Political News

5,394 కోట్ల అద‌న‌పు అప్పు.. జ‌గ‌న్ ఏం చేస్తున్నారంటే!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. ఇప్పుడు అప్పుల ప్ర‌దేశ్‌గా మారుతోంద‌నే భావ‌న సర్వ‌త్రా వినిపిస్తోంది. ఇప్ప‌టికే ల‌క్ష‌ల కోట్ల అప్పులో ఉన్న రాష్ట్రం.. ఇప్పుడు మ‌రిన్ని అప్పులు చేసుకునేందుకు ప‌రుగులు పెడుతోంది.

మేనిఫెస్టోలో ప్ర‌క‌టించిన ప్ర‌తి అంశాన్నీ అమ‌లు చేస్తున్నామ‌ని చెబుతున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. ఈ క్ర‌మంలో కొంద‌రికోసం.. అంద‌రిపైనా.. భారాలు మోపే బ‌హుముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నారని విశ్లేష‌కులు చెబుతున్నారు. కేంద్రం అప్పులు తీసుకునేందుకు ఏమాత్రం వెసులు బాటు క‌ల్పించినా.. ఏపీ స‌ర్కారు వెంట‌నే నున్నానంటూ.. త‌లుపు తీస్తోంది. ఢిల్లీ బాస్‌ల ముందు నిల‌బ‌డుతోంది. వారు చెప్పిన సంస్క‌ర‌ణ‌ల‌కు ఓకే చెబుతోంది.

ఇలా కేంద్రం విధించిన నాలుగు సంస్క‌ర‌ణ‌ల‌ను అమ‌లు చేసేందుకు రాష్ట్రం తెర‌దీసేందుకు రెడీ అయింది. నిజానికి వీటిలో మూడు సంస్క‌ర‌ణ‌ల‌కు ఇప్ప‌టికే ఓకే చెప్ప‌డం ద్వారా రాష్ట్రం రూ.5394 కోట్ల అద‌న‌పు తెచ్చుకునేందుకు సిద్ధ‌మైంది. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ‌.. తాము సూచించిన సంస్క‌ర‌ణ‌ల‌కు ఓకే చెప్పిన రాష్ట్రాల జాబితా.. ఆయా రాష్ట్రాల‌కు చేకూరే అద‌న‌పు అప్పుల వివ‌రాల‌తో కూడిన నివేదిక‌ను విడుద‌ల చేసింది.

దీంతో ఇత‌ర రాష్ట్రాల కంటే కూడా ఏపీ చాలా ముందుంది. ప్ర‌ధానంగా ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో ప‌న్నులు, యూజ‌ర్ చార్జీలు పెంచ‌డం ద్వారా.. ఒక దేశం-ఒకే రేష‌న్ కార్డులో సంస్క‌ర‌ణ‌లు అమ‌లు చేయ‌డం ద్వారా.. కార్డుల్లో కోత పెట్ట‌డం వంటివి ఇప్ప‌టికే జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంది.

ఈ ప‌రంప‌ర‌లో మ‌రో కీలక సంస్క‌ర‌ణ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌. దీనిని కూడా ఏపీ స‌ర్కారు అమ‌లు చేస్తోంది. అయితే.. వీటిలో రెండు మాత్రం ప్ర‌జ‌ల‌పై ప్ర‌త్య‌క్షంగా ప్ర‌భావం చూపిస్తున్నాయి. ప‌ట్ట‌ణాల్లో ప‌న్నులు భారీగా పెరుగుతాయి. అదేవిధంగా తాగునీటి, సీవ‌రేజ్ చార్జీలు కూడా మోత‌మోగ‌నున్నాయి. ఈ ప‌రిణామాలు.. ప్ర‌జ‌ల‌పై తీవ్ర ఆర్థిక భారం మోప‌నున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ మూడు సంస్క‌ర‌ణ‌లు అమ‌లు చేయ‌డం ద్వారా జ‌గ‌న్ స‌ర్కారుకు.

రూ.5394 కోట్ల మేర‌కు అద‌నంగా అప్పు చేసుకునే అవ‌కాశం ల‌భించినా.. ఒక్క ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల్లో అమ‌లు చేస్తున్న సంస్క‌ర‌ణ‌ల ఫ‌లితంగా ప్ర‌జ‌ల‌పై ఏటా రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల కోట్ల మేర‌కు భారం ప‌డ‌నుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌(సుల‌భ‌త‌ర వాణిజ్యం)లో సంస్క‌ర‌ణ‌లు తీసుకురావ‌డం ద్వారా రూ.2595 కోట్లు, ప‌ట్ట‌ణాల్లో ప‌న్నుల మోత ద్వారా రూ.344 కోట్లు, రేష‌న్ కార్డుల విధానంలో సంస్క‌ర‌ణ‌ల ద్వారా.. రూ.2595 కోట్లు అద‌నంగా అప్పులు చేసుకునే అవ‌కాశం జ‌గ‌న్ స‌ర్కారుకు ల‌భించినా.. మున్ముందు ఇది తీవ్ర ఇబ్బంది క‌ర ప‌రిస్తితికి దారితీస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ నేప‌థ్యంలో ఇదేం వ్యూహ‌మో.. జ‌గ‌న్‌కే తెలియాల‌ని పెద‌వి విరుస్తున్నారు. కానీ, ఇదే విష‌యంలో పొరుగు రాష్ట్రాలు చాలా మేర‌కు ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on January 14, 2021 4:06 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

2 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

3 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

3 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

3 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

4 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

5 hours ago