ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధమైనా.. విపత్తయినా.. ప్రజలకు ఏం జరిగినా.. ప్రధాని మోడీకి రాజకీయాలే ముఖ్యమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నెలకొన్న యుద్ధ సమయాన్ని.. తద్వారా వచ్చిన ఇంధన విపత్తును ఎవరూ కాదనలేరన్నారు. కానీ.. దీని వెనుక చేసిన రాజకీయమే ఇప్పుడుచర్చకు కీలకమని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందే.. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైందన్నారు.
ఆ సమయంలోనే చమురు ఉత్పత్తులు.. రావడం తగ్గిపోయిందని, కానీ, ఆ సమయంలో ఈ విషయాన్ని దాచి పెట్టిన ప్రధాని, ఐదురాష్ట్రాల ఎన్నికలు ముగియగానే.. ధరలు పెంచి.. పొదుపు మంత్రం పాటించాలని చెప్పడం రాజకీయం కాక మరేమిటని ప్రశ్నించారు. యుద్ధం ఎప్పటి వరకు జరుగుతుందో చెప్పలేమని.. ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ విపత్తు కూడా ఎప్పటి వరకు ఉంటుందో కూడా చెప్పలేమని తెలిపారు. కానీ, మోడీది రాజకీయ కోణమైతే.. తమది కార్మికుల కోణమని స్పష్టం చేశారు.
కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ.. విషయాన్ని దాచిపెట్టి రాజకీయ లబ్ధిపొందాలనుకునే మోడీ వంటి వ్యక్తులకు వ్యతిరేకంగా సమాజం ఒకే తాటిపైకి రావాలని సూచించారు. మేధావులు ఈ విషయాన్ని చర్చించాలన్నారు.
This post was last modified on May 21, 2026 10:09 pm
అగ్రశ్రేణి కథానాయకులు.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చేసే దర్శకులతో.. కొత్తవాళ్లు, పెద్దగా అనుభవం లేని డైరెక్టర్లతో పని చేయడం…
రాష్ట్రంలో ఓటు లేని వారికి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను ఎలా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరి…
సంక్రాంతి సినిమాల తర్వాత నాలుగైదు నెలల పాటు బాక్సాఫీస్ దగ్గర పెద్ద స్లంప్ చూసింది టాలీవుడ్. కానీ గత నెలలో…
ఏదైనా రీమేక్ సినిమాకు వచ్చే అతి పెద్ద సమస్య పోలిక. ఒరిజినల్ కంటే మెరుగ్గా తీశారా, నటీనటుల్లో ఎవరు బాగా…
ప్రముఖ తెలుగు నిర్మాత, నటుడు బండ్ల గణేష్కు సంబంధించిన ఆస్తి వివాదం ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గణేష్కు చెందిన…
ఏపీ మంత్రి నారా లోకేష్పై సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. ఏకబిగిన ఏడున్నర గంటల పాటు నిలబడి.. ప్రజలకు…