Political News

వీర్రాజు పై ఒత్తిడి పెంచేస్తున్న బండి

తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహారశైలి కారణంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై అనివార్యంగా ఒత్తిడి పెరిగిపోతోంది. మొదటినుండి కమలంపార్టీకి సంబంధించి తెలంగాణాకు ఏపిలో పరిస్ధితులకు చాలా వ్యత్యాసముంది. పార్టీ అంతో ఇంతో బలంగా ఉందంటే అది తెలంగాణాలో మాత్రమే అని అందరికీ తెలిసిందే. అలాంటి పార్టీలో బండి సంజయ్ అధ్యక్షుడు అయిన దగ్గర నుండి ఒక్కసారిగా జోరు పెరిగింది.

దానికితోడు దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో గెలవటం, గ్రేటర్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించటంతో బండి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. నిజానికి దుబ్బాకలో కానీ గ్రేటర్ లో కానీ బండి వ్యూహాల వల్ల మాత్రమే పార్టీ మంచి ఫలితాలు సాధించలేదు. పార్టీకి టైం అలా కలసివచ్చిందంతే. సరే రిజల్టు ఏదైనా మంచి ఫలితాలు సాధించినపుడు బండి అధ్యక్షునిగా ఉన్నారు కాబట్టే క్రెడిట్ అంతా బండి ఖాతాలోనే పడింది.

ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్న బండి బీజేపీ కోణంలో వ్యూహాత్మకంగా మాట్లాడేస్తున్నారు. ఒకవైపు కేసీయార్ ను మరోవైపు ఎంఐఎంను టార్గెట్ చేసుకుని బండి చేస్తున్న ఆరోపణలు, విమర్శలతో తెలంగాణాలో రాజకీయంగా మంటలు మండుతున్నాయి. ఇక్కడే ఢిల్లీ నాయకత్వం బండి వ్యవహార శైలితో పోల్చి చూస్తున్నారుట సోమువీర్రాజు పనితీరును. దాంతో వీర్రాజు కూడా బండి లాగే మతపరమైన రాజకీయాలను చేయటానికి ప్రయత్నిస్తున్నారు. జనాల్లోని భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి తెగ ప్రయత్నిస్తున్నారు.

తెలంగాణాలో కేసీయార్ మీద జనాల్లో వ్యతిరేకత ఉంది. అలాగే ఎంఐఎం అంటే మెజారిటి జనాల్లో మంటుంది. కాకపోతే గట్టి ప్రత్యర్ధులు లేకపోవటంతో ఓల్డ్ సిటిలో ఎంఐఎం చెప్పిందే వేదంగా సాగిపోతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో బండి మాట్లాడుతున్న మాటలు అక్కడ సరిపోతున్నాయి. కానీ ఏపి జనాల్లో జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి అయ్యి రెండేళ్లు కూడా కాకపోవడంతో పెద్దగా వ్యతిరేకత లేదు. అలాగే ఏపి మొత్తం మీద ఓల్డ్ సిటిలాంటిది టార్చిలైట్ వేసినా కనబడదు. మరి ఈ పరిస్దితుల్లో వీర్రాజు ఏ విధంగా భావోద్వేగాలు రెచ్చగొట్టగలరు ? అయినా.. అంతర్వేదిలో రథం దగ్దమని, రామతీర్ధమని ఇంకోటని, మరోటని నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ సెంటిమెంటును రగల్చడంలో మరి వీర్రాజు సక్సెస్ అవుతారా ?

This post was last modified on January 15, 2021 3:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

5 hours ago