తెలంగాణ రాష్ట్ర గిరిజన.. మహిళా శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు. మానత్వంతో ఆమె స్పందించిన తీరుతో అందరి మనసుల్ని దోచేస్తున్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో డోర్నకల్ కు చెందిన 28 ఏళ్ల రషీద్ పాషా మరణించటం తెలిసిందే. దీంతో.. పాషా ఇద్దరు కుమార్తెలు అనాథలైనట్లుగా తెలుసుకున్న మంత్రి.. ఆదివారం డోర్నకల్ కు వచ్చారు. వారి ఇద్దరు పిల్లల్ని అక్కున చేర్చుకున్నారు.
తానురాష్ట్రానికి మంత్రిని కావొచ్చుకానీ.. వారిద్దరికి మాత్రం తల్లినని పేర్కొన్నారు. నాలుగేళ్ల కరిష్మాని ఒడిలో పెట్టుకొని.. ప్రమాదంలో గాపడిన కాలికి ఆపరేషన్ జరిగిన తొమ్మిదేళ్ల సుహానాను ఓదార్చారు. ఊహ తెలియని వయసులో ఇంత కష్టమా? ఆ దేవుడికి దయ లేదా? అంటూ వాపోయి.. కన్నీళ్లు పెట్టుకున్న ఆమె.. వారిద్దరిని దత్తత తీసుకోవాలని నిర్ణయించారు. ఇద్దరు పిల్లల్ని ప్రభుత్వ చిల్డ్రన్స్ హోంలో చేర్పిస్తానని.. వారి బాగోగులు తానే స్వయంగా చూస్తానని మాటిచ్చారు.
పిల్లల బంధువుల అంగీకారంతో చట్టబద్ధమైన చర్యల అనంతరం.. ఇద్దరు పిల్లల్ని తాను దత్తత తీసుకుంటానని తేల్చిన ఆమె.. పిల్లలకు తోడుగా వచ్చి.. వారి సంరక్షణ బాధ్యతల్ని తీసుకునే వారికి హోంలో ఉద్యోగం కూడా ఇస్తామని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదంతో అనాధులుగా మారిన చిన్నారుల విషయంలో మంత్రి స్పందించిన తీరుపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
This post was last modified on January 18, 2021 10:51 am
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…