బెజవాడ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలిసిందే. గెలుపోటములతో సంబంధం లేకుండా ఆ ఫ్యామిలీకి ‘కాపు’లు కాపు కాస్తుంటారు. వంగవీటి రంగా ఉన్నంత కాలం బెజవాడ రాజకీయాలలో తనదైన పాత్ర పోషించారు. ఆయన తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మాత్రం తన తండ్రి తరహాలో రాజకీయ గుర్తింపు సంపాదించుకోలేదన్న అభిప్రాయం ప్రజలలో ఉంది.
మొదట కాంగ్రెస్, ఆ తరువాత పీఆర్పీ, ఆ తరువాత వైసీపీలో చేరిన వంగవీటి రాధా… గత ఎన్నికలకు ముందు సడెన్ గా టీడీపీలో చేరారు. కొద్ది రోజుల క్రితం రాధా….జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. దీంతో, రాధా ఏ పార్టీలోనూ నిలకడగా ఉండరన్న టాక్ ఉంది. దీంతో, రాధా మాత్రం ఈ సారి టీడీపీలోనే కొనసాగాలని ఫిక్స్ అయ్యారని, దీంతో, రాధాకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
కానీ, రంగా హత్యకు టీడీపీ నేతలే కారణమని కొద్ది రోజులుగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో తాజాగా రాధా తిరిగి సొంతగూటికి చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీలో చేరాలని రాధాను మంత్రి కొడాలి నాని కోరారని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. వైసీపీని వద్దనుకొని వచ్చిన తర్వాత తిరిగి సొంతగూటికి చేరేందుకు రాధా ఇబ్బందిగా భావిస్తున్నారని చెప్పుకున్నారు.
కానీ, 2019 ఎన్నికలలో సీటు విషయం మినహాయించి వైసీపీతో, సీఎం జగన్ తో రాధాకు విభేదాలు లేవు. దీంతో, రాధా కూడా అనవసరంగా వైసీపీని వీడానన్న భావనలో ఉన్నారని తెలుస్తోంది. దీనికితోడు, తాజాగా మారిన సమీకరణాల నేపథ్యంలో వంగవీటి రాధా వైసీపీతో తన రాజకీయ భవిష్యత్తు చక్కదిద్దుకోవాలని డిసైడయినట్టు తెలుస్తోంది. అయితే, టీడీపీని వీడి రాధా వైసీపీలో చేరతారా? మళ్లీ బెజవాడ రాజకీయాల్లో వంగవీటి రాధా కీలకంగా మారతారా? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానమివ్వాలి.
This post was last modified on January 3, 2021 12:37 pm
వైైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన కన్న తల్లి విజయమ్మ నుంచే భారీ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం పనిచేస్తోందని ఆరోపించిన కొన్ని గంటల వ్యవధిలోనే టీడీపీ యువనాయకుడు,…
సౌత్ దర్శకుల్లో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత అంతకన్నా తక్కువో ఎక్కువో స్టార్ డం తెచ్చుకున్న వాళ్లలో లోకేష్ కనగరాజ్…
ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థియేటర్ ఓటిటి మధ్య ఇప్పుడున్న గ్యాప్ సరిపోదని నాలుగు…
రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల ఇంచార్జ్లను మార్చనున్నట్లు వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందన్నారు.…
పహల్ గాం ఉగ్రవాద దాడి తదనంతర పరిణామాల్లో భాగంగా మంగళవార తెల్లవారుజామున భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ భూభాగంలోని ఆ దేశ…