చైనా దౌర్జన్యాలకు, దురాక్రమణలకు ఇది మరో నిదర్శనం. సరిహద్దు వెంబడి ఏదో ఒక నీతి మాలిన పని చేస్తూ భారత్ను నిరంతరం కవ్విస్తూ ఉండే డ్రాగన్ కంట్రీ.. మరోసారి తన కుటిల బుద్ధిని బయటపెట్టుకుంది. భారత భూభాగంలో ఆ దేశం ఏకంగా ఒక గ్రామాన్నే నిర్మించి మన దేశానికి సవాలు విసిరింది.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర భూభాగం తమదే అని వాదించే చైనా.. తాజాగా అక్కడ ఓ గ్రామాన్నే నిర్మించినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. ఆ గ్రామంలో 101 గృహాలు ఉన్నట్టు గుర్తించారు. సరిహద్దు నుంచి 4.5 కిలోమీటర్ల దూరం భారత భూభాగంలోకి చొరబడి చైనా సైన్యం ఈ గ్రామాన్ని నిర్మించినట్లు చెబుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని సుబాన్సిరి జిల్లాలోని త్సారి చు నదీ తీరం వెంబడి ఈ నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు.
ఈ ప్రాంతంపై భారత్, చైనా మధ్య సుదీర్ఘకాలంగా వివాదాలు ఉన్నాయి. గత ఏడాది నవంబరు 20న తీసినట్లుగా చెబుతున్న ఉపగ్రహ చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశ భద్రత గురించి ఘనంగా ప్రకటనలు చేసే ప్రధాని నరేంద్ర మోడీ.. చైనా సైన్యం వచ్చి మన భూభాగంలో ఒక గ్రామాన్నే నిర్మిస్తుంటే ఏం చేస్తున్నారంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సహా ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.
నరేంద్ర మోడీ ఓ బలహీన, అసమర్థ ప్రధాని అని.. చైనా మన భూభాగంలో గ్రామం నిర్మించడం చూస్తే షీ జిన్ పింగ్కు మోడీ సర్కారు ప్రత్యేక ఆవాస్ యోజన కల్పించినట్లు ఉందని ఒవైసీ ఎద్దేవా చేశారు. మరి ఈ వ్యవహారంపై మోడీ అండ్ కో ఎలా స్పందిస్తుందో చూడాలి.
This post was last modified on January 19, 2021 9:45 am
ప్యాన్ ఇండియా సినిమాల వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంది. జూన్ 13 విడుదలను లాక్ చేసుకుని ఆ మేరకు తమిళనాడు…
సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ గురించి తెలుగు నాట తెలియనివారెవరు.? మీడియాకి సంబంధించి ‘సీఈవో’ అన్న పదానికి పెర్ఫెక్ట్ నిర్వచనంగా రవిప్రకాష్…
బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ రియాల్టీ షో ఫేం శ్యామల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల…
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కలలు గన్న…
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత, సొంత అన్నపై ఆమె తీవ్రస్థాయిలో యుద్ధం…
పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్డేట్స్…