కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా శనివారం భారత్ పెద్ద ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ మొదలైంది. కోవిడ్ పోరులో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ వేశారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ వారి కోవిషీల్డ్తో పాటు భారత్ బయోటెక్ వారి కోవాగ్జిన్ను దేశవ్యాప్తంగా వేలాది మంది ఫస్ట్ డోస్గా తీసుకున్నారు.
ఐతే వీరిలో దాదాపు 50 మంది దాకా అస్వస్థతకు గురి కావడం, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు రావడం ఆందోళన రేకెత్తించింది. ఇప్పటికే నార్వే దేశంలో ఫైజర్ టీకా తీసుకున్న 23 మంది సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మృత్యువాత పడ్డట్లు వార్తలొస్తుండగా.. దేశంలో వ్యాక్సినేషన్ తొలి రోజు కొందరు అస్వస్థతకు గురి కావడం ఆందోళన పెంచేదే.
ఐతే ఏ వ్యాన్సిన్తోనైనా కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ రావడం సహజమే అని, దీన్ని మరీ సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదని వైద్య నిపుణులు అంటున్నారు. కాగా తాము తయారు చేసిన కోవాగ్జిన్ వల్ల దుష్ప్రభావాలు ఉంటే.. ఆ పేషెంట్ కోలుకునే వరకు వైద్యం అందించడంతో పాటు పరిహారం కూడా చెల్లిస్తామంటూ భారత్ బయోటెక్ కీలక ప్రకటన చేసింది. తద్వారా వ్యాక్సిన్ తీసుకునేవారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది. “టీకా వేసుకున్న తర్వాత అత్యంత తీవ్రమైన పరిస్థితులు తలెత్తితే అత్యున్నత ప్రమాణాలతో, ప్రభుత్వ ఆమోదం ఉన్న అధికారిక ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తాం. వ్యాక్సిన్ కారణంగా దుష్ప్రభావాలు ఎదురయ్యాయని నిరూపితమైతే బీబీఐఎల్ నష్ట పరిహారం చెల్లిస్తుంది” అని భారత్ బయోటెక్ ఓ ప్రకటనలో పేర్కొంది.
శనివారం దేశవ్యాప్తంగా మొత్తం 1,65,714 మంది కరోనా నిరోధక వ్యాక్సిన్ వేయించుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
This post was last modified on January 17, 2021 11:02 am
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…
మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…
జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…