Political News

నీడ్ ఆఫ్ ది అవర్..జగన్ గోపూజ

రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలు పెరిగిపోతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గోపూజ నిర్వహించారు. గడచిన మూడు మాసాలుగా రాష్ట్రంలోని వివిద దేవాలయాలపై దాడులు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అంతర్వేది, రామతీర్ధం లాంటి దేవాలయాలపై దాడులు చేసిన గుర్తుతెలీని వ్యక్తులు రథాన్ని, విగ్రహాలను ద్వంసం చేశారు. ఈ నేపధ్యంలోనే ప్రతిపక్షాలు అవకాశంగా తీసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివాదాలను రేపుతున్నాయి.

ఇటువంటి అనేక ఘటనలను దృష్టిలో పెట్టుకునే అన్నట్లుగా సంక్రాంతి పండగ సందర్భంగా కనుమపండుగ రోజు శుక్రవారం ప్రభుత్వం పెద్ద ఎత్తున గోపూజ నిర్వహించింది. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో జరిగిన గోపూజలో జగన్ స్వయంగా పాల్గొన్నారు. ప్రభుత్వం+ఇస్కాన్ సంస్ధ సంయుక్తంగా నిర్వహించిన గోపూజలో 108 గోవులకు పూజలు జరిగాయి. ఈ పూజలో పాల్గొని జగన్ గోవులకు పూజలు జరిపి హారతులిచ్చారు.

మున్సిపల్ స్టేడియంలో జగన్ పాల్గన్నప్పటికీ రాష్ట్రంలోని 2675 దేవాలయాల్లో కూడా గోపూజలు జరిగాయి. ఎక్కడికక్కడ అధికారులు, స్ధానిక ప్రముఖులు పూజలలో పాల్గొన్నారు. మొత్తానికి పెరిగిపోతున్న మతపరమైన ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రభుత్వం గోపూజ లాంటి కార్యక్రమాలను నిర్వహించటం ఎంతైన అవసరం. పూజలు చేసినంత మాత్రనా సరిపోదు. దేవాలయాలపై జరుగుతున్న దాడుల కుట్రను ఛేదించాలి.

దేవాలయాలపై దాడుల ఘటనలను పునరావృతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ప్రతిపక్షాలంటే ప్రతిదాన్ని రాజకీయంగా అవకాశం తీసుకునేందుకు చూస్తాయనటంలో సందేహం లేదు. అటువంటి అవకాశం ఇవ్వకపోవటంలోనే అధికారపార్టీ చాతుర్యం దాగుంది. మొన్నటికి మొన్న విజయవాడలో దేవాలయాల పునర్నిర్మాణానికి శంకుస్ధాపన కూడా చేశారు సీఎం. కొత్త దేవాలయాలను నిర్మించటం, దాడులు జరక్కుండా చూసుకోవటమే జగన్ ముందున్న టార్గెట్లు. మరి తన టార్గెట్ రీచవ్వటంలో జగన్ సక్సెస్ అవుతారా ?

This post was last modified on January 16, 2021 11:11 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

3 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

4 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

5 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

5 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

6 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

7 hours ago