దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాబాయి అయిన వైఎస్ వివేకానంద రెడ్డి తన స్వగృహంలో దారుణంగా హత్యకు గురై దాదాపు రెండేళ్లు కావస్తోంది. ముందు వివేకా గుండెపోటుతో చనిపోయాడని సాక్షి మీడియాలో వార్తలు రావడం.. కొన్ని గంటల తర్వాత ఆయనది దారుణ హత్య అని తేలడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
హత్య జరిగినపుడు ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి జగన్ అండ్ కో ఏమీ చేయలేకపోయింది అనుకుందాం. ఆ హత్య టీడీపీ వాళ్లే చేయించారని కూడా జగన్ ఆరోపించాడు. ఐతే రెండు నెలలు తిరిగే సరికి జగన్ సర్కారు అధికారంలోకి వచ్చింది. కానీ ఈ హత్యకు బాధ్యులెవరు.. అసలేం జరిగింది అన్నది తేల్చలేకపోవడమే ఆశ్చర్యం కలిగించే విషయం.
తన సొంత బాబాయి హత్య కేసును ఛేదించే విషయంలో సీఎం జగన్ ఎందుకు చొరవ చూపట్లేదు.. పోలీస్ విభాగంపై ఎందుకు ఒత్తిడి తేవట్లేదు అన్నది ఆయన అభిమానులకే అర్థం కావడం లేదు. తన అన్న ముఖ్యమంత్రిగా ఉండగా.. తండ్రి హత్య కేసు విషయంలో న్యాయం కోసం వివేకా తనయురాలు సునీతా రెడ్డి ఒంటరిగో పోరాడాల్సి రావడం, కోర్టులతో పాటు వేరే మార్గాల ద్వారా తన ప్రయత్నాలు కొనసాగించాల్సి రావడం విచారించాల్సిన విషయం.
తాజాగా ఆమె ఈ కేసు విషయమై కేరళకు వెళ్లడం గమనార్హం. కేరళలో సంచలనం రేపిన సిస్టర్ ఆచార్య కేసు విషయంలో అలుపెరగని పోరాటం చేసిన జోమన్ పుదన్ పురక్కల్ అనే సామాజిక వేత్తను సునీతా రెడ్డి కలిశారు. ఆయనతో సునీత సమావేశమైన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. తన అన్నయ్య ముఖ్యమంత్రిగా ఉండగా.. తండ్రి హత్య కేసుకు సంబంధించి వేరే రాష్ట్రానికి వెళ్లి ఎవరెవరినో కలవాల్సి రావడం చూసి సునీతపై జాలి పడాల్సిందే. దీనికి వైసీపీ మద్దతుదారులైనా ఏం సమాధానం చెబుతారో?
This post was last modified on %s = human-readable time difference 3:11 pm
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, బీఆర్ఎస్ పార్టీ రథసారథి, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్…
యూత్ హీరోలు తమ సినిమా మీద నమ్మకంతో ఒక్కోసారి పెద్ద స్టేట్ మెంట్లు ఇచ్చేస్తారు. కొన్నిసార్లు అవి నిజమైతే ఇంకొన్ని…
వైసీపీ అధినేత, తన సోదరుడు వైఎస్ జగన్పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. జగన్ నాయకుడో…
ఒక సినిమా బాగుండటం బాగోకపోవడం పూర్తిగా దాన్ని తీసిన దర్శక నిర్మాత రచయితల బృందం మీద ఆధారపడి ఉంటుంది తప్ప…
మాములుగా ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా హీరో సినిమా వస్తోందంటే బరిలో ఎవరు ఉండరు. ఒకవేళ ముందే ప్లాన్ చేసుకున్నా…
టీడీపీ జాతీయ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా తమ్ముళ్లకు సరికొత్త టార్గెట్ విధించారు. ఒక్కొక్కరికీ వెయ్యి చొప్పున సభ్యత్వాల…