Bandi Sanjay
చూస్తుంటే వ్యవహారం అలాగే ఉంది. తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు తిరుపతిలో బీజేసీ+జనసేన అభ్యర్ధిని గెలిపించే బాధ్యతను పార్టీ అగ్రనాయకత్వం అప్పగించినట్లే ఉంది. లేకపోతే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బైబిల్ పాలన కావాలా ? లేకపోతే భగవద్గీత పాలన కావాలో జనాలు తేల్చుకోవాలని పిలుపువ్విటమే ఆశ్చర్యంగా ఉంది. బండి మాటలు వింటుంటే తెలంగాణాలో జరిగిన ఎన్నికల సమయంలో జనాలను ఎంతగా రెచ్చగొట్టారో అందరికీ తెలిసిందే.
తెలంగాణాలో జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో కానీ తర్వాత జరిగిన గ్రేటర్ ఎన్నికలో కానీ బండి జనాల భావోద్వేగాలను ఏ స్ధాయిలో రెచ్చగొట్టారో అందరికీ గుర్తుండే ఉంటుంది. గ్రేటర్ ఎన్నికల్లో అంటే ఓల్డ్ సిటి ఉన్నది కాబట్టి బండి ఆటలు సాగాయి. మరి ఏపిలో కూడా అలాగే సాగుతుందా ? అసలు తిరుపతిలో బండి పప్పులుడుకుతాయా అన్నది అనుమానమే.
ఎందుకంటే ఏపిలో మత రాజకీయాలకు ఎప్పుడు కూడా చోటు లేదు. ఎక్కడన్నా ఉంటే కులాలపరంగా ఓట్లు చీలుతాయే కానీ మతపరంగా ఓట్లు చీలిన ఘటనలు లేవు. పైగా ఎవరెంతగా మతాల పేరుతో జనాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా సాధ్యంకాలేదు. గతంలో కూడా బీజేపీ నేతలు ఇటువంటి ప్రయత్నాలు చేసి ఫెయిలయ్యారు. కాబట్టి బండి సంజయ్ వ్యూహం ఏపిలోను అందులోను తిరుపతి ఉపఎన్నికలో పారదనే అనుకుంటున్నారు.
ఇక పార్టీ విషయానికి వస్తే ఏపిలో ఎన్నికకు తెలంగాణా అధ్యక్షుడు బండి యాక్టివ్ అవుతున్నారంటే మరి సోము వీర్రాజు పరిస్దితి ఏమిటి ? తెలంగాణాలో జరిగిన రెండు ఎన్నికల్లో బండి మంచి ఫలితాలు చూపించారు కాబట్టి ఏపిలో తిరుపతి ఉపఎన్నికకు కూడా బండినే ఇన్చార్జిగా పెట్టారా ? అనే సందేహం పెరిగిపోతోంది. నిజంగానే బండిని ఇన్చార్జిగా పెడితే మరి సోము పరిస్దితి ఏమిటి ? స్ధానిక నేతలు వీర్రాజు చెప్పింది వినాలా ? లేకపోతే బండి డైరెక్షన్నే ఫాలో అవ్వాలా ? కొద్ది రోజుల్లో క్లారిటి వచ్చేస్తుంది.
This post was last modified on January 5, 2021 11:10 am
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…