అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షునిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న తేదీ దగ్గర పడుతున్న కొద్దీ వాషింగ్టన్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఈనెల 20వ తేదీన బైడెన్ వైట్ హౌస్ లో ప్రమాణస్వీకారం చేయబోతున్న విషయం అందరికి తెలిసిందే. సుమారు 10 రోజుల క్రితం అమెరికా పార్లమెంటు క్యాపిటల్ బిల్డింగ్ పై కొన్ని వందలమంది ఒక్కసారిగా దాడులు చేసిన బీభత్సం అందరికీ తెలిసిందే. తర్వాత వారిలో అత్యధికులను అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులుగా గుర్తించారు. దాంతో అమెరికా మొత్తం ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోయింది.
ఈనెల 20వ తేదీన వైట్ హౌస్ మీద కూడా ఎవరైనా దాడులు జరిపే ప్రమాదం ఉందని అమెరికా పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకనే ముందుజాగ్రత్తగా వైట్ హౌస్ చుట్టుపక్కల భారీ బందోబస్తు పెట్టారు. అలాగే వాషింగ్టన్ నగరంలోకి రాకపోకల మీద కూడా నిషేధం విధించారు. వాహనాలను చెక్ చేయకుండా ఎవరినీ లోపలకు అనుమతించటం లేదు. ఇటువంటి చెకింగ్ లో ఓ వ్యక్తి దగ్గర నుండి తుపాకి, 500 రౌండ్ల బుల్లెట్లు పట్టుబడటంతో యావత్ అమెరికా ఉలిక్కిపడింది.
తుపాకి, బుల్లెట్లతో పట్టుబడిన వ్యక్తిని వర్జీనియా రాష్ట్రానికి చెందిన వెస్లీ బాలర్ గా పోలీసులు గుర్తించారు. భద్రతాధికారుల కళ్ళుకప్పి బైడెన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో హాజరవ్వటానికి వెస్లీ వాషింగ్టన్ కు చేరుకున్నట్లు సమాచారం. అతని దగ్గర ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనేందుకు పాస్ కూడా దిరికింది. దాంతో పోలీసులు, వైట్ హౌస్ ఉన్నతాధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
అతని దగ్గర దొరికిన పాస్ ను జాగ్రత్తగా గమనిస్తే అది నకిలీదని తేలిపోయింది. అంటే ఇలాంటి పాసులు తీసుకుని ఇంకెమంది ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవబోతున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇలాంటి వ్యక్తులు ఇంకా చాలామందే ఉండచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బెడైన్ను అధ్యక్షునిగా ప్రమాణం చేయనిచ్చేది లేదని ఇప్పటికే ట్రంప్ మద్దతుదారులు హెచ్చరించటం, ముందుగా హెచ్చరించినట్లే తాజాగా ఓ వ్యక్తి నకిలీ పాస్ తో వాషింగ్టన్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించటం, తుపాకితో పాటు 500 రౌండ్లబుల్లెట్లు దొరకటంతో అధ్యక్షుని భద్రతా సిబ్బంది ఉన్నతాధికారులు హై అలెర్టు ప్రకటించారు. ప్రమాణస్వీకారం రోజున ఎవరు ఏమూల నుండి దాడులు చేస్తారో తెలీక అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది.
This post was last modified on January 18, 2021 10:56 am
'ఫౌజీ' సినిమా నుంచి ఇప్పటిదాకా వచ్చిన పోస్టర్లు చూస్తుంటే మేకర్స్ ఇంటెన్షన్ క్లియర్ గా అర్థమవుతోంది. ప్రభాస్ ను సాఫ్ట్…
ఎన్నికల్లో నోట్లు పంపిణీ చేస్తేనే ఓట్లు వేయడం మామూలైపోయింది. గత కొన్నేళ్లుగా ఈ దుస్సాంప్రదాయం పెరిగిపోయింది. దీంతో నిజంగా ప్రజలకు…
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది.…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవల ప్రకటించిన `పాఠశాలల అభివృద్ధి` కార్యక్రమానికి 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలే…
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్…
గత కొన్ని రోజులుగా మలయాళ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.…