వైసీపీని `నెంబరు 11` వెంటాడుతోంది. 2024లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాల్లోనే విజయం దక్కింది. వాస్తవానికి వైనాట్ 175 అన్నా కూడా.. ప్రజలు మాత్రం 11 సీట్లకే పరిమితం చేశారు. ఇక, అప్పటి నుంచి `లెవెన్ రెడ్డి` అనే పేరు జగన్కు.. `11 మెంబర్స్` అనే పేరు వైసీపీ ఎమ్మెల్యేలకు స్థిరపడిపోయింది. ఇక, తరచుగా ఈ విషయం రాజకీయంగా కూడా… జగన్కు, ఆ పార్టీ నాయకులకు ఇబ్బందిగా మారినప్పటికీ.. ప్రత్యర్థులు మాత్రం ఆటపట్టిస్తూనే ఉన్నారు.
ఈ నెల ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలను కూడా 11వ తేదీనే ప్రారంభించడం.. 11 గంటల 11 నిమిషాలకు సభను మొదలు పెట్టడంపైనా అనేక సెటర్లు పడ్డాయి. వైసీపీ దీని నుంచి తమనుతాము రక్షించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ, ప్రజలు ఇచ్చిన తీర్పు కారణంగా.. వైసీపీకి ఈ సమస్య కొనసాగుతోంది. ఇక, తాజాగా పార్లమెంటు వేదికగా కూడా.. వైసీపీకి ఈ 11 ఇబ్బంది తప్పలేదు. చిత్రంగా ఉన్నప్పటికీ.. నిజం!.
పార్లమెంటు కొత్త భవనంలో పార్టీలకు రూములు కేటాయించే సంప్రదాయం ఉంది. గతంలో ఉన్నపాత భవనాన్ని పూర్తిగా ఖాళీ చేసి.. ప్రస్తుతం కట్టిన సెంట్రల్ విస్టా(కొత్త పార్లమెంటు)లో పార్టీల వారీగా వారి వారి సభ్యుల సంఖ్యను బట్టి.. రూములు కేటాయిస్తున్నారు. తాజాగా వైసీపీకి రూమ్ నెంబరు 11 కేటాయించారు. ఇది పూర్తిగా స్పీకర్ ఓం బిర్లా విచక్షణ మేరకు జరిగే నిర్ణయం. అయితే.. దీనిపై వైసీపీ ఎంపీలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
స్పీకర్ కార్యాలయంలోకి వెళ్లిన వైసీపీ ఎంపీలు.. తమకు రూమ్ 11 కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. ఇదేసమయంలో వారి వాదనను బలంగా వినిపించారు. తమను అవమానించేందుకు కొందరు కుట్ర చేశారని.. దీనిని స్పీకర్ అనుమతించరాదని వారు అభ్యర్థించారు.
అయినప్పటికీ.. ఒక్కసారి కేటాయించిన రూములను మార్చబోమని స్పీకర్ తెగేసి చెప్పారు. చివరకు ఉత్తరాదికి చెందిన ఓ కేంద్ర మంత్రి జోక్యంతో వైసీపీ సభ్యుల విజ్ఞాపనకు స్పీకర్ అంగీకరించారు. అనంతరం.. వారికి రూమ్ నెంబరు 12ను కేటాయించారు. అయితే.. పార్లమెంటులోనూ వైసీపీని 11 వెంటాడడం ఆసక్తిగా మారింది.
This post was last modified on March 24, 2026 7:41 pm
మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…
సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…