిలా ఉంటే.. ఏపీకి వచ్చిన ఆమెను జగన్మోహన్ రెడ్డి సర్కారు పురపాలక శాఖ కార్యదర్శి హోదాను ఇచ్చారు. తాజాగా.. ఈ హోదాను మరింత పెంచటమే కాదు.. ముఖ్య కార్యదర్శి హోదాతో ప్రమోషన్ ఇచ్చారు.
అయితే.. తాజాగా విడుదల చేసిన ఉత్తర్వులు.. శ్రీలక్ష్మి మీద ఉన్న పెండింగ్ కేసుల తీర్పులు.. డీవోపీటీ నిర్ణయం మేరకే ఉంటాయని చెబుతున్నారు. ఏమైనా.. కేసుల తిప్పలుతో కొన్నేళ్లుగా వేదనను అనుభవిస్తున్న శ్రీలక్ష్మికి ఏపీకి బదిలీ చేయటం.. అక్కడ వరుసగా కీలక పదవులు లభించటం చూస్తే.. ఆమె పడిన బాధలకు సాంత్వన లభిస్తుందని చెప్పక తప్పదు.
This post was last modified on January 19, 2021 2:37 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…