Political News

తిరుపతిలో టీడీపీ ‘వ్యూహకర్త’ బిజీ బిజీ

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో గెలుపును తెలుగుదేశంపార్టీ బాగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లే కనబడుతోంది. అందుకనే ఎన్నిక నోటిఫికేషన్ రావటానికి ఇంకా సమయం ఉండగానే ప్రత్యేకంగా ఓ వ్యూహకర్తను రంగంలోకి దింపేసింది. వచ్చే ఎన్నికలో పార్టీని అధికారంలోకి తేవటం కోసం చంద్రబాబునాయుడు గతంలోనే ఓ వ్యూహకర్త రాబిన్ శర్మతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇపుడా రాబిన్ శర్మే తిరుపతిలో మకాం వేశారట.

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ సంస్ధలో చాలా కాలం పనిచేసిన రాబిన్ శర్మ కొత్తగా ‘షోటైమ్ కన్సల్టింగ్’ అనే సంస్ధను పెట్టుకున్నారు. దాని ద్వారా రాజకీయ పార్టీలకు అవసరమైన వ్యవహారాలను చక్క బెట్టటానికి పెద్ద బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి రాబిన్ తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇపుడా శర్మ బృందమే తిరుపతిలో మకాం వేసింది. తిరుపతి లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నేతలతో టచ్ లోకి వెళుతోందని సమాచారం.

శర్మ బృందం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తు నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తోంది. పనిలో పనిగా రాజకీయాలతో సంబంధాలు లేని తటస్తులు, మామూలు జనాలతో కూడా చర్చిస్తోందని సమాచారం. వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన క్షేత్రస్ధాయిలోని సమాచారాన్ని, ప్రభుత్వంపై జనాబిప్రాయాన్ని సేకరిస్తోందట. జనాభిప్రాయానికి అనుగుణంగా ఎన్నికల్లో టీడీపీ అనుసరించాల్సిన వ్యూహాలపై శర్మ కసరత్తు చేస్తున్నారు.

తిరుపతి ఉపఎన్నికలో గెలుపును టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ గెలిస్తే పార్టీ నేతలకు, శ్రేణులకు మంచి ఊపునిస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఇక్కడ గనుక ఓడిపోతే పార్టీపై ఊహించని దెబ్బపడటం ఖాయం. అసలే కష్టాల్లో ఉన్న పార్టీ మీద మరింత దెబ్బపడితే తట్టుకోవటం కష్టం. అందుకనే అభ్యర్దిని ముందుగా ప్రకటించటం, నేతలతో వరుసగా చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్సులతో మాట్లాడుతున్నారు. తాజాగా రాబిన్ బృందాన్ని కూడా రంగంలోకి దింపారు. పార్టీ గెలుపు కోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న చంద్రబాబుకు ఫలితం వస్తుందా ? అన్నది చూడాల్సిందే.

Satya

Recent Posts

ఇక కొడాలి నాని వంతు

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైర్‌బ్రాండ్ కొడాలి నానిపై 2021లో న‌మోదైన కేసు విచార‌ణ‌కు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.…

7 hours ago

అత్తెసరు వసూళ్లతో ముంచేసేలా ఉంది

హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…

8 hours ago

‘చంద్రబాబు భరోసానిచ్చారు… మాకు అది చాలు’

ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…

9 hours ago

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

11 hours ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

12 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

12 hours ago