భూవివాదానికి సంబంధించి సీఎం కేసీఆర్ బంధువుల్ని కిడ్నాప్ చేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టు కావటం.. ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉండటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా అఖిలప్రియ సోదరి ఈ ఇష్యూ మీద మాట్లాడారు. తాము ఎవర్నీ డబ్బులకోసం డిమాండ్ చేయలేదన్న ఆమె.. రిమాండ్ రిపోర్టులో ఉన్న విషయాలు సరికావన్నారు.
హైదరాబాద్ లో తమకు భద్రత లేదన్నారు. వేరే రాష్ట్రం వాళ్లం కాబట్టి.. తమ పట్ల పోలీసులు మరోలా వ్యవహరిస్తున్నారన్నారు. కనీస సమాచారం లేకుండా 30నుంచి 40 మంది మగ పోలీసులు ఇంటికి వచ్చారని.. మహిళా పోలీసులు లేకుండా ఏ విధంగా వస్తారని ప్రశ్నించారు. మూడు నెలలుగా తన సోదరి ఆరోగ్యం బాగోలేదన్న ఆమె.. అప్పుడప్పుడు ఫిట్స్ వస్తున్నాయన్నారు.
గాంధీ ఆసుపత్రిలో కళ్లు తిరిగి పడినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. పైగా ఫిట్ గా ఉందంటూ పోలీసులు నిర్లక్ష్యంగా మాట్లాడారన్నారు. అఖిల విషయంలో ఎందుకలా వ్యవహరిస్తున్నారో తనకు తెలీటం లేదన్న భూమా మౌనిక ఈ ఇష్యూపై కూర్చొని మాట్లాడటానికి తాము సిద్ధమన్నారు. తమ వాటాల గురించి గతంలో తాము మాట్లాడామని.. ఎప్పుడూ ఎవరిని డబ్బుల కోసం డిమాండ్ చేయలేదన్నారు.
అక్క అఖిల అరెస్టు వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉండొచ్చన్న అనుమానాన్నివ్యక్తం చేసిన ఆమె.. తన తండ్రికి చాలామందితో వ్యాపార భాగస్వామ్యాలు ఉన్నాయన్నారు. ‘మా నాన్న అకస్మాత్తుగా మరణించటంతో మా ఆస్తులు ఎక్కడ ఉన్నాయో మాకు తెలీదు. మా నాన్నకు చాలామందివ్యాపార భాగస్వాములు ఉన్నారు. మా వాటాల కోసం గతంలో మేం వాళ్లతో మాట్లాడాం. అక్క కోసం నేను.. తమ్ముడు పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. కూర్చొని మాట్లాడితే సమస్యలు పరిష్కారమవుతాయి. కొట్టుకునేంత సీన్ ఇప్పుడు ఎవరికి లేదు. ఎవరైనా పెద్ద మనుషులు మధ్యవర్తిత్వం వహిస్తే మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. మరి.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే పెద్ద మనిషి ఎవరబ్బా?
This post was last modified on January 8, 2021 1:54 pm
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…