రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలు పెరిగిపోతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గోపూజ నిర్వహించారు. గడచిన మూడు మాసాలుగా రాష్ట్రంలోని వివిద దేవాలయాలపై దాడులు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అంతర్వేది, రామతీర్ధం లాంటి దేవాలయాలపై దాడులు చేసిన గుర్తుతెలీని వ్యక్తులు రథాన్ని, విగ్రహాలను ద్వంసం చేశారు. ఈ నేపధ్యంలోనే ప్రతిపక్షాలు అవకాశంగా తీసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివాదాలను రేపుతున్నాయి.
ఇటువంటి అనేక ఘటనలను దృష్టిలో పెట్టుకునే అన్నట్లుగా సంక్రాంతి పండగ సందర్భంగా కనుమపండుగ రోజు శుక్రవారం ప్రభుత్వం పెద్ద ఎత్తున గోపూజ నిర్వహించింది. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో జరిగిన గోపూజలో జగన్ స్వయంగా పాల్గొన్నారు. ప్రభుత్వం+ఇస్కాన్ సంస్ధ సంయుక్తంగా నిర్వహించిన గోపూజలో 108 గోవులకు పూజలు జరిగాయి. ఈ పూజలో పాల్గొని జగన్ గోవులకు పూజలు జరిపి హారతులిచ్చారు.
మున్సిపల్ స్టేడియంలో జగన్ పాల్గన్నప్పటికీ రాష్ట్రంలోని 2675 దేవాలయాల్లో కూడా గోపూజలు జరిగాయి. ఎక్కడికక్కడ అధికారులు, స్ధానిక ప్రముఖులు పూజలలో పాల్గొన్నారు. మొత్తానికి పెరిగిపోతున్న మతపరమైన ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రభుత్వం గోపూజ లాంటి కార్యక్రమాలను నిర్వహించటం ఎంతైన అవసరం. పూజలు చేసినంత మాత్రనా సరిపోదు. దేవాలయాలపై జరుగుతున్న దాడుల కుట్రను ఛేదించాలి.
దేవాలయాలపై దాడుల ఘటనలను పునరావృతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ప్రతిపక్షాలంటే ప్రతిదాన్ని రాజకీయంగా అవకాశం తీసుకునేందుకు చూస్తాయనటంలో సందేహం లేదు. అటువంటి అవకాశం ఇవ్వకపోవటంలోనే అధికారపార్టీ చాతుర్యం దాగుంది. మొన్నటికి మొన్న విజయవాడలో దేవాలయాల పునర్నిర్మాణానికి శంకుస్ధాపన కూడా చేశారు సీఎం. కొత్త దేవాలయాలను నిర్మించటం, దాడులు జరక్కుండా చూసుకోవటమే జగన్ ముందున్న టార్గెట్లు. మరి తన టార్గెట్ రీచవ్వటంలో జగన్ సక్సెస్ అవుతారా ?
This post was last modified on January 16, 2021 11:11 am
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…