చివరకు తెలుగుదేశంపార్టీ రెండు విధాల నష్టపోతుందేమో అనే సందేహం మొదలైంది. ఎందుకంటే చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న విధానాలు అలాగే ఉన్నాయి మరి. చంద్రబాబు తాజా వైఖరి చూసిన తర్వాత అందరికీ అర్ధమైంది ఇదే. తనకు అలవాటు లేని మతపరమైన అజెండాను చంద్రబాబు నెత్తికెత్తుకున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని బొడకొండమీద రామతీర్ధం ఆలయం దగ్గర చంద్రబాబు చూపించిన అత్యుత్సాహం, చేసిన హడావుడి చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.
నిజానికి ఇటువంటి అజెండాను భుజాన వేసుకున్నంత మాత్రాన జనాలు ఓట్లేస్తారని అనుకునేందుకు లేదు. రాజకీయపార్టీలు ఏమి చేసినా అంతిమంగా రాజకీయంగా లబ్దికోసమే అని అందరికీ తెలిసిందే. అభివృద్ధి పనులు, ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల విషయంలో టీడీపీ గోల చేసినా జనాలు పట్టించుకుంటారు కానీ మత పరమైన అజెండాను చంద్రబాబు ఎందుకు ఎత్తుకున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు.
నిజానికి హిందుత్వం, ఆలయాలు లాంటివి బీజేపీ అజెండా అన్న విషయం అందరికీ తెలిసిందే. జనాల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లేయించుకోవాలన్నది బిజేపీ వ్యూహం. గల్లీలో మొదలైన ఇటువంటి వ్యూహాన్ని అమలు చేసే ఢిల్లీదాకా పాకింది. కాబట్టి మతపరమైన రాజకీయాల్లో పేటెంట్ రైట్సన్నీ బీజేపీ కే ఉన్నట్లు జనాలు కూడా ఫిక్సయిపోయారు. ఇటువంటి నేపధ్యంలో రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం అన్న అజెండాను చంద్రబాబు ఎంతగా భుజానేసుకున్నా ఉపయోగం ఉండదు.
బీజేపీకంటే ఉన్నదేమీ లేదు కాబట్టి పోయేది కూడా ఏమీలేదు. కాబట్టే కమలంపార్టీ నేతలు ఎంతస్ధాయికైనా తెగిస్తారు. కానీ టీడీపీ అలాకాదు. గతంలో ఎప్పుడైనా ఇటువంటి అజెండాతో రాజకీయాలు చేసిన చరిత్ర కూడా టీడీపీకి లేదు. అలాంటిది ఇప్పటికప్పుడు చంద్రబాబు తన అజెండాను ఎందుకు మార్చుకోవాలి ? హిందుత్వ అజెండాకు మద్దతుగా ఉండేవాళ్ళు బీజేపీకి ఓట్లేస్తారే కానీ టీడీపీకి వేసే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. మరి తన అజెండాను మార్చుకోవటం వల్ల ఉన్న ఓట్లు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది టీడీపీకి.
హిందుత్వ అజెండాను చంద్రబాబు ఎంతగా భుజనేసుకుంటే మైనారిటిలు అంతగా టీడీపీకి దూరమయ్యే ప్రమాదం ఉంది. వైసీపీ పొలిటికల్ ఎంట్రీతో మైనారిటిల్లో మెజారిటి జగన్మోహన్ రెడ్డికే మద్దతుగా నిలబడ్డారు. ఇదే సమయంలో టీడీపీని కూడా కొందరు సపోర్టు చేస్తున్నారు. అయితే చంద్రబాబు తాజా వైఖరితో ఉన్న కొద్దిమంది కూడా పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందని టీడీపీలోనే నేతలు అనుకుంటున్నారు. అంటే చంద్రబాబు వైఖరి వల్ల హిందుత్వ ఓట్లు రాకపోగా ఉన్న కొద్దిపాటి మైనారిటి ఓట్లు కూడా దూరమయ్యే ప్రమాదం ఉందని అర్ధమవుతోంది. మరి ఈ విషయం చంద్రబాబుకు అర్ధమవుతోందా ?
This post was last modified on January 4, 2021 9:53 pm
పెళ్లి లేదు ప్రెగ్నెంటూ లేదు, కొడుకు పేరు కృష్ణమనోహర్ అనేది కొత్త సామెత. కొన్ని రిలీజ్ డేట్ల వ్యవహారం చూస్తుంటే…
ఏపీలోని కోనసీమ ప్రాంతంలో కొబ్బరి సాగు ఎక్కువ. దేశంలో కేరళ తర్వాత.. కోనసీమలో భారీ ఎత్తున కొబ్బరి సాగు చేస్తున్నారు.…
సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది.…
ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక…
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…
టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…