క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. మొన్నటి డిసెంబర్ ఒక్క నెలలోనే అమెరికా మొత్తం మీద 1,40,000 వేలమంది మహిళలు ఉద్యోగాలను కోల్పోయారు. అమెరికాలో కరోనా వైరస్ మొదలైన దగ్గర నుండి అంటే ఫిబ్రవరి నుండి జనవరి వరకు ఎంతమంది మహిళలు తమ ఉద్యోగ, ఉపాధిని కోల్పోయారనే విషయమై నేషనల్ విమెన్ లా సెంటర్ ఓ సర్వే నిర్వహించి ఫలితాలను బయటపెట్టింది.
అందులోని వివరాలు చూసిన తర్వాత కరోనా వైరస్ ఏమైనా అమెరికాలోని మహిళలపై ప్రత్యేకంగా పగపట్టిందా ? అనే డౌటు రాకమానదు. గడచిన తొమ్మిది మాసాల్లో అమెరికాలో 21 లక్షల మంది మహిళలు ఉద్యోగ, ఉపాధిని కోల్పోయారని సర్వేలో బయటపడింది. కరోనా వైరస్ దెబ్బకు యావత్ ప్రపంచం ఆర్ధిక వ్యవస్ధ కుదేలైందన్నది నిజం. దీనివల్ల పురుషులు, స్త్రీలన్న తేడాలేకుండా కొన్ని కోట్లమంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
కరోనా వైరస్ నుండి కొన్ని దేశాలు కోలుకుంటున్నట్లే అమెరికా కూడా మెల్లిగా కుదుటపడుతోంది. వైరస్ దెబ్బకు మూతపడిన అనేకరంగాలు మళ్ళీ తెరుచుకుంటున్నాయి. అయితే తెరుచుకుంటున్న టూరిజం, సర్వీసెస్, ఐటి, హోటల్ మేనేజ్మెంట్ లాంటి రంగాల్లో పురుషులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారట. ఇపుడు మగవాళ్ళను తీసుకుంటున్న ఉద్యోగాలను గతంలో ఆడవాళ్ళు చేసినా సరే తాజాగా స్త్రీలను మళ్ళీ ఆ స్ధానాల్లో తీసుకోవటానికి మాత్రం కంపెనీలు ఇష్టపడటం లేదట.
పై రంగాలతో పాటు మహిళలు ఎక్కువగా విద్య, ఆరోగ్య రంగాల్లో కూడా పనిచేస్తుంటారు. 1975 తర్వాత మహిళలు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి కోల్పోవటం ఇదే మొదటిసారని సర్వే స్పష్టం చేస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి ముందు నుండి తీసుకుంటే ఇప్పటివరకు మగవాళ్ళు కోల్పోయిన ఉద్యోగ, ఉపాధి 4.4 మిలియన్లయితే ఆడవాళ్ళు కోల్పోయిన ఉపాధి, ఉద్యోగాల సంఖ్య 5.4 మిలియన్లట. జెండర్ సమానత్వం కోసం జరిగే పోరాటాల్లో అమెరికా ఎప్పుడూ ముందుంటుంది. అలాంటిది అమెరికాలోనే ఇన్ని లక్షలమంది మహిళలు కరోనా వైరస్ కారణంగానే ఉద్యోగ, ఉపాధిని కోల్పోవటం విచిత్రంగా ఉంది.
This post was last modified on January 12, 2021 6:46 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…