Political News

జమిలి ఎన్నికలకు రెడీ అయిపోతున్న కేంద్రం ?

కేంద్ర ఎన్నికల చీఫ్ కమీషనర్ సునీల్ అరోరా తాజాగా చేసిన ప్రకటన చూస్తుంటే ఇదే అనుమానం పెరుగుతోంది. జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమీషన్ సిద్ధమంటు అరోరా చేసిన ప్రకటనతో రాజకీయాల్లో ఒక్కసారిగా వేడిపెరిగిపోయింది. ప్రధానమంత్రి నరేంద్రమోడి జమిలి ఎన్నికల విషయమై పదే పదే ప్రస్తావిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో ప్రధానమంత్రి సూచన ప్రకారం రాజకీయపార్టీలతో ఎన్నికల కమీషన్ ఇదే విషయమై సమావేశం నిర్వహించింది.

ఆ సమావేశంలో మెజారిటి పార్టీలు జమిలి ఎన్నికలను వ్యతిరేకించాయి. ఇదే విషయాన్ని ఎన్నికల కమీషన్ కూడా ప్రస్తావిస్తు జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తేల్చేసింది. అయితే కమీషన్ తన అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత కూడా మోడి పదే పదే జమిలి ఎన్నికల నిర్వహణను మాత్రం ప్రస్తావిస్తునే ఉన్నారు. తెరవెనుక ఏమైందో ఎవరికీ అర్ధం కావటం లేదు కానీ హఠాత్తుగా జమిలి ఎన్నికల నిర్వహణకు తాము రెడీగా ఉన్నట్లు అరోరా చేసిన ప్రకటనతో రాజకీయపార్టీలన్నీ ఆశ్చర్యపోయాయి.

తాజాగా ఎన్నికల కమీషన్ చేసిన ప్రకటనతో తొందరలోనే జమిలి ఎన్నికల నిర్వహణ తప్పదేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్న సామెతలాగ ప్రధాని పట్టుబడితే జమిలి ఎన్నికలు జరపక తప్పదని అందరికీ అర్ధమైపోతోంది. ఎందుకంటే దేశంలో మెజారిటి రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. ఒకసారి మోడి ఆదేశిస్తే ఆ ముఖ్యమంత్రులందరు తమ ప్రభుత్వాలను రద్దు చేసుకుంటారనటంలో సందేహం లేదు.

ఇక మిగిలిన రాష్ట్రాల్లో కూడా మమతాబెనర్జీ లాగ కేంద్రాన్ని నూరుశాతం ఎంత మంది వ్యతిరేకిస్తారన్నది అనుమానమే. కాబట్టి అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే మెజారిటి రాష్ట్రాల అసెంబ్లీలు జమిలి ఎన్నికల నిర్వహణకు సానుకూలంగానే స్పందించటం ఖాయమని అర్ధమైపోతోంది. ఇక లోక్ సభలో కూడా ఈ బిల్లు పాస్ అవ్వటం సమస్యే కాదు. కాకపోతే రాజ్యసభలో ఏమన్నా కొద్దిగా ఇబ్బందులు ఎదురైతే కావచ్చు. దాన్ని కూడా ఏదోలా మ్యానేజ్ చేసేసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

కాబట్టి మోడి గట్టిగా పడుపడుతున్న నేపధ్యంలో తొందరలోనే దేశంలో జమిలి ఎన్నికలకు రెడీ అయిపోవచ్చు. కాకపోతే జమిలి నేపధ్యంలో వచ్చే ఏడాది జరగాల్సిన పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలను ఎన్నికల కమీషన్ నిర్వహిస్తుందా లేదా అన్నదే సస్పెన్సుగా మారింది. ఒకవైపు జమిలి ఎన్నికలు జరపాలని గట్టిగా కోరుకుంటూనే మరోవైపు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తుపోవటం వల్ల ఉపయోగం ఉండదు.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

4 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

4 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

6 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

6 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

6 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

6 hours ago