Political News

కేసీయార్ సరెండర్ అయిపోయినట్లేనా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతన్నది చూస్తుంటే కేంద్రప్రభుత్వానికి కేసీయార్ పూర్తిగా సరెండర్ అయిపోయినట్లే అనుమానాలు పెరిగిపోతోంది. దుబ్బాక ఎన్నికలకు ముందు కేంద్రంలోని నరేంద్రమోడి సర్కార్ పై ఎంతమాట పడితే అంత మాట్లాడేసేవారు కేసీయార్. ఆయుష్మాన భవ లాంటి కొన్ని కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేసేది లేదని ప్రతిజ్ఞ చేశారు. ఈమధ్యనే కేంద్రం చేసిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేసేదే లేదని తెగేసి చెప్పారు.

గ్రేటర్ ఎన్నికల సందర్భంలో అయితే కేంద్రంపై ఇక యుద్ధమే అంటూ చాలా భీకరంగా ప్రకటించారు. ఇన్ని మాటలు మాట్లాడిన కేసీయార్ చివరకు ఏమి చేస్తున్నారు ? గ్రేటర్ ఎన్నికల ఫలితల తర్వాత ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నట్లే అనిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో బాగా దెబ్బతిన్న తర్వాత హఠాత్తుగా ఢిల్లీకి వెళ్ళారు. మూడురోజుల పర్యటనలో మోడిని కలిసిన తర్వాత ఏమైందో ఎవరికీ స్పష్టంగా తెలీదు. మొత్తానికి కేంద్రం ఏమి చెబితే మారుమాట్లాడకుండా ఫాలో అయిపోతున్నారు.

అసలు కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్కమాటంటే ఒక్కమాట కూడా మాట్లాడటం లేదు. పైగా గతంలో తాను తీవ్రంగా వ్యతిరేకించిన కేంద్ర పథకాలనే ఇపుడు చాలా హడావుడిగా అమలు చేసేస్తున్నారు. ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎంను ఎంతగా విమర్శలు చేస్తున్నా, ఎన్ని ఆరోపణలు చేస్తున్నా అసలు కౌంటర్లు ఇవ్వటమే లేదు. కేసీయార్ కాదు కదా కనీసం చోటామోటా లీడర్లు కూడా బీజేపీ నేతలకు కౌంటర్లు ఇవ్వటం లేదు.

ఉద్యమనేతగా పాపులరైన కేసీయార్ కు ఇపుడేమైంది ? అన్నదే ఎవరికీ అర్ధం కావటం లేదు. ఢిల్లీలో మొత్తానికి ఏమో జరిగింది. ఢిల్లీలోని బీజేపీ పెద్దలు మరి ఏమి చూపించారో లేకపోతే ఏమి మాట్లాడారో ఏమో తెలీటం లేదుకానీ కేసీయార్ మాత్రం అసలు నోరేవిప్పటం లేదు. పైగా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించేస్తున్నారు. అలాగే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేస్తానని కూడా ప్రకటించేశారు.

This post was last modified on January 3, 2021 4:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

1 hour ago

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

1 hour ago

మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…

2 hours ago

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…

5 hours ago

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…

6 hours ago

టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…

7 hours ago