అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన ఆయన.. ఇప్పుడు పొరుగు దేశం.. పైగా దశాబ్దాలుగా మిత్ర దేశంగా కూడా ఉన్న కెనడాపై నిప్పులు చెరుగుతున్నారు. ఆ దేశంపై ఇప్పటికే 50 శాతం అదనపు సుంకాలు విధించారు. ఈ క్రమంలో మేం మాత్రం తక్కువా అంటూ.. కెనడా కూడా.. అమెరికాపై 20 శాతం చొప్పున అదనపు సుంకాలను విధించింది. ఇలా ఇరుగు పొరుగు దేశాలు కవ్వించుకుంటున్నాయి.
ఈ క్రమంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. అమెరికా-కెనడా సరిహధ్దుల్లోని కీలకమైన మంచినీటి సరస్సు.. `లేక్ ఆంటారియో` పేరును మారుస్తూ.. అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు కూడా జారీ చేసేశారు. వాస్తవానికి రెండు దేశాల సరిహద్దుల్లోని ప్రాంతాల పేర్లు మార్చేందుకు.. కీలక చర్చలు జరపాలి. సరిహద్దు ప్రాంతాలకు చెందిన రాష్ట్రాల ప్రతినిధులు, గవర్నర్లతోనూ చర్చించాలి. కానీ, ఇవేవీ తనకు పట్టనట్టుగా ట్రంప్ ఆకస్మిక నిర్ణయం తీసుకుని.. లేక్ ఆంటారియో పేరును లేక్ అమెరికాగా మార్చేయడం గమనార్హం.
న్యూయార్క్ సహా..
ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై కెనడా నిప్పులు చెరిగింది. ఇదేం పద్ధతి అంటూ నిలదీసింది. లేక్ ఆంటారోయో అమెరికాకు మాత్రమే సొంతం కాదని పేర్కంది. దీనిపై అంతర్జాతీయ ఒడంబడిక కూడా ఉందని కెనడా పేర్కొంది. దౌత్యపరమైన సంబంధాలు మరింత బలహీనపరిచే ఉద్దేశంతోనే ట్రంప్ ఇలా చేస్తున్నారని మండి పడుతున్నారు. ఇక, ఈ వ్యవహారంపై న్యాయార్క్ గవర్నర్ సైతం విస్తుబోయారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని తాము అమలు పరబోమని హోచుల్ తెగేసి చెప్పారు.
నెటిజన్లు కూడా..
ట్రంప్ నిర్ణయంపై సామాజిక మాధ్యమంలోనూ విమర్శలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ట్రంప్కు మతి భ్రమించిందని కాంగ్రెషనల్ కార్యకర్తలు(విపక్షం) పేర్కొన్నారు. విద్యార్థులు సైతం.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక, రిపబ్లికన్ ప్రజాప్రతినిధులు మాత్రం ఈ నిర్ణయాన్ని ప్రశ్నిస్తామని చెప్పడం గమనార్హం.
This post was last modified on August 28, 2026 6:27 pm
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…
నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…