Political News

అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా ?

అన్నదమ్ముల తీరు ఇలాగే ఉంటుంది. తాము అనుకున్నది సాధించుకోవటానికి కోమటిరెడ్డి బ్రదర్స్ కు బెదిరింపు రాజకీయాలు చేయటం బాగా అలవాటే. తాము కోరుకున్న పదవులు ఇవ్వకపోయినా లేదా టికెట్లు తమకు కానీ తాము చెప్పినవారికి కానీ దక్కదు అనుకున్న మరుక్షణం నుండే ఇటువంటి బెదిరింపులు మొదలుపెట్టేస్తారు. ఈ విషయాలు గతంలో చాలాసార్లు జరిగాయి. ఇదంతా ఎందుకంటే రాబోయే రోజుల్లో తాను బీజేపీలో చేరబోతున్నట్లు కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ప్రకటించారు.

తెలంగాణా కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాలరెడ్డిగా చాలా పాపులర్. ఇద్దరిలో ఒకరు ఎంఎల్ఏ ఉంటే మరొకరు ఎంపిగా ఉంటారు. ఇది వీరిద్దరిలో ఉన్న అండర్ స్టాండింగ్ అన్నమాట. ఇంత హఠాత్తుగా తాను బీజేపీలో చేరబోతున్నట్లు రాజగోపాలరెడ్డి ఎందుకు ప్రకటించారు ? ఎవరైనా పార్టీ మారేట్లయితే ముందుగా నోటీసిచ్చి చేరరు. గతంలో కాంగ్రెస్ నుండి బీజేపీలోకి చేరిపోయిన నేతలెవరు మైకు పట్టుకుని ఊరంగా ప్రచారం చేసి, ముందస్తు సమాచారం ఇచ్చి చేరలేదు.

ఎవరితోనో మాట్లాడుకుంటారు ఈక్వేషన్లన్నీ కుదిరితే వెంటనే కండువా మార్చేస్తారని అందరికీ తెలిసిందే. అలాంటిది ఇపుడు రాజగోపాల రెడ్డి ఎందుకు ఇలా ప్రకటించారు ? ఎందుకంటే తెలంగాణా పీసీసీ అధ్యక్షపదవిని తొందరలో భర్తీ చేయబోతున్నది అధిష్టానం. అధ్యక్షపదవికి వెంకటరెడ్డి తో పాటు రేవంత్ రెడ్డి మరో గట్టి పోటీదారు. వీళ్ళిద్దరిలో రేవంత్ కే అవకాశం ఉందనే ప్రచారం బాగా జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే రాజగోపాలరెడ్డి వ్యూహాత్మకంగా ఈ బెదిరింపు ప్రకటన చేసినట్లు అనుమానంగా ఉంది.

రాజగోపాలరెడ్డి బీజేపీలోకి వెళిపోతే ఎప్పుడోరోజు వెంకటరెడ్డి కూడా వెళ్ళిపోవటం ఖాయం. ఎందుకంటే తాము ఆశించిన పదవిని అధిష్టానం ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ లో కంటిన్యు అయ్యే అవకాశం తక్కువే. తాను బీజేపీలోకి వెళ్ళినా తన సోదరుడు వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్ లోనే ఉంటారని పైకి చెబుతున్నా అదంతా వ్యూహంలో భాగమనే అనుకోవాలి. నిజానికి రాజగోపాల్ బీజేపీలోకి వెళ్ళిపోతారని ఒకసారి లేదు లేదు టీఆర్ఎస్ లోకి వెళతారని మరోసారి చాలాకాలంగా ప్రచారంలో ఉంది.

కేవలం పదవులను ఆశించే కోటమిరెడ్డి బ్రదర్స్ ఇలాంటి ట్రిక్కులు ప్రదర్శిస్తుంటారనే ప్రచారం పార్టీలోనే జరుగుతోంది. ఇదే సమయంలో పార్టీలోని నేతలు, క్యాడర్ తోనే కాకుండా నియోజకవర్గంలోని జనాలతో కూడా రెగ్యులర్ టచ్ లో ఉంటారు వీళ్ళద్దరు. అందుకనే జిల్లాలో సోదరులకు మంచి పట్టుంది. అయితే జిల్లాలో తమకున్న పట్టును అడ్డం పెట్టుకుని తమకు పడని వాళ్ళందరినీ వీళ్ళు ఇబ్బంది పెడుతుంటారనే ఆరోపణలు కూడా బాగా ఉన్నాయి. ఎవరు అధ్యక్షుడిగా ఉన్న అసమ్మతి రాజకీయాలు చేసే బ్రదర్స్ లో ఎవరికి పదవి వచ్చినా మిగిలిన వాళ్ళు వ్యతిరేకం చేయకుండా ఉంటారా ? ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా ఇలా కొట్టుకుంటున్నారు కాబట్టే పార్టీ పరిస్ధితి ఇలా తయారైంది.

This post was last modified on January 2, 2021 11:23 pm

Share

Recent Posts

నాగార్జున నమ్మకం ఎక్కడ తప్పింది

చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…

1 hour ago

విజయ్ స్థానాన్ని భర్తీ చేస్తాడా?

తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…

4 hours ago

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

6 hours ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

7 hours ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

7 hours ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

7 hours ago