Political News

కోవాగ్జిన్‌తో తేడా వ‌స్తే.. భార‌త్ బ‌యోటెక్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరులో భాగంగా శ‌నివారం భారత్ పెద్ద ముంద‌డుగు వేసింది. దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో క‌రోనా వ్యాక్సినేష‌న్ మొద‌లైంది. కోవిడ్ పోరులో కీల‌క పాత్ర పోషిస్తూ వ‌స్తున్న ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్ల‌కు వ్యాక్సిన్ వేశారు. సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ వారి కోవిషీల్డ్‌తో పాటు భార‌త్ బ‌యోటెక్ వారి కోవాగ్జిన్‌ను దేశ‌వ్యాప్తంగా వేలాది మంది ఫ‌స్ట్ డోస్‌గా తీసుకున్నారు.

ఐతే వీరిలో దాదాపు 50 మంది దాకా అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డం, అందులో ఒక‌రి పరిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు రావ‌డం ఆందోళ‌న రేకెత్తించింది. ఇప్ప‌టికే నార్వే దేశంలో ఫైజ‌ర్ టీకా తీసుకున్న 23 మంది సైడ్ ఎఫెక్ట్స్ వ‌ల్ల‌ మృత్యువాత ప‌డ్డ‌ట్లు వార్త‌లొస్తుండ‌గా.. దేశంలో వ్యాక్సినేష‌న్ తొలి రోజు కొంద‌రు అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డం ఆందోళ‌న పెంచేదే.

ఐతే ఏ వ్యాన్సిన్‌తోనైనా కొంద‌రికి సైడ్ ఎఫెక్ట్స్ రావ‌డం స‌హ‌జ‌మే అని, దీన్ని మ‌రీ సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన ప‌ని లేద‌ని వైద్య నిపుణులు అంటున్నారు. కాగా తాము త‌యారు చేసిన కోవాగ్జిన్ వ‌ల్ల దుష్ప్ర‌భావాలు ఉంటే.. ఆ పేషెంట్ కోలుకునే వ‌ర‌కు వైద్యం అందించ‌డంతో పాటు ప‌రిహారం కూడా చెల్లిస్తామంటూ భార‌త్ బ‌యోటెక్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. త‌ద్వారా వ్యాక్సిన్ తీసుకునేవారికి భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. “టీకా వేసుకున్న తర్వాత అత్యంత తీవ్రమైన పరిస్థితులు తలెత్తితే అత్యున్నత ప్రమాణాలతో, ప్రభుత్వ ఆమోదం ఉన్న అధికారిక ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తాం. వ్యాక్సిన్‌ కారణంగా దుష్ప్రభావాలు ఎదురయ్యాయని నిరూపితమైతే బీబీఐఎల్‌ నష్ట పరిహారం చెల్లిస్తుంది” అని భార‌త్ బ‌యోటెక్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

శ‌నివారం దేశ‌వ్యాప్తంగా మొత్తం 1,65,714 మంది కరోనా నిరోధక వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది.

This post was last modified on January 17, 2021 11:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

శాంతి కోసం చాలా కష్టపడ్డారు కానీ

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…

1 hour ago

పాక్ నక్క బుద్ధి… నష్టం తట్టుకోలేరు

టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…

1 hour ago

అసలు చంద్రబాబు ప్రమేయమే లేదు

2023లో స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న…

2 hours ago

ఏబీఎన్ రిపోర్టర్ పై బీఆర్ఎస్ దాడి.. ఎవరికి నష్టం?

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ…

4 hours ago

ఒకేసారి ఇన్ని సినిమాలు ఎందుక‌య్యా?

ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న‌ట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్య‌వ‌హారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమ‌లు రిలీజ‌య్యాయి. కానీ త‌ర్వాతి…

4 hours ago

అంబటి మీద అన్ని కేసులా?

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబుపై టీడీపీ…

5 hours ago