గడచిన కొద్ది రోజులుగా అగ్రరాజ్యం అమెరికాను యావత్ ప్రపంచం ముందు తలొంచుకునేట్లుగా వ్యవహరించిన ఔట్ గోయింగ్ అధ్యక్షుడు డొనాలడ్ జే ట్రంప్ పై అభిశంసన తీర్మానం రెడీ అయింది. తీర్మాన్ని ప్రవేశపెట్టడమే మిగిలిందని స్పీకర్ నాన్సీ పెలోసి ప్రకటించారు. నాలుగురోజుల క్రితం అమెరికన్ పార్లమెంటు భవనమైన క్యాపిటిల్ బిల్డింగ్ పై ట్రంప్ మద్దతుదారులు చేసిన దాడులు, బీభత్సకాండ చూసి ప్రపంచమంతా విస్తుపోయింది. అమెరికాలోని అన్నీ రాష్ట్రాల నుండి తన మద్దతుదారులను భారీగా వాషింగ్టన్ కు పిలిపించుకుని మరీ క్యాపిటల్ బిల్డింగ్ పై ట్రంప్ దాడులకు ప్రోత్సహించారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే.
దాడులు జరిగిన తర్వాత రిపబ్లికన్ పార్టీలో కూడా ట్రంప్ వైఖరిపై వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. అసలే ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుతో అమెరికా ప్రపంచదేశాల ముందు బాగా పలుచనైపోయింది. ఇన్ కమింగ్ అధ్యక్షుడు జో బైడెన్ ఈనెల 20వ తేదీన అమెరికా అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. సరే ఏదోలా కొద్ది రోజులు ట్రంప్ ను భరిస్తే సరిపోతుందని అందరు సర్దుకుపోతున్నారు. అలాంటిది పదవీకాలం ముగిసేముందు ట్రంప్ ఇటువంటి పనిచేస్తారని ఇటు డెమక్రాట్లు అటు రిపబ్లికన్లు కూడా ఊహించలేదు.
అమెరికా చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలినపోయిన క్యాపిటల్ బిల్డింగ్ ఘటనకు కారకుడంటు ఇప్పటికే పార్లమెంటు మెజారిటి సభ్యులు ట్రంప్ పై అనేక ఫిర్యాదులు చేశారు. దాంతో ట్రంప్ ను 20వ తేదీ వరకు కూడా అధ్యక్షుడిగా కంటిన్యు చేయకూడదనే ఉద్దేశ్యంతోనే అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని పార్లమెంటులోని మెజారిటి ఎంపిలు డిసైడ్ అయ్యారు. ఒకవేళ 20వ తేదీలోగా తీర్మానంపై చర్యలు తీసుకునే అవకాశం లేకపోయినా సరే ట్రంప్ ను అభిశంసించినట్లుగా తీర్మానం చేయాలని మెజారిటి ఎంపిలు భావిస్తున్నట్లు అమెరికా మీడియా చెబుతోంది.
మొత్తానికి పదవిలో నుండి దిగిపోతు ట్రంప్ చేసిన పని వల్ల మొత్తం దేశంలోనే ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. 20వ తేదీ దగ్గరపడుతున్నకొద్దీ ఏ క్షణంలో ఏమవుతుందో అన్న టెన్షన్ అమెరికాలో పెరిగిపోతోంది. అందుకనే ముందుజాగ్రత్తగా అమెరికాలోని సెన్సిటివ్ రాష్ట్రాలు, వాటిలో మరీ సున్నితమైన నగరాలుగా గుర్తించిన ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసుల బలగాలను దించేశారు. దేశంమొత్తం మీద నిఘావ్యవస్ధను రంగంలోకి దింపేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మొన్నటి దాడిలో ఆందోళనకారులకు పోలీసుల్లో కొందరు సహకరించినట్లు సీసీ కెమెరాల ద్వారా తెలిసిందట.
This post was last modified on January 11, 2021 2:25 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…