Political News

పీకే సంచలన ట్వీట్

పీకే అనగానే మనకు పవన్ కళ్యాణే గుర్తుకొస్తాడు కానీ.. జాతీయ స్థాయిలో అయితే ఆ పేరుతో పాపులరైన వ్యక్తి మరొకరున్నారు. ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్. తనదైన వ్యూహ చతురతతో, ప్లానింగ్‌తో రాజకీయ ముఖచిత్రాలు మార్చేయగల నిపుణుడిగా ప్రశాంత్‌కు పేరుంది. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ భారీ విజయం సాధించడంలో ప్రశాంత్ టీమ్ పాత్ర కీలకమన్న సంగతి తెలిసిందే.

బీహార్‌కు చెందిన ఈయన తన సొంత రాష్ట్రంలోనే కాక వేరే ప్రాంతాల్లోనూ రాజకీయ పార్టీలను వెనుకుండి నడిపించి సంచలన ఫలితాలు రాబట్టారు. ఎప్పుడూ ఉండేది తెర వెనుకే కానీ.. రాజకీయ వర్గాల్లో మాత్రం ప్రశాంత్‌కు ఉన్న గుర్తింపే వేరు. ఆయన వ్యాఖ్యలు, సోషల్ మీడియా స్టేట్మెంట్లకు మీడియా మంచి ప్రాధాన్యం ఇస్తుంది.

తాజాగా ప్రశాంత్ కిషోర్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌లో ఫలితాలపై ప్రశాంత్ చెబుతున్న జోస్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అక్కడ భారతీయ జనతా పార్టీ చాలా బలపడిందని, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు షాకిచ్చి అధికారంలోకి రాబోతోందని విశ్లేషకులు అంటుండగా.. దానికి పూర్తి భిన్నంగా ప్రశాంత్ ట్వీట్ వేశారు. బెంగాల్‌లో బీజేపీ బలం గురించి ఊరికే హైప్ మాత్రమే నడుస్తోందని.. వాస్తవానికి వచ్చే ఏడాది ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోర పరాభవం తప్పదని, ఆ పార్టీ సీట్లు డబుల్ డిజిట్ కూడా చేరవని ప్రశాంత్ స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం.

తన అంచనా తప్పితే ఈ చోటు నుంచి తప్పుకుంటా అంటూ తాను సోషల్ మీడియా నుంచి వైదొలుగుతాననే సంకేతాలు ఇచ్చాడు పీకే. ఐతే బెంగాల్‌లో రాజకీయ వాతావరణం చూస్తే మాత్రం మమతకు బీజేపీ నుంచి సవాలు తప్పదనే అనిపిస్తోంది. మరి పీకే ఇంత దూకుడుగా స్టేట్మెంట్ ఎలా ఇవ్వగలిగాడో?

This post was last modified on December 21, 2020 3:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

2 minutes ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

1 hour ago

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

2 hours ago

మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…

2 hours ago

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…

5 hours ago

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…

6 hours ago