తెలంగాణ రాష్ట్ర గిరిజన.. మహిళా శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు. మానత్వంతో ఆమె స్పందించిన తీరుతో అందరి మనసుల్ని దోచేస్తున్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో డోర్నకల్ కు చెందిన 28 ఏళ్ల రషీద్ పాషా మరణించటం తెలిసిందే. దీంతో.. పాషా ఇద్దరు కుమార్తెలు అనాథలైనట్లుగా తెలుసుకున్న మంత్రి.. ఆదివారం డోర్నకల్ కు వచ్చారు. వారి ఇద్దరు పిల్లల్ని అక్కున చేర్చుకున్నారు.
తానురాష్ట్రానికి మంత్రిని కావొచ్చుకానీ.. వారిద్దరికి మాత్రం తల్లినని పేర్కొన్నారు. నాలుగేళ్ల కరిష్మాని ఒడిలో పెట్టుకొని.. ప్రమాదంలో గాపడిన కాలికి ఆపరేషన్ జరిగిన తొమ్మిదేళ్ల సుహానాను ఓదార్చారు. ఊహ తెలియని వయసులో ఇంత కష్టమా? ఆ దేవుడికి దయ లేదా? అంటూ వాపోయి.. కన్నీళ్లు పెట్టుకున్న ఆమె.. వారిద్దరిని దత్తత తీసుకోవాలని నిర్ణయించారు. ఇద్దరు పిల్లల్ని ప్రభుత్వ చిల్డ్రన్స్ హోంలో చేర్పిస్తానని.. వారి బాగోగులు తానే స్వయంగా చూస్తానని మాటిచ్చారు.
పిల్లల బంధువుల అంగీకారంతో చట్టబద్ధమైన చర్యల అనంతరం.. ఇద్దరు పిల్లల్ని తాను దత్తత తీసుకుంటానని తేల్చిన ఆమె.. పిల్లలకు తోడుగా వచ్చి.. వారి సంరక్షణ బాధ్యతల్ని తీసుకునే వారికి హోంలో ఉద్యోగం కూడా ఇస్తామని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదంతో అనాధులుగా మారిన చిన్నారుల విషయంలో మంత్రి స్పందించిన తీరుపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
This post was last modified on January 18, 2021 10:51 am
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయన ప్రాభవాన్ని.. వైభవాన్ని…
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పేర్ని నాని. వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి. గత ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకొని వారసుడు కిట్టుకు…
అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ అంటే తెలుగులో అంతకుమించిన బంపరాఫర్ లేదన్నట్లే. హిట్ మెషీన్గా పేరు తెచ్చుకున్న అనిల్.. ఇప్పటిదాకా…
ఏఐని వాడుకుని ఇప్పుడు హీరోయిన్ల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా జనాలు ఎలా రెచ్చిపోతున్నారో.. ఇంటర్నెట్ ఎంత విశృంఖలంగా తయారైందో చూస్తూనే…