ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు భారీ ఎత్తున సంబ రాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయంలో తప్పులేదు. అయితే, దీనికి సంబంధించి అధికారులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా వినియోగించుకోవడమే ఇప్పుడు ఇబ్బందిగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ప్రధానంగా అన్ని నియోజకవర్గాల్లోనూ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించేందు కు వైసీపీ నాయకులు రెండు రోజులుగా తీరిక లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తహసీల్దార్ల ను, కిందిస్థాయి వీఆర్ వో, వీఆర్ ఏలను కూడా ఈ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేశారు.
దీంతో ఆయా అధికారులు చేయాల్సిన పనులు నిలిచిపోయాయి. శనివారం, ఆదివారం రెండు రోజులు సెలవులే కదా.. మీరు వచ్చి మాకు సహకరించాలి.. అని కొందరు మంత్రులే మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో సదరు అధికారులు మంత్రులు చెప్పినట్టు ఏర్పాట్లలో మునిగితేలారు.
కానీ, ప్రభుత్వం నిర్దేశాల మేరకు రాష్ట్రంలో జరుగుతున్న అమ్మ ఒడి, నాడు-నేడు, భూముల సమగ్ర సర్వే.. వంటి కార్యక్రమాల్లో వారు సెలవు రోజుల్లోనూ బిజీగానే ఉంటున్నారు. అయినా కూడా మంత్రుల ఆదేశాలతో అధికారులు అదికారిక విధులు పక్కన పెట్టి మరీ వైసీపీ నేతల కార్యక్రమాలకు సహకరిస్తున్నారని తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పుట్టిన రోజులు చేసుకున్నారని, కానీ, ఈ తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఓ పండగగా నిర్వహించడం ఇదే ప్రారంభమని పేర్కొంటున్నారు. అంతేకాదు, పైకి చెప్పకపో యినా.. ప్రభుత్వ నిధులను కూడా మళ్లిస్తున్నారా? అనే సందేహాలు సోషల్ మీడియాలో వ్యక్తం కావడం గమనార్హం.
అంతేకాదు.. అధికారిక విధుల నుంచి అధికారులను తప్పించి పార్టీ కార్యక్రమాలు, సీఎం పుట్టిన రోజు వేడుకలకు వినియోగించుకోవడం సరికాదని.. ఇది మంచి సంకేతాలు ఇవ్వదని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు సీఎం జగన్ సంపాయించుకున్న క్రెడిట్ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అయినా.. కూడా వైసీపీ నాయకులు వినిపించుకోకపోవడం గమనార్హం.
This post was last modified on December 21, 2020 12:32 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…