బెజవాడ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలిసిందే. గెలుపోటములతో సంబంధం లేకుండా ఆ ఫ్యామిలీకి ‘కాపు’లు కాపు కాస్తుంటారు. వంగవీటి రంగా ఉన్నంత కాలం బెజవాడ రాజకీయాలలో తనదైన పాత్ర పోషించారు. ఆయన తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మాత్రం తన తండ్రి తరహాలో రాజకీయ గుర్తింపు సంపాదించుకోలేదన్న అభిప్రాయం ప్రజలలో ఉంది.
మొదట కాంగ్రెస్, ఆ తరువాత పీఆర్పీ, ఆ తరువాత వైసీపీలో చేరిన వంగవీటి రాధా… గత ఎన్నికలకు ముందు సడెన్ గా టీడీపీలో చేరారు. కొద్ది రోజుల క్రితం రాధా….జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. దీంతో, రాధా ఏ పార్టీలోనూ నిలకడగా ఉండరన్న టాక్ ఉంది. దీంతో, రాధా మాత్రం ఈ సారి టీడీపీలోనే కొనసాగాలని ఫిక్స్ అయ్యారని, దీంతో, రాధాకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
కానీ, రంగా హత్యకు టీడీపీ నేతలే కారణమని కొద్ది రోజులుగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో తాజాగా రాధా తిరిగి సొంతగూటికి చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీలో చేరాలని రాధాను మంత్రి కొడాలి నాని కోరారని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. వైసీపీని వద్దనుకొని వచ్చిన తర్వాత తిరిగి సొంతగూటికి చేరేందుకు రాధా ఇబ్బందిగా భావిస్తున్నారని చెప్పుకున్నారు.
కానీ, 2019 ఎన్నికలలో సీటు విషయం మినహాయించి వైసీపీతో, సీఎం జగన్ తో రాధాకు విభేదాలు లేవు. దీంతో, రాధా కూడా అనవసరంగా వైసీపీని వీడానన్న భావనలో ఉన్నారని తెలుస్తోంది. దీనికితోడు, తాజాగా మారిన సమీకరణాల నేపథ్యంలో వంగవీటి రాధా వైసీపీతో తన రాజకీయ భవిష్యత్తు చక్కదిద్దుకోవాలని డిసైడయినట్టు తెలుస్తోంది. అయితే, టీడీపీని వీడి రాధా వైసీపీలో చేరతారా? మళ్లీ బెజవాడ రాజకీయాల్లో వంగవీటి రాధా కీలకంగా మారతారా? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానమివ్వాలి.
This post was last modified on January 3, 2021 12:37 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…