Political News

న‌ర‌సాపురం వైసీపీలో ఫైర్‌బ్రాండ్ కావ‌లెను.. రీజ‌నేంటంటే!

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం న‌ర‌సాపురం పార్ల‌మెంటు. ఇటు అసెంబ్లీ, అటు పార్ల‌మెంటుకు కూడా న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గంగా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఇక్క‌డ విజ‌యం సాధించింది. న‌రసాపురం పార్ల‌మెంటు స్థానం నుంచి ర‌ఘురామ‌కృష్ణంరాజు, అసెంబ్లీ స్థానం నుంచి ముదునూరు ప్ర‌సాద‌రాజు విజ‌యం సాధించారు. అయితే, వీరిద్ద‌రిలో ఎంపీ.. అస‌మ్మ‌తి బావుటా ఎగుర‌ వేసిన విష‌యం తెలిసిందే. దీంతో పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గానికి ఇంచార్జ్ విష‌యంలో జ‌గ‌న్ హుటాహుటిన నిర్ణ‌యం తీసుకుని.. ర‌ఘుకు చెక్ పెట్టేలా.. మాజీ ఎంపీ, బీజేపీ నాయ‌కుడు గోక‌రాజు గంగ‌రాజు కుమారుడు.. రంగ‌రాజుకు ప‌గ్గాలు అప్ప‌గించారు.

స్థానిక రాజ‌కీయాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. సామాజికవర్గం పరంగా బలమైన కుటుంబం కావ‌డం, ఆర్థికంగానూ బ‌లంగా ఉండ‌డంతో ర‌ఘుకు స‌రైన మొగుడు అవుతార‌ని, ఆయ‌న‌కు దీటుగా రాజ‌కీయాలు చేస్తార‌ని .. వైసీపీ సీనియ‌ర్లు గోక‌రాజు రంగ‌రాజుపై ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే.. అనూహ్యంగా రంగ‌రాజు పుంజుకోలేక పోయారు.

రాజ‌కీయాల‌కు కొత్త కావ‌డం కావొచ్చు.. లేదా స్వ‌భావ సిద్ధంగా రంగ‌రాజు నిదాన‌స్తుడు కావ‌డం కావొచ్చు.. మొత్తంగా పార్టీ అధిష్టానం పెట్టుకున్న ల‌క్ష్యం మాత్రం నెర‌వేర‌లేదు. పోనీ.. సిట్టింగ్ ఎంపీ ర‌ఘుకు కౌంట‌ర్లు ఇవ్వ‌లేక పోయినా.. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ నేత‌ల‌ను, ఓట‌ర్ల‌ను త‌న‌ వైపు తిప్పుకోవ‌డంలో కూడా రంగ‌రాజు స‌క్సెస్ కాలేక పోతున్నారు.

మ‌రోవైపు.. న‌రసాపురం లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ ఎమ్మెల్యేలతోనూ గోక‌రాజు వార‌సుడు టచ్‌లో ఉండ‌డం లేద‌ని.. తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయడానికి చొరవ తీసుకోవడం లేదని స్థానిక కేడ‌ర్ బాహాటంగానే చెబుతోంది. ఈ నేప‌థ్యంలో న‌ర‌సాపురం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీని నాయ‌క‌త్వ కొర‌త వెంటాడుతుండ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి గోకరాజు కుటుంబానికి న‌ర‌సాపురం కొత్త‌కాదు. గ‌త 2014 ఎన్నిక‌ల్లో గంగ‌రాజు ఇక్క‌డ నుంచి బీజేపీ టికెట్‌పై విజ‌యం సాధించారు. సో.. ఇక్క‌డ ప‌రిచ‌యాలు, గుర్తింపు ఉన్న కుటుంబ‌మే అయినా.. రంగరాజు మాత్రం పుంజుకోలేక పోతున్నార‌నే వాద‌న బ‌ల‌ప‌డుతోంది.

ఒకవేళ వైసీపీలో అంత‌ర్గ‌త విభేదాలు ఉంటే.. ఎమ్మెల్యేల‌కు, త‌న‌కు మ‌ధ్య గ్యాప్ పెరిగితే.. ప‌రిష్క‌రించు కుని ముందుకు సాగేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. కానీ, రంగ‌రాజు సీనియ‌ర్ల‌కు కూడా దూరంగా ఉం టున్నారని తెలుస్తోంది. దీంతో నరసాపురం లోక్‌సభ పరిధిలో వైసీపీ ఇంఛార్జ్ గా ఫైర్ బ్రాండ్‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని..పార్టీ అధిష్టానం భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక్క‌డ బ‌ల‌మైన టీడీపీ, జ‌న‌సేన‌ నేత‌ల‌ను ఢీకొడుతూ.. క్ష‌త్రియ సామాజిక వ‌ర్గాన్ని త‌మ‌వైపు తిప్పుకొంటూ.. పార్టీని బ‌లోపేతం చేసే వ్యూహంతో ముందుకు సాగే నాయ‌కుడి కోసం పార్టీ అన్వేషిస్తున్న‌ట్టు సీనియ‌ర్ల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది. మ‌రి అవ‌కాశం ఎవ‌రికి ద‌క్కుతుందో చూడాలి.

This post was last modified on January 10, 2021 5:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పో* వెబ్ సైట్లో ఫొటో… జాన్వి షాక్

ఏఐని వాడుకుని ఇప్పుడు హీరోయిన్ల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా జనాలు ఎలా రెచ్చిపోతున్నారో.. ఇంటర్నెట్ ఎంత విశృంఖలంగా తయారైందో చూస్తూనే…

11 minutes ago

డెకాయిట్ ఛాన్సుకి అదొక్కటే అడ్డంకి

ఎంత గ్యాప్ వచ్చినా పర్లేదు క్వాలిటీనే ముఖ్యమనే హీరో అడివి శేష్ కొత్త సినిమా డెకాయిట్ ఈ శుక్రవారం ఏప్రిల్…

54 minutes ago

పరుగు పందెంలో అసలు గండం షురూ

మొన్న శుక్రవారం రిలీజైన బైకర్, రాకాస మొదటి వీకెండ్ పూర్తి చేసుకున్నాయి. నిన్న ఐపీఎల్ లో సన్ రైజర్స్, సూపర్…

2 hours ago

గబ్బర్ గర్వం… ఉస్తాద్ వల్ల మాయం

ఒక పవన్ కళ్యాణ్ సినిమా ఇంత వేగంగా ఫేడవుట్ అవ్వడం ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలోనే జరిగిందని చెప్పాలి. గతంలో…

3 hours ago

సంతోష్ శోభ‌న్… ప‌ర‌లోక యాత్ర‌

ఫ్లాపుల ప‌రంప‌ర‌కు తెర‌దించుతూ.. ఈ ఏడాది క‌పుల్ ఫ్రెండ్లీ చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్నాడు యువ క‌థానాయ‌కుడు సంతోష్ శోభ‌న్.…

5 hours ago

ర‌ఘురామ ఉంటున్న ఇల్లు ఎవ‌రిదో తెలిస్తే షాకే!

ఒక‌ప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీలోనే ఉండి, ఆ పార్టీ త‌ర‌ఫున ఎంపీగా కూడా గెలిచిన ర‌ఘురామ కృష్ణం రాజు త‌ర్వాత…

7 hours ago