Political News

తిరుపతిలో టీడీపీ ‘వ్యూహకర్త’ బిజీ బిజీ

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో గెలుపును తెలుగుదేశంపార్టీ బాగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లే కనబడుతోంది. అందుకనే ఎన్నిక నోటిఫికేషన్ రావటానికి ఇంకా సమయం ఉండగానే ప్రత్యేకంగా ఓ వ్యూహకర్తను రంగంలోకి దింపేసింది. వచ్చే ఎన్నికలో పార్టీని అధికారంలోకి తేవటం కోసం చంద్రబాబునాయుడు గతంలోనే ఓ వ్యూహకర్త రాబిన్ శర్మతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇపుడా రాబిన్ శర్మే తిరుపతిలో మకాం వేశారట.

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ సంస్ధలో చాలా కాలం పనిచేసిన రాబిన్ శర్మ కొత్తగా ‘షోటైమ్ కన్సల్టింగ్’ అనే సంస్ధను పెట్టుకున్నారు. దాని ద్వారా రాజకీయ పార్టీలకు అవసరమైన వ్యవహారాలను చక్క బెట్టటానికి పెద్ద బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి రాబిన్ తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇపుడా శర్మ బృందమే తిరుపతిలో మకాం వేసింది. తిరుపతి లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నేతలతో టచ్ లోకి వెళుతోందని సమాచారం.

శర్మ బృందం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తు నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తోంది. పనిలో పనిగా రాజకీయాలతో సంబంధాలు లేని తటస్తులు, మామూలు జనాలతో కూడా చర్చిస్తోందని సమాచారం. వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన క్షేత్రస్ధాయిలోని సమాచారాన్ని, ప్రభుత్వంపై జనాబిప్రాయాన్ని సేకరిస్తోందట. జనాభిప్రాయానికి అనుగుణంగా ఎన్నికల్లో టీడీపీ అనుసరించాల్సిన వ్యూహాలపై శర్మ కసరత్తు చేస్తున్నారు.

తిరుపతి ఉపఎన్నికలో గెలుపును టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ గెలిస్తే పార్టీ నేతలకు, శ్రేణులకు మంచి ఊపునిస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఇక్కడ గనుక ఓడిపోతే పార్టీపై ఊహించని దెబ్బపడటం ఖాయం. అసలే కష్టాల్లో ఉన్న పార్టీ మీద మరింత దెబ్బపడితే తట్టుకోవటం కష్టం. అందుకనే అభ్యర్దిని ముందుగా ప్రకటించటం, నేతలతో వరుసగా చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్సులతో మాట్లాడుతున్నారు. తాజాగా రాబిన్ బృందాన్ని కూడా రంగంలోకి దింపారు. పార్టీ గెలుపు కోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న చంద్రబాబుకు ఫలితం వస్తుందా ? అన్నది చూడాల్సిందే.

This post was last modified on December 22, 2020 1:22 am

Share
Show comments
Published by
Satya
Tags: TDPTirupati

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago