Political News

షాకింగ్‌: భార‌త భూభాగంలో చైనా గ్రామం

చైనా దౌర్జ‌న్యాల‌కు, దురాక్ర‌మ‌ణ‌ల‌కు ఇది మ‌రో నిద‌ర్శ‌నం. స‌రిహ‌ద్దు వెంబ‌డి ఏదో ఒక నీతి మాలిన ప‌ని చేస్తూ భార‌త్‌ను నిరంత‌రం క‌వ్విస్తూ ఉండే డ్రాగన్ కంట్రీ.. మ‌రోసారి త‌న కుటిల బుద్ధిని బ‌య‌ట‌పెట్టుకుంది. భార‌త భూభాగంలో ఆ దేశం ఏకంగా ఒక గ్రామాన్నే నిర్మించి మ‌న దేశానికి స‌వాలు విసిరింది.

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర భూభాగం త‌మ‌దే అని వాదించే చైనా.. తాజాగా అక్క‌డ‌ ఓ గ్రామాన్నే నిర్మించిన‌ట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్ల‌డైంది. ఆ గ్రామంలో 101 గృహాలు ఉన్నట్టు గుర్తించారు. సరిహద్దు నుంచి 4.5 కిలోమీటర్ల దూరం భార‌త భూభాగంలోకి చొర‌బ‌డి చైనా సైన్యం ఈ గ్రామాన్ని నిర్మించిన‌ట్లు చెబుతున్నారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని సుబాన్సిరి జిల్లాలోని త్సారి చు నదీ తీరం వెంబడి ఈ నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు.

ఈ ప్రాంతంపై భారత్, చైనా మధ్య సుదీర్ఘకాలంగా వివాదాలు ఉన్నాయి. గత ఏడాది నవంబరు 20న తీసిన‌ట్లుగా చెబుతున్న ఉప‌గ్ర‌హ చిత్రాలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. దేశ భద్ర‌త గురించి ఘ‌నంగా ప్ర‌క‌ట‌న‌లు చేసే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. చైనా సైన్యం వ‌చ్చి మ‌న భూభాగంలో ఒక గ్రామాన్నే నిర్మిస్తుంటే ఏం చేస్తున్నారంటూ ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ స‌హా ప్ర‌తిప‌క్ష నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

నరేంద్ర మోడీ ఓ బలహీన, అసమర్థ ప్రధాని అని.. చైనా మ‌న భూభాగంలో గ్రామం నిర్మించ‌డం చూస్తే షీ జిన్ పింగ్‌కు మోడీ స‌ర్కారు ప్రత్యేక ఆవాస్ యోజన క‌ల్పించిన‌ట్లు ఉంద‌ని ఒవైసీ ఎద్దేవా చేశారు. మ‌రి ఈ వ్య‌వ‌హారంపై మోడీ అండ్ కో ఎలా స్పందిస్తుందో చూడాలి.

This post was last modified on January 19, 2021 9:45 am

Share
Show comments
Published by
Satya
Tags: ChinaIndia

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

2 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

4 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

5 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

6 hours ago