కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా శనివారం భారత్ పెద్ద ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ మొదలైంది. కోవిడ్ పోరులో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ వేశారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ వారి కోవిషీల్డ్తో పాటు భారత్ బయోటెక్ వారి కోవాగ్జిన్ను దేశవ్యాప్తంగా వేలాది మంది ఫస్ట్ డోస్గా తీసుకున్నారు.
ఐతే వీరిలో దాదాపు 50 మంది దాకా అస్వస్థతకు గురి కావడం, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు రావడం ఆందోళన రేకెత్తించింది. ఇప్పటికే నార్వే దేశంలో ఫైజర్ టీకా తీసుకున్న 23 మంది సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మృత్యువాత పడ్డట్లు వార్తలొస్తుండగా.. దేశంలో వ్యాక్సినేషన్ తొలి రోజు కొందరు అస్వస్థతకు గురి కావడం ఆందోళన పెంచేదే.
ఐతే ఏ వ్యాన్సిన్తోనైనా కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ రావడం సహజమే అని, దీన్ని మరీ సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదని వైద్య నిపుణులు అంటున్నారు. కాగా తాము తయారు చేసిన కోవాగ్జిన్ వల్ల దుష్ప్రభావాలు ఉంటే.. ఆ పేషెంట్ కోలుకునే వరకు వైద్యం అందించడంతో పాటు పరిహారం కూడా చెల్లిస్తామంటూ భారత్ బయోటెక్ కీలక ప్రకటన చేసింది. తద్వారా వ్యాక్సిన్ తీసుకునేవారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది. “టీకా వేసుకున్న తర్వాత అత్యంత తీవ్రమైన పరిస్థితులు తలెత్తితే అత్యున్నత ప్రమాణాలతో, ప్రభుత్వ ఆమోదం ఉన్న అధికారిక ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తాం. వ్యాక్సిన్ కారణంగా దుష్ప్రభావాలు ఎదురయ్యాయని నిరూపితమైతే బీబీఐఎల్ నష్ట పరిహారం చెల్లిస్తుంది” అని భారత్ బయోటెక్ ఓ ప్రకటనలో పేర్కొంది.
శనివారం దేశవ్యాప్తంగా మొత్తం 1,65,714 మంది కరోనా నిరోధక వ్యాక్సిన్ వేయించుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
This post was last modified on January 17, 2021 11:02 am
తెలుగులో ఇప్పుడు ఏదైనా ఒక మంచి పాట రిలీజైతే సంగీత ప్రియులు ఓవైపు దాన్ని ఆస్వాదిస్తూనే, మరోవైపు ఆ సాంగ్…
వైసీపీ అధినేత జగన్పై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించడం అందరికీ తెలిసిందే. తరచుగా ఎక్కడ అవకాశం ఉన్నా..…
సినీ రంగంలో ఒకరు చేయాల్సిన పాత్ర ఇంకొకరికి వెళ్లడం చాలా కామన్ విషయం. కొన్నిసార్లు కొందరు ఆర్టిస్టులను ఎంచుకుని, వారు…
కొన్ని కార్యక్రమాల వేళ.. కొన్ని అంశాలకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారీ…
ఏపీ సీఎం చంద్రబాబు అనుకున్నది సాధించడంలో దిట్ట. అది సమస్య అయినా, లేక అభివృద్ధి కార్యక్రమమైనా.. విషయం ఏదైనా చంద్రబాబు…
తెలుగుదేశం పార్టీ నేతలకు సీఎం, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు మీ…