దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాబాయి అయిన వైఎస్ వివేకానంద రెడ్డి తన స్వగృహంలో దారుణంగా హత్యకు గురై దాదాపు రెండేళ్లు కావస్తోంది. ముందు వివేకా గుండెపోటుతో చనిపోయాడని సాక్షి మీడియాలో వార్తలు రావడం.. కొన్ని గంటల తర్వాత ఆయనది దారుణ హత్య అని తేలడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
హత్య జరిగినపుడు ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి జగన్ అండ్ కో ఏమీ చేయలేకపోయింది అనుకుందాం. ఆ హత్య టీడీపీ వాళ్లే చేయించారని కూడా జగన్ ఆరోపించాడు. ఐతే రెండు నెలలు తిరిగే సరికి జగన్ సర్కారు అధికారంలోకి వచ్చింది. కానీ ఈ హత్యకు బాధ్యులెవరు.. అసలేం జరిగింది అన్నది తేల్చలేకపోవడమే ఆశ్చర్యం కలిగించే విషయం.
తన సొంత బాబాయి హత్య కేసును ఛేదించే విషయంలో సీఎం జగన్ ఎందుకు చొరవ చూపట్లేదు.. పోలీస్ విభాగంపై ఎందుకు ఒత్తిడి తేవట్లేదు అన్నది ఆయన అభిమానులకే అర్థం కావడం లేదు. తన అన్న ముఖ్యమంత్రిగా ఉండగా.. తండ్రి హత్య కేసు విషయంలో న్యాయం కోసం వివేకా తనయురాలు సునీతా రెడ్డి ఒంటరిగో పోరాడాల్సి రావడం, కోర్టులతో పాటు వేరే మార్గాల ద్వారా తన ప్రయత్నాలు కొనసాగించాల్సి రావడం విచారించాల్సిన విషయం.
తాజాగా ఆమె ఈ కేసు విషయమై కేరళకు వెళ్లడం గమనార్హం. కేరళలో సంచలనం రేపిన సిస్టర్ ఆచార్య కేసు విషయంలో అలుపెరగని పోరాటం చేసిన జోమన్ పుదన్ పురక్కల్ అనే సామాజిక వేత్తను సునీతా రెడ్డి కలిశారు. ఆయనతో సునీత సమావేశమైన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. తన అన్నయ్య ముఖ్యమంత్రిగా ఉండగా.. తండ్రి హత్య కేసుకు సంబంధించి వేరే రాష్ట్రానికి వెళ్లి ఎవరెవరినో కలవాల్సి రావడం చూసి సునీతపై జాలి పడాల్సిందే. దీనికి వైసీపీ మద్దతుదారులైనా ఏం సమాధానం చెబుతారో?
పెద్ది థియేటర్ రన్ ముగింపు దిశగా వెళ్తోంది. ఈ వీకెండ్ కాస్త పికపయ్యే అవకాశాలున్నాయి. పాత రీ రిలీజులు తప్ప…
ఇటీవలే సింగర్ సునీత మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్త్రీలు 'నా శరీరం నా ఇష్టం' అన్నప్పుడు అవతలి…
గత ఏడాది మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్లో ఆరుగురు సైనికులు వీరమరణం చెందినట్టు కేంద్రం తాజాగా వెల్లడించింది. దాదాపు 13…
రాజమౌళి సినిమాలకు ఎప్పుడూ వచ్చే సమస్య ఒకటుంది. అదే చెప్పిన రిలీజ్ డేట్ కి కట్టుబడకపోవడం. బాహుబలి రెండు భాగాలు,…
తెలంగాణలో ఓ కీలక నియామకానికి సంబంధించిన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…
ఏపీ సీఎం చంద్రబాబు సాధారణ ప్రజలతో ఇటీవల కాలంలో మమేకమవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఎక్స్ వేదికగా పోస్టు…