డబుల్ థమాకా అంటే ఇదేనేమో. టార్గెట్ చేసి మరీ కేసుల్లో ఇరికించి.. తీవ్రమైన మానసిక హింసకు గురి చేయటమే కాదు.. అంతులేని మనోవ్యధకు కారణమైన కేసుల సాలెగూటి నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ ఇంకా బయటకు రాలేదు. తెలంగాణ క్యాడర్ కు చెందిన ఆమె.. తన పోస్టింగ్ ను తెలంగాణ నుంచి ఏపీకి మార్చుకోవటంలో ఇటీవల సక్సెస్ కావటం తెలిసిందే.
సాంకేతికంగా తెలంగాణలో ఉన్నప్పటికీ.. తాను ఏపీ క్యాడర్ అని.. తనను ఏపీకి బదిలీ చేయాలని కోరిన ఆయన వినతిని క్యాట్ ఓకే చెప్పటంతో ఆమెను ఏపీకి బదిలీ చేశారు. ఇదిలా ఉంటే.. ఏపీకి వచ్చిన ఆమెను జగన్మోహన్ రెడ్డి సర్కారు పురపాలక శాఖ కార్యదర్శి హోదాను ఇచ్చారు. తాజాగా.. ఈ హోదాను మరింత పెంచటమే కాదు.. ముఖ్య కార్యదర్శి హోదాతో ప్రమోషన్ ఇచ్చారు.
అయితే.. తాజాగా విడుదల చేసిన ఉత్తర్వులు.. శ్రీలక్ష్మి మీద ఉన్న పెండింగ్ కేసుల తీర్పులు.. డీవోపీటీ నిర్ణయం మేరకే ఉంటాయని చెబుతున్నారు. ఏమైనా.. కేసుల తిప్పలుతో కొన్నేళ్లుగా వేదనను అనుభవిస్తున్న శ్రీలక్ష్మికి ఏపీకి బదిలీ చేయటం.. అక్కడ వరుసగా కీలక పదవులు లభించటం చూస్తే.. ఆమె పడిన బాధలకు సాంత్వన లభిస్తుందని చెప్పక తప్పదు.
This post was last modified on January 19, 2021 2:37 pm
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…