కరోనా వైరస్ కు యాంటీ వ్యాక్సిన్ వచ్చేస్తోందని ఆనందిస్తున్న వేళ బ్రిటన్లో కొత్త వణుకు మొదలైంది. కరోనా వైరస్సే తన రూపాన్ని మార్చుకుని మరింత ప్రమాదకరంగా విజృంభిస్తోందని బ్రిటన్ శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో బ్రిటన్ ప్రభుత్వం కూడా ముందుజాగ్రత్తగా రెండు వారాల పాటు లాక్ డౌన్ విధించేసింది. అంతేకాకుండా బ్రిటన్ నుండి ఇతర ఐరోపా దేశాలకు విమాన సేవలను రద్దు చేసేసింది. విదేశీయులెవరు తమ దేశంలోకి రావద్దని స్పష్టంగా ప్రకటించటం చూస్తుంటేనే వైరస్ తీవ్రత ఎంతగా వణికించేస్తోందో అర్ధమైపోతోంది.
రూపు మార్చుకున్న కరోనా వైరస్ ను తొలిసారిగా మొన్నటి సెప్టెంబర్ నెలలోనే బ్రిటన్ వైద్య నిపుణులు గుర్తించారు. కరోనా సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఓ రోగికి ట్రీట్మెంట్ ఇస్తున్నపుడు జరిగిన రక్త పరీక్షల్లోనే ఈ వైరస్ ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటి నుండి ఇదే విషయంపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రజ్ఞులు తాజాగా ఇదే విషయాన్ని బయటపెట్టారు.
శాస్త్రజ్ఞుల హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమై ముందుజాగ్రత్తగానే లాక్ డౌన్ విధించటమే కాకుండా విదేశాలతో ప్రమాణ సంబంధాలను కూడా రద్దు చేసింది. బ్రిటన్లో రోగిలో గుర్తించిన ఇటువంటి ప్రమాదకరమైన వైరస్ నే తాజాగా దక్షిణాఫ్రికాలో కూడా మరో రోగిలో బయటపడింది. ఇదే విషయమై బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ తమ దేశంలోని ఓ రోగిలో ప్రమాదకరమైన కరోనా వైరస్ ను గుర్తించినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్యశాఖకు కూడా వెంటనే అప్రమత్తం చేసినట్లు తెలిపారు.
నిత్యావసరాలను తీసుకొచ్చే విమానాలు తప్ప ఇతరత్రా సర్వీసుల విమానాలను రద్దు చేసినట్లు బోరిస్ ప్రకటించటంతో ఇతర దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి. బ్రిటన్ కు వెళ్ళవద్దని ఒకవేళ ఇప్పటికే ఆ దేశంలో ఉండుంటే వెంటనే తిరిగి వచ్చేయాలంటు ఆస్ట్రేలియా, ఇటలీ లాంటి దేశాలు తమ పౌరులకు పిలుపివ్వటంతో వైరస్ తీవ్రత ఏమిటనేది అర్ధమవుతోంది. మరి ఎంతో కష్టపడి బ్రిటన్లోని ఫార్మా కంపెనీ ఫైజర్ ఒకవైపు కరోనా వైరస్ కు యాంటీ వ్యాక్సిన్ తీసుకొచ్చిన నేపధ్యంలోనే వైరస్ రూపు మార్చుకుని మరింత ప్రమాదకరం అవ్వటం ప్రపంచానికి ఆందోళన కలిగించేదనటంలో సందేహం లేదు.
This post was last modified on December 21, 2020 10:53 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…