బెజవాడ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలిసిందే. గెలుపోటములతో సంబంధం లేకుండా ఆ ఫ్యామిలీకి ‘కాపు’లు కాపు కాస్తుంటారు. వంగవీటి రంగా ఉన్నంత కాలం బెజవాడ రాజకీయాలలో తనదైన పాత్ర పోషించారు. ఆయన తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మాత్రం తన తండ్రి తరహాలో రాజకీయ గుర్తింపు సంపాదించుకోలేదన్న అభిప్రాయం ప్రజలలో ఉంది.
మొదట కాంగ్రెస్, ఆ తరువాత పీఆర్పీ, ఆ తరువాత వైసీపీలో చేరిన వంగవీటి రాధా… గత ఎన్నికలకు ముందు సడెన్ గా టీడీపీలో చేరారు. కొద్ది రోజుల క్రితం రాధా….జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. దీంతో, రాధా ఏ పార్టీలోనూ నిలకడగా ఉండరన్న టాక్ ఉంది. దీంతో, రాధా మాత్రం ఈ సారి టీడీపీలోనే కొనసాగాలని ఫిక్స్ అయ్యారని, దీంతో, రాధాకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
కానీ, రంగా హత్యకు టీడీపీ నేతలే కారణమని కొద్ది రోజులుగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో తాజాగా రాధా తిరిగి సొంతగూటికి చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీలో చేరాలని రాధాను మంత్రి కొడాలి నాని కోరారని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. వైసీపీని వద్దనుకొని వచ్చిన తర్వాత తిరిగి సొంతగూటికి చేరేందుకు రాధా ఇబ్బందిగా భావిస్తున్నారని చెప్పుకున్నారు.
కానీ, 2019 ఎన్నికలలో సీటు విషయం మినహాయించి వైసీపీతో, సీఎం జగన్ తో రాధాకు విభేదాలు లేవు. దీంతో, రాధా కూడా అనవసరంగా వైసీపీని వీడానన్న భావనలో ఉన్నారని తెలుస్తోంది. దీనికితోడు, తాజాగా మారిన సమీకరణాల నేపథ్యంలో వంగవీటి రాధా వైసీపీతో తన రాజకీయ భవిష్యత్తు చక్కదిద్దుకోవాలని డిసైడయినట్టు తెలుస్తోంది. అయితే, టీడీపీని వీడి రాధా వైసీపీలో చేరతారా? మళ్లీ బెజవాడ రాజకీయాల్లో వంగవీటి రాధా కీలకంగా మారతారా? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానమివ్వాలి.
This post was last modified on January 3, 2021 12:37 pm
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయన ప్రాభవాన్ని.. వైభవాన్ని…
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పేర్ని నాని. వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి. గత ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకొని వారసుడు కిట్టుకు…