Political News

మౌనికా రెడ్డి నోరు ఎందుకని లేవటం లేదు ?

‘ఆడపిల్లని అని కూడా చూడకుండా దారుణంగా అరెస్టు చేశారు.. తెలంగాణా, ఏపి ప్రభుత్వాలు తమపై కుట్రచేసి కేసుల్లో ఇరుకిస్తున్నాయి..ఒక టెర్రరిస్టును అరెస్టు చేసినట్లుగా మా అక్కను అరెస్టు చేశారు పోలీసులు’ … ఇది మాజీమంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ అరెస్టు అయినపుడు ఆమె సోదరి భూమా మౌనికారెడ్డి చేసిన గోల. తన అక్క అరెస్టుకు వ్యతిరేకంగా మూడు రోజుల పాటు మౌనిక నానా రచ్చ చేసింది మీడియాలో. తల్లి, దండ్రులు లేని పిల్లలమని తెలిసి తమను వేధిస్తున్నారంటూ సెంటిమెంటు డైలాగులు చాలానే పేల్చింది.

అయితే గడచిన నాలుగు రోజుల నుండి మౌనికారెడ్డి ఎక్కడా కనబడటం లేదు, వినబడటం లేదు. కారణం ఏమిటో స్పష్టంగా తెలీదు కానీ ఆమె మొబైల్ ఫోన్ కూడా స్విచ్చాఫ్ అని వస్తోందట. తన సోదరి గురించి మౌనిక ఎందుకు మాట్లాడటం లేదు ఇపుడు అన్నదే ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అఖిలను ఎవరు కూడా తప్పుడు కేసులో ఇరికించలేదు. వందల కోట్ల రూపాయలు విలువైన భూమి వివాదంలో తన భర్త భార్గవరామ్, అత్త కిరణ్యి, మామగారు మురళి, మరిది చంద్రహాస్ తో కలిసి అఖిల కిడ్నాప్ కు ప్లాన్ చేసిన విషయం బయటపడింది.

అసలు కిడ్నాప్ ఘటన వెలుగు చూడగానే పోలీసులు ముందుగా అరెస్టు చేసిందే అఖిలను. మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా, మొబైల్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు పక్కా ఆధారాలను సేకరించిన తర్వాత పోలీసులు అఖిలను అరెస్టు చేశారు. అయితే ఆమె సోదరి మౌనిక మాత్రం ఆడపిల్లలమని, తల్లి, దండ్రులు లేనివారమని ఇలా ఏమిటేమిటో మాట్లాడుతూ సెంటిమెంటును పండిద్దామని తెగ ప్రయత్నించింది. అయితే ఆమె మాటలను ఎవరు కూడా నమ్మలేదు.

తన బావ భార్గవరామ్, తమ్ముడు జగద్విఖ్యాతరెడ్డి కనబడటం లేదని తనకు చాలా ఆందోళనగా ఉందంటూ నానా గోల చేసింది. అయితే బావ, మరుదులిద్దరు తప్పించుకుని తిరుగుతున్నారంటూ పోలీసులు పదే పదే ప్రకటించిన విషయం తెలిసిందే. భార్గవ్ మహారాష్ట్రలో ఉంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జగద్విఖ్యాత్ ఎక్కడున్నాడో మాత్రం ఇంకా ఆచూకీ కనుక్కోలేకపోయారు. ఇదే సమయంలో కిడ్నాప్ గ్యాంగుకు ఇన్ కమ్ ట్యాక్సు అధికారుల్లాగ శిక్షణిచ్చింది, కార్లను సమకూర్చింది మొత్తం అఖిల అత్త, మామలే అని పోలీసులు దర్యాప్తులో బయటపడింది.

అంటే అన్నీ వైపులా తన అక్క అఖిల కిడ్నాప్ కేసులో ఇరుక్కుపోయిందని తెలిసిన తర్వాతే మౌనిక మీడియాకు దొరక్కుండా తిరుగుతున్నట్లు అర్ధమవుతోంది. అక్కే కాదు బావ, తమ్ముడు, బావ తల్లి, దండ్రులు, సోదరుడు కూడా కిడ్నాప్ లో కీలక భాగస్వాములని ఆధారాలతో సహా పోలీసులు బయటపెట్టిన తర్వాత ఇక తానేం చెప్పినా జనాలు నమ్మరని మౌనికారెడ్డికి అర్ధమైపోయినట్లుంది. అందుకనే ఆళ్ళగడ్డ, నంద్యాల, హైదరాబాద్ లో ఎక్కడా కనబడటం లేదు. పైగా తన మొబైల్ ఫోన్ను కూడా స్విచ్చాఫ్ చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికి 19 మందిని అరెస్టు చేసిన పోలీసులు ఇంకా కీలక నిందితుల కోసం వెతుకుతున్నారు. వాళ్ళు కూడా దొరికిన తర్వాత మొత్తం వ్యవహారమంతా బయటపడితే అప్పుడు అక్కా, చెల్లెళ్ళు ఏమి మాట్లాడుతారో చూడాలి.

This post was last modified on January 18, 2021 2:13 pm

Share

Recent Posts

జగన్ ఎలా అంటే కేటీఆర్ కూడా అలానే

జగన్ ఇటీవ‌ల కాలంలో స‌హ‌నం కోల్పోతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌న పార్టీ వారిపై కేసులు పెట్టినా.. త‌మ…

4 hours ago

అంజికి ఒడిస్సికి కనెక్షన్ ఏంటి

అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…

4 hours ago

బుట్టబొమ్మకు ఏ ప్రయోజనం లేదు

బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…

5 hours ago

ఏడున్న‌ర గంట‌ల‌పాటు నిల‌బ‌డిన లోకేష్‌

ఒక గంట నిల‌బ‌డేందుకే ఇబ్బంది ప‌డ‌తాం. అలాంటిది ఏకంగా ఏడున్న‌ర‌గంట‌ల పాటు ఏక‌బిగిన నిల‌బ‌డ‌డం అంటే మాట‌లా? ఊహించేందుకే క‌ష్ట‌మైన…

5 hours ago

కనకవర్షం కురవాల్సిందే కనకరాజూ

కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…

6 hours ago

అంబటి నోటి దురుసు తగ్గేలా లేదు

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…

6 hours ago