Political News

మమత వ్యూహాత్మక నిర్ణయం..నందిగ్రామ్ లో టెన్షన్

పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ తీసుకున్న ఓ నిర్ణయం సంలచనంగా మారింది. తొందరలోనే జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని మమత నిర్ణయించారు. ఇపుడు సీఎం జాదవ్ పూర్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నందిగ్రామ్ నుండి తాను పోటీ చేయబోతున్నట్లు మమత చేసిన ప్రకటన రాజకీయాల్లో ఓ రకంగా సంచలనంగా మారిందనే చెప్పాలి.

మమత నిర్ణయం సంచలనం ఎందుకంటే ఉద్యమాలకు నందిగ్రామ్ పుట్టిల్లులాంటిది. వామపక్ష ప్రభుత్వం ఉన్నపుడు సెజ్ లకు భూ కేటాయింపులకు వ్యతిరేకంగా మమత చేసిన ఉద్యమం నందిగ్రామ్ నుండే. దానిదెబ్బకు వామపక్ష ప్రభుత్వం కూలిపోయి మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తర్వాత మమతకు బాగా సన్నిహితుడు, ఎంపి సుబేందు అధికారిది నందిగ్రామే. నందిగ్రామ్ కేంద్రంగా సుమారు 50 నియోజకవర్గాల్లో సుబేందు కుటుంబానికి తిరుగులేని ఆధిపత్యముంది.

టీఎంసి రెండోసారి అధికారంలోకి రావటానికి సుబేందు చాలా కీలకపాత్ర పోషించారు. అలాంటి కీలక నేత హఠాత్తుగా టీఎంసీని వదిలేసి ఈమధ్యే బీజేపీలో చేరారు. సుబేందు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ చాలా తేలిగ్గా పై అసెంబ్లీ సీట్లలో గెలుస్తుంటుంది. ఇదంతా బాగా తెలుసిన మమత చాలా వ్యూహాత్మకంగా వచ్చే ఎన్నికల్లో నందిగ్రామ్ నుండి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. నందిగ్రామ్ నుండే మమత ఎందుకు పోటీ చేయబోతున్నారంటే సుబేందు ఆధిపత్యాన్ని తగ్గించేందుకేనట.

మమత గనుక నందిగ్రామ్ నుండి పోటీలో ఉంటే మమతను ఓడగొట్టడం కోసమే సుబేందుకు తన దృష్టి మొత్తాన్ని ఇక్కడే కేంద్రీకృతం చేయాల్సుంటుంది. లేకపోతే తనకు పట్టున్న నియోజకవర్గాల్లో బీజేపీని సుబేందు చాలా తేలిగ్గా గెలిపించుకోగలరు. మమత నందిగ్రామ్ లో పోటీ చేయబోతున్న కారణంగా మమతను వదిలేసి సుబేందు ఇతర నియోజకవర్గాలపై అంతగా దృష్టి పెట్టే అవకాశం ఉండదు. మొత్తానికి మమత వ్యూహాత్మకంగానే నందిగ్రామ్ ను ఎంచుకున్నారు. మరెంతవరకు వర్కవుటవుతుందో చూడాల్సిందే.

This post was last modified on January 19, 2021 9:48 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

10 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

10 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

11 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

12 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

12 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

14 hours ago