Political News

కేంద్రం వద్దన్నా సై అంటున్న ఆ సీఎం

దేశంలో కరోనా ప్రభావం కొనసాగుతుండటంతో థియేటర్లను వంద శాతం ఆక్యుపెన్సీతో నడపడానికి ససేమిరా అంటోంది కేంద్ర ప్రభుత్వం. 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతులు ఇస్తూ ఇచ్చిన జీవోలో ఇప్పటిదాకా ఏ మార్పూ చేయలేదు. వివిధ పరిశ్రమల నుంచి వచ్చిన విజ్ఞప్తుల్ని కేంద్రం పట్టించుకోవట్లేదు. కానీ తమిళనాడు ప్రభుత్వం సొంతంగా తమ రాష్ట్రం వరకు 100 పర్సంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లు నడపడానికి అనుమతులు ఇవ్వడం.. తర్వాత కేంద్రం ఇందుకు అంగీకరించకపోవడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదు.

దీంతో దేశవ్యాప్తంగా ఇంకెక్కడా కూడా ఇప్పుడిప్పుడే 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడవవనే అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా పశ్చిమ బెంగాల్‌లో మాత్రం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సినీ పరిశ్రమకు ‘100 పర్సంట్ ఆక్యుపెన్సీ’ ఆఫర్ ఇచ్చేశారు.

కోల్‌కతాలో 26వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మమత.. బెంగాల్‌లో 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవడానికి అనుమతులిస్తున్నట్లు ప్రకటించారు. ఐతే కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా మమత ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశం అవుతోంది. ఆమె పంతంతోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరి కొన్ని నెలల్లో బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు, విపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు. మోడీ సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ వ్యతిరేకిస్తూ, విమర్శిస్తున్న మమత.. థియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీతో నడపాలన్న కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం వెనుక ఉద్దేశం జనాలకు బాగానే అర్థమవుతోంది.

Satya

Recent Posts

రాకా కోసం అట్లీ ముందు చూపు!

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…

37 minutes ago

రేట్ల కోసం వెట్ చెయ్… కోట్లు పోగొట్టుకో

ఒక‌ప్పుడు ఎంత పెద్ద సినిమా వ‌చ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బ‌డ్జెట్ ఎంత అయినా స‌రే.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన…

4 hours ago

5 రూపాయల డాక్టరుగా సూర్య ?

కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…

6 hours ago

పవన్ వ్యాఖలకు తెలంగాణ నాయకుల కౌంటర్… ఇదేం స్పీడు గురు

తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…

6 hours ago

పవన్ 11 రోజులు అన్నం తిననిది ఇందుకా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…

6 hours ago

జగన్ తో అమరావతి రైతుల భేటీ నిజమేనా…?

వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…

7 hours ago