Political News

కోవాగ్జిన్‌తో తేడా వ‌స్తే.. భార‌త్ బ‌యోటెక్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరులో భాగంగా శ‌నివారం భారత్ పెద్ద ముంద‌డుగు వేసింది. దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో క‌రోనా వ్యాక్సినేష‌న్ మొద‌లైంది. కోవిడ్ పోరులో కీల‌క పాత్ర పోషిస్తూ వ‌స్తున్న ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్ల‌కు వ్యాక్సిన్ వేశారు. సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ వారి కోవిషీల్డ్‌తో పాటు భార‌త్ బ‌యోటెక్ వారి కోవాగ్జిన్‌ను దేశ‌వ్యాప్తంగా వేలాది మంది ఫ‌స్ట్ డోస్‌గా తీసుకున్నారు.

ఐతే వీరిలో దాదాపు 50 మంది దాకా అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డం, అందులో ఒక‌రి పరిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు రావ‌డం ఆందోళ‌న రేకెత్తించింది. ఇప్ప‌టికే నార్వే దేశంలో ఫైజ‌ర్ టీకా తీసుకున్న 23 మంది సైడ్ ఎఫెక్ట్స్ వ‌ల్ల‌ మృత్యువాత ప‌డ్డ‌ట్లు వార్త‌లొస్తుండ‌గా.. దేశంలో వ్యాక్సినేష‌న్ తొలి రోజు కొంద‌రు అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డం ఆందోళ‌న పెంచేదే.

ఐతే ఏ వ్యాన్సిన్‌తోనైనా కొంద‌రికి సైడ్ ఎఫెక్ట్స్ రావ‌డం స‌హ‌జ‌మే అని, దీన్ని మ‌రీ సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన ప‌ని లేద‌ని వైద్య నిపుణులు అంటున్నారు. కాగా తాము త‌యారు చేసిన కోవాగ్జిన్ వ‌ల్ల దుష్ప్ర‌భావాలు ఉంటే.. ఆ పేషెంట్ కోలుకునే వ‌ర‌కు వైద్యం అందించ‌డంతో పాటు ప‌రిహారం కూడా చెల్లిస్తామంటూ భార‌త్ బ‌యోటెక్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. త‌ద్వారా వ్యాక్సిన్ తీసుకునేవారికి భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. “టీకా వేసుకున్న తర్వాత అత్యంత తీవ్రమైన పరిస్థితులు తలెత్తితే అత్యున్నత ప్రమాణాలతో, ప్రభుత్వ ఆమోదం ఉన్న అధికారిక ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తాం. వ్యాక్సిన్‌ కారణంగా దుష్ప్రభావాలు ఎదురయ్యాయని నిరూపితమైతే బీబీఐఎల్‌ నష్ట పరిహారం చెల్లిస్తుంది” అని భార‌త్ బ‌యోటెక్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

శ‌నివారం దేశ‌వ్యాప్తంగా మొత్తం 1,65,714 మంది కరోనా నిరోధక వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది.

This post was last modified on January 17, 2021 11:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

18 minutes ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

1 hour ago

‘పాదయాత్ర చేసినా వైఎస్ వారసులు కాలేరు’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాద‌యాత్ర…

1 hour ago

ఈ బీజేపీ ఎంపీకి ఏమైంది?

ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…

2 hours ago

కొణిదెల నిహారిక: ఫ్రేమ్ మారినా, గ్లామర్ మాత్రం అలాగే..

యాంకర్‌గా మొదలై, హీరోయిన్‌గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…

2 hours ago

తారక్ అభిమానులు లైట్ తీసుకున్నారు

స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…

5 hours ago