భూవివాదానికి సంబంధించి సీఎం కేసీఆర్ బంధువుల్ని కిడ్నాప్ చేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టు కావటం.. ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉండటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా అఖిలప్రియ సోదరి ఈ ఇష్యూ మీద మాట్లాడారు. తాము ఎవర్నీ డబ్బులకోసం డిమాండ్ చేయలేదన్న ఆమె.. రిమాండ్ రిపోర్టులో ఉన్న విషయాలు సరికావన్నారు.
హైదరాబాద్ లో తమకు భద్రత లేదన్నారు. వేరే రాష్ట్రం వాళ్లం కాబట్టి.. తమ పట్ల పోలీసులు మరోలా వ్యవహరిస్తున్నారన్నారు. కనీస సమాచారం లేకుండా 30నుంచి 40 మంది మగ పోలీసులు ఇంటికి వచ్చారని.. మహిళా పోలీసులు లేకుండా ఏ విధంగా వస్తారని ప్రశ్నించారు. మూడు నెలలుగా తన సోదరి ఆరోగ్యం బాగోలేదన్న ఆమె.. అప్పుడప్పుడు ఫిట్స్ వస్తున్నాయన్నారు.
గాంధీ ఆసుపత్రిలో కళ్లు తిరిగి పడినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. పైగా ఫిట్ గా ఉందంటూ పోలీసులు నిర్లక్ష్యంగా మాట్లాడారన్నారు. అఖిల విషయంలో ఎందుకలా వ్యవహరిస్తున్నారో తనకు తెలీటం లేదన్న భూమా మౌనిక ఈ ఇష్యూపై కూర్చొని మాట్లాడటానికి తాము సిద్ధమన్నారు. తమ వాటాల గురించి గతంలో తాము మాట్లాడామని.. ఎప్పుడూ ఎవరిని డబ్బుల కోసం డిమాండ్ చేయలేదన్నారు.
అక్క అఖిల అరెస్టు వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉండొచ్చన్న అనుమానాన్నివ్యక్తం చేసిన ఆమె.. తన తండ్రికి చాలామందితో వ్యాపార భాగస్వామ్యాలు ఉన్నాయన్నారు. ‘మా నాన్న అకస్మాత్తుగా మరణించటంతో మా ఆస్తులు ఎక్కడ ఉన్నాయో మాకు తెలీదు. మా నాన్నకు చాలామందివ్యాపార భాగస్వాములు ఉన్నారు. మా వాటాల కోసం గతంలో మేం వాళ్లతో మాట్లాడాం. అక్క కోసం నేను.. తమ్ముడు పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. కూర్చొని మాట్లాడితే సమస్యలు పరిష్కారమవుతాయి. కొట్టుకునేంత సీన్ ఇప్పుడు ఎవరికి లేదు. ఎవరైనా పెద్ద మనుషులు మధ్యవర్తిత్వం వహిస్తే మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. మరి.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే పెద్ద మనిషి ఎవరబ్బా?
This post was last modified on January 8, 2021 1:54 pm
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…