Political News

షాకింగ్‌: భార‌త భూభాగంలో చైనా గ్రామం

చైనా దౌర్జ‌న్యాల‌కు, దురాక్ర‌మ‌ణ‌ల‌కు ఇది మ‌రో నిద‌ర్శ‌నం. స‌రిహ‌ద్దు వెంబ‌డి ఏదో ఒక నీతి మాలిన ప‌ని చేస్తూ భార‌త్‌ను నిరంత‌రం క‌వ్విస్తూ ఉండే డ్రాగన్ కంట్రీ.. మ‌రోసారి త‌న కుటిల బుద్ధిని బ‌య‌ట‌పెట్టుకుంది. భార‌త భూభాగంలో ఆ దేశం ఏకంగా ఒక గ్రామాన్నే నిర్మించి మ‌న దేశానికి స‌వాలు విసిరింది.

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర భూభాగం త‌మ‌దే అని వాదించే చైనా.. తాజాగా అక్క‌డ‌ ఓ గ్రామాన్నే నిర్మించిన‌ట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్ల‌డైంది. ఆ గ్రామంలో 101 గృహాలు ఉన్నట్టు గుర్తించారు. సరిహద్దు నుంచి 4.5 కిలోమీటర్ల దూరం భార‌త భూభాగంలోకి చొర‌బ‌డి చైనా సైన్యం ఈ గ్రామాన్ని నిర్మించిన‌ట్లు చెబుతున్నారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని సుబాన్సిరి జిల్లాలోని త్సారి చు నదీ తీరం వెంబడి ఈ నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు.

ఈ ప్రాంతంపై భారత్, చైనా మధ్య సుదీర్ఘకాలంగా వివాదాలు ఉన్నాయి. గత ఏడాది నవంబరు 20న తీసిన‌ట్లుగా చెబుతున్న ఉప‌గ్ర‌హ చిత్రాలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. దేశ భద్ర‌త గురించి ఘ‌నంగా ప్ర‌క‌ట‌న‌లు చేసే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. చైనా సైన్యం వ‌చ్చి మ‌న భూభాగంలో ఒక గ్రామాన్నే నిర్మిస్తుంటే ఏం చేస్తున్నారంటూ ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ స‌హా ప్ర‌తిప‌క్ష నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

నరేంద్ర మోడీ ఓ బలహీన, అసమర్థ ప్రధాని అని.. చైనా మ‌న భూభాగంలో గ్రామం నిర్మించ‌డం చూస్తే షీ జిన్ పింగ్‌కు మోడీ స‌ర్కారు ప్రత్యేక ఆవాస్ యోజన క‌ల్పించిన‌ట్లు ఉంద‌ని ఒవైసీ ఎద్దేవా చేశారు. మ‌రి ఈ వ్య‌వ‌హారంపై మోడీ అండ్ కో ఎలా స్పందిస్తుందో చూడాలి.

This post was last modified on January 19, 2021 9:45 am

Share
Show comments
Published by
Satya
Tags: ChinaIndia

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

5 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

7 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

7 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

9 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

9 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

10 hours ago