Political News

నీడ్ ఆఫ్ ది అవర్..జగన్ గోపూజ

రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలు పెరిగిపోతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గోపూజ నిర్వహించారు. గడచిన మూడు మాసాలుగా రాష్ట్రంలోని వివిద దేవాలయాలపై దాడులు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అంతర్వేది, రామతీర్ధం లాంటి దేవాలయాలపై దాడులు చేసిన గుర్తుతెలీని వ్యక్తులు రథాన్ని, విగ్రహాలను ద్వంసం చేశారు. ఈ నేపధ్యంలోనే ప్రతిపక్షాలు అవకాశంగా తీసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివాదాలను రేపుతున్నాయి.

ఇటువంటి అనేక ఘటనలను దృష్టిలో పెట్టుకునే అన్నట్లుగా సంక్రాంతి పండగ సందర్భంగా కనుమపండుగ రోజు శుక్రవారం ప్రభుత్వం పెద్ద ఎత్తున గోపూజ నిర్వహించింది. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో జరిగిన గోపూజలో జగన్ స్వయంగా పాల్గొన్నారు. ప్రభుత్వం+ఇస్కాన్ సంస్ధ సంయుక్తంగా నిర్వహించిన గోపూజలో 108 గోవులకు పూజలు జరిగాయి. ఈ పూజలో పాల్గొని జగన్ గోవులకు పూజలు జరిపి హారతులిచ్చారు.

మున్సిపల్ స్టేడియంలో జగన్ పాల్గన్నప్పటికీ రాష్ట్రంలోని 2675 దేవాలయాల్లో కూడా గోపూజలు జరిగాయి. ఎక్కడికక్కడ అధికారులు, స్ధానిక ప్రముఖులు పూజలలో పాల్గొన్నారు. మొత్తానికి పెరిగిపోతున్న మతపరమైన ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రభుత్వం గోపూజ లాంటి కార్యక్రమాలను నిర్వహించటం ఎంతైన అవసరం. పూజలు చేసినంత మాత్రనా సరిపోదు. దేవాలయాలపై జరుగుతున్న దాడుల కుట్రను ఛేదించాలి.

దేవాలయాలపై దాడుల ఘటనలను పునరావృతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ప్రతిపక్షాలంటే ప్రతిదాన్ని రాజకీయంగా అవకాశం తీసుకునేందుకు చూస్తాయనటంలో సందేహం లేదు. అటువంటి అవకాశం ఇవ్వకపోవటంలోనే అధికారపార్టీ చాతుర్యం దాగుంది. మొన్నటికి మొన్న విజయవాడలో దేవాలయాల పునర్నిర్మాణానికి శంకుస్ధాపన కూడా చేశారు సీఎం. కొత్త దేవాలయాలను నిర్మించటం, దాడులు జరక్కుండా చూసుకోవటమే జగన్ ముందున్న టార్గెట్లు. మరి తన టార్గెట్ రీచవ్వటంలో జగన్ సక్సెస్ అవుతారా ?

This post was last modified on January 16, 2021 11:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్, ఫాన్స్ ఉన్నారు… హైప్ వస్తుందిలే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…

1 hour ago

డెవిల్ పాట మీద బూతు వివాదం

కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…

4 hours ago

40 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…

5 hours ago

టికెట్ రేట్ల పెంపు లేదు… అయినా హ్యాపీనే

తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…

5 hours ago

SRH ఈ హెచ్చరికలు వినాల్సిందే..

'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…

7 hours ago

మీరు కాల్చండి.. నేను చూసుకుంటా. అని ఎవరన్నారు?

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…

11 hours ago