Political News

వ్యవసాయ చట్టాల వివాదానికి చక్కటి పరిష్కారం

కేంద్రం అమల్లోకి తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాల వివాదానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ సీ. రంగరాజన్ చక్కటి పరిష్కారాన్ని చూపారు. కేంద్రం మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుసంఘాలు ఉద్యమాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే అని రైతుసంఘాలు పట్టుబడుతుండగా, రద్దు సమస్య లేదని కావాలంటే సవరణలు తీసుకొస్తామని కేంద్రం చెబుతోంది.

ఈ ఒక్క పాయింట్ దగ్గరే సమస్య ఎంతకీ తెగక ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లోని సింఘూ వద్ద గడచిన 50 రోజులుగా పెద్దఎత్తున ఉద్యమం జరుగుతోంది. ఇదే విషయమై ఆర్బీఐ మాజీ గవర్నర్ సీ. రంగరాజన్ మాట్లాడుతూ వ్యవసాయ చట్టాల అమలు విషయాన్ని కేంద్రం రాష్ట్రాలకు వదిలేయాలని స్పష్టంచేశారు. నిజానికి ఇపుడు వ్యవసాయచట్టాలు చేయటం, వాటిని అమలు చేయటం, చట్టాల నియంత్రణ లాంటివన్నీ ఇపుడు కేంద్రం చేతిలో ఉన్నాయి.

అయితే చట్టాలు చేయటం, అమలు చేయటం తప్ప ఇతరత్రా విషయాలేవీ కేంద్రం చేతిలో లేవన్న విషయం తెలిసిందే. జరుగుతున్న వ్యవసాయం మొత్తం రాష్ట్రాల పరిధుల్లోనే ఉన్నాయి. మళ్ళీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకంగా వ్యవసాయరంగానికి తమ బడ్జెట్లో కేటాయింపులు కూడా చేసుకుంటున్నాయి. చట్టాలు చేయటం మినహా ఇతరత్రా ఏ విధంగాను పాత్రలేని కేంద్రానికి వ్యవసాయచట్టాలు చేయాల్సిన అవసరం ఏమిటని రంగరాజన్ ప్రశ్న.

రంగరాజన్ ప్రశ్న చాలా అర్ధవంతంగానే ఉంది. ఇప్పటి వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలును కేంద్రం రాష్ట్రాల మీద రుద్దకూడదన్నారు. వ్యవసాయ చట్టాలను అమలు అవకాశాలను కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చేస్తే సమస్య పరిష్కారమవుతుందన్నారు. కేంద్ర చట్టాలను అమలు చేయాలని అనుకుంటున్న రాష్ట్రప్రభుత్వాలు అందుకు చొరవ తీసుకుంటాయని లేకపోతే పాత చట్టాలను అదీకాకపోతే తమకు అనువుగా ఉండే చట్టాలను రాష్ట్రాలే తీసుకుంటాయని మాజీ గవర్నర్ చేసిన సూచన బాగానే ఉంది.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

60 minutes ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

1 hour ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

1 hour ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

3 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

4 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

4 hours ago