Political News

పీకే సంచలన ట్వీట్

పీకే అనగానే మనకు పవన్ కళ్యాణే గుర్తుకొస్తాడు కానీ.. జాతీయ స్థాయిలో అయితే ఆ పేరుతో పాపులరైన వ్యక్తి మరొకరున్నారు. ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్. తనదైన వ్యూహ చతురతతో, ప్లానింగ్‌తో రాజకీయ ముఖచిత్రాలు మార్చేయగల నిపుణుడిగా ప్రశాంత్‌కు పేరుంది. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ భారీ విజయం సాధించడంలో ప్రశాంత్ టీమ్ పాత్ర కీలకమన్న సంగతి తెలిసిందే.

బీహార్‌కు చెందిన ఈయన తన సొంత రాష్ట్రంలోనే కాక వేరే ప్రాంతాల్లోనూ రాజకీయ పార్టీలను వెనుకుండి నడిపించి సంచలన ఫలితాలు రాబట్టారు. ఎప్పుడూ ఉండేది తెర వెనుకే కానీ.. రాజకీయ వర్గాల్లో మాత్రం ప్రశాంత్‌కు ఉన్న గుర్తింపే వేరు. ఆయన వ్యాఖ్యలు, సోషల్ మీడియా స్టేట్మెంట్లకు మీడియా మంచి ప్రాధాన్యం ఇస్తుంది.

తాజాగా ప్రశాంత్ కిషోర్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌లో ఫలితాలపై ప్రశాంత్ చెబుతున్న జోస్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అక్కడ భారతీయ జనతా పార్టీ చాలా బలపడిందని, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు షాకిచ్చి అధికారంలోకి రాబోతోందని విశ్లేషకులు అంటుండగా.. దానికి పూర్తి భిన్నంగా ప్రశాంత్ ట్వీట్ వేశారు. బెంగాల్‌లో బీజేపీ బలం గురించి ఊరికే హైప్ మాత్రమే నడుస్తోందని.. వాస్తవానికి వచ్చే ఏడాది ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోర పరాభవం తప్పదని, ఆ పార్టీ సీట్లు డబుల్ డిజిట్ కూడా చేరవని ప్రశాంత్ స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం.

తన అంచనా తప్పితే ఈ చోటు నుంచి తప్పుకుంటా అంటూ తాను సోషల్ మీడియా నుంచి వైదొలుగుతాననే సంకేతాలు ఇచ్చాడు పీకే. ఐతే బెంగాల్‌లో రాజకీయ వాతావరణం చూస్తే మాత్రం మమతకు బీజేపీ నుంచి సవాలు తప్పదనే అనిపిస్తోంది. మరి పీకే ఇంత దూకుడుగా స్టేట్మెంట్ ఎలా ఇవ్వగలిగాడో?

This post was last modified on December 21, 2020 3:55 pm

Share

Recent Posts

రోమియో ఫిక్సయ్యాడు… ఓజి లేటవుతాడు

నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…

1 hour ago

ఉత్త‌రాదిన మోడీ ఇమేజ్‌కు యూత్ చెక్ పెడుతున్నారా?

దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఉన్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఉత్త‌రాది రాష్ట్రాల్లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఇమేజ్‌కు యువ‌త పెద్ద ఎత్తున…

2 hours ago

మంగాపురం కుర్రాడికి మంగళవారం పాఠం

సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…

2 hours ago

అప్పుడు ఒప్పు.. ఇప్పుడు తప్పు.. ఇదేం న్యాయం జగన్?

త్వ‌ర‌లోనే ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు తెర‌దీయ‌నున్నారు. సెప్టెంబ‌రు-అక్టోబ‌రు మ‌ధ్య మునిసిపాలిటీ… న‌వంబ‌రు-డిసెంబ‌రు మ‌ధ్య కార్పోరేష‌న్లు, జ‌న‌వ‌రిలో పంచాయ‌తీ ఎన్నిక‌లు…

2 hours ago

సెలెక్టర్లకు షమీ కనపడడం లేదా?

శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…

3 hours ago

మార్క్ మామా… మోదీజీకి సారీ చెప్పాల్సిందే

ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్‌బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…

4 hours ago