రాజకీయాల్లో వారసులకు ప్రాధాన్యం పెరిగిన మాట వాస్తవమే. అయితే.. ఒకే కుటుంబం నుంచి వరుస పె ట్టి.. నాయకులుగా రంగ ప్రవేశం చేయడమే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఒకరు కాదు. ఇద్దరుకాదు.. ఏకంగా ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు.
వారే.. విజయ నగరం జి ల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం. సీనియర్ నాయకుడైన బొత్స సత్యనారాయణ, ఆయన సతీమణి, మాజీ ఎంపీ ఝాన్సీ, తమ్ముడు బొత్స అప్పలనరసయ్య, మేనల్లుడు, ఎమ్మెల్యే బొడ్డుకొండ అప్పల నాయుడు మొత్తంగా ఇప్పటి వరకు ఈ నలుగురు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు.
విజయనగరం జిల్లా వ్యాప్తంగా వీరి హవానే నడుస్తోంది. వీరు ఉన్న పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా.. జిల్లాలో మాత్రం ఆధిపత్యం బొత్స కుటుంబానిదే. వ్యాపారాలు, కాంట్రాక్టుల దగ్గర నుంచి అన్నీ కూడా బొత్స కుటుంబ సభ్యుల ఆధీనంలోనే ఉన్నాయనేది బహిరంగ రహస్యం.
ఇక, ఇప్పుడు బొత్స తన తన యుడు సందీప్ బాబును కూడా రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారని తెలుస్తోంది. వైద్య విద్యను అభ్యసించిన సందీప్.. ప్రస్తుతం విశాఖలో వైద్య వృత్తిలో ఉన్నారు. కానీ, ఇటీవల జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. త్వరలోనే ఆయన రాజకీయ రంగంలోకి దిగుతున్నారనే వ్యాఖ్యలకు బలం చేకూరుతోంది.
సందీప్ పుట్టిన రోజు ఫంక్షన్ను కొన్నిరోజుల కిందట బొత్స కుటుంబం ఘనంగా నిర్వహించింది. ఈ సంద ర్భంగా చీపురుపల్లి నియోజకవర్గంలో భారీ ఎత్తున కటౌట్లు వెలిశాయి. వీటిలో సందీప్ను బొత్స వారసుడిగా పేర్కొంటూ.. కామెంట్లు కనిపించాయి. ఇక, ఇటీవల ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజుసందర్భంగా కుమారుడిని వెంటబెట్టుకుని వచ్చిన బొత్స.. సీఎంకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా స్వయంగా రక్తదానం కూడా చేశారు సందీప్.
ఈ పరిణామాలను గమనిస్తే.. త్వరలోనే సందీప్ కూడా రాజకీయ అరంగేట్రం చేయడం ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ చీపురుపల్లి, బొడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు సందీప్ రాజకీయ అరంగేట్రం చేస్తే..ఎక్కడ నుంచి బరిలోకి దిగుతారు? అనేది ప్రశ్న. సరే.. పోటీ మాట అటుంచినా.. ఒకే కుటుంబం నుంచి ఐదుగురు రాజకీయాల్లో చక్ర తిప్పుతుండడం ఆసక్తిగా మారింది.
జూన్ సగం అయిపోయింది. మా ఇంటి బంగారం లాంటి నోటెడ్ మూవీస్ తో పాటు దీవానా లాంటివి అంతో ఇంతో…
రెండో వారంలో పెద్ది జోరు కొనసాగుతోంది. జాన్వీ కపూర్ పాత్ర వివాదం, ఎడిటింగ్ చేస్తామని బుచ్చిబాబు వివరణ, కొత్త సీన్లు…
చిరంజీవి, మోహన్ బాబు హీరోలుగా 1982లో బిల్లా రంగా అనే సినిమా వచ్చింది. కమర్షియల్ గా సక్సెస్ అందుకుంది. అప్పట్లో…
రాష్ట్రంలో మహిళా ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది.. రెండేళ్ల కాలంలో వారి పనితీరు ఏ విధంగా సాగింది.…
గొడవలు కానీ మనస్పర్థలతో కానీ భార్యతో భర్త మాట్లాడకపోవటం గృహ హింస కిందకు వస్తుందా? మాట్లాడకుండా ఉండటం వేధింపులకు గురి…
‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. కింగ్ నాగార్జునతో ‘మాస్’ లాంటి బ్లాక్…