Political News

బీజేపీలో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణలో బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి అనంతరం టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్త టీపీసీసీ చీఫ్ ఎవరన్నదానిపై కాంగ్రెస్ లోని సీనియర్ నేతలు మల్లగుల్లాలు పడ్డారు. టీపీసీసీ చీఫ్ రేసులో రేవంత్ రెడ్డి ముందుండగా….మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి తర్వాతి స్థానంలో ఉన్నట్లు ప్రచారం జరిగింది.

అయితే, కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ వైపు మొగ్గు చూపుతుందన్న పుకార్ల నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీలో చేరతారని వదంతులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వెంకటరెడ్డి సోదరుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను బీజేపీలో చేరబోతున్నట్టు రాజగోపాల్ రెడ్డి షాకింగ్ ప్రకటన చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనం సందర్భంగా రాజగోపాల్ రెడ్డి ఈ నిర్ణయాన్ని మీడియాకు వెల్లడించారు.

తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అని తాను చాలా రోజుల క్రితమే చెప్పానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, టీఆర్ ఎస్ ను దీటుగా బీజేపీ ఎదుర్కోగలదని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఒంటెత్తు పోకడలు మానుకోవాలని, ప్రతిపక్షాలను కలుపుకొని పోవాలని అన్నారు. సీఎం జగన్ తండ్రికి తగ్గ కొడుకు కావాలని అభిలషిస్తున్నట్టు రాజగోపాల్ రెడ్డి అన్నారు.

తాను మాత్రమే బీజేపీ తీర్థం పుచ్చుకున్నానని చెప్పిన రాజగోపాల్ రెడ్డి….కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని చెప్పారు. తామిద్దరం వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ…అన్నదమ్ములగా కలిసిమెలిసి ఉంటామన్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి ఎవరిని వరిస్తుందన్న దానిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర సమాధానమిచ్చారు. కొత్త అధ్యక్షుడు ఎవరన్న ప్రశ్నకు కాలమే సమాధానమిస్తుందన్నారు. తాజాగా, రాజగోపాల్ రెడ్డి నిర్ణయంతో టీపీసీసీ చీఫ్ గా ఎవరిని నియమించాలన్న విషయంపై కాంగ్రెస్ అధిష్టానం వైఖరిలో మార్పు ఉంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on January 1, 2021 7:41 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

50 mins ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

54 mins ago

20 వసంతాల ‘ఆర్య’ చెప్పే కబుర్లు

ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…

1 hour ago

సుహాస్ లెక్క తప్పుతోంది ఇక్కడే

కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు తెచ్చుకుని రైటర్ పద్మభూషణ్ రూపంలో మొదటి థియేట్రికల్ హిట్ అందుకున్న సుహాస్ కు ఈ…

2 hours ago

ఇటు సత్యదేవ్ అటు రోహిత్ మధ్యలో కోతులు

మే మొదటి వారం కొత్త రిలీజులు నిరాశపరిచిన నేపథ్యంలో అందరి కళ్ళు రాబోయే శుక్రవారం మీద ఉన్నాయి. స్టార్ హీరోలవి…

3 hours ago

ఏపీలో వేవ్ మొదలైనట్లేనా?

ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుకుని వైకాపా ఘనవిజయం సాధించబోతున్న సంకేతాలు…

4 hours ago