కరోనా వైరస్ కు యాంటీ వ్యాక్సిన్ వచ్చేస్తోందని ఆనందిస్తున్న వేళ బ్రిటన్లో కొత్త వణుకు మొదలైంది. కరోనా వైరస్సే తన రూపాన్ని మార్చుకుని మరింత ప్రమాదకరంగా విజృంభిస్తోందని బ్రిటన్ శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో బ్రిటన్ ప్రభుత్వం కూడా ముందుజాగ్రత్తగా రెండు వారాల పాటు లాక్ డౌన్ విధించేసింది. అంతేకాకుండా బ్రిటన్ నుండి ఇతర ఐరోపా దేశాలకు విమాన సేవలను రద్దు చేసేసింది. విదేశీయులెవరు తమ దేశంలోకి రావద్దని స్పష్టంగా ప్రకటించటం చూస్తుంటేనే వైరస్ తీవ్రత ఎంతగా వణికించేస్తోందో అర్ధమైపోతోంది.
రూపు మార్చుకున్న కరోనా వైరస్ ను తొలిసారిగా మొన్నటి సెప్టెంబర్ నెలలోనే బ్రిటన్ వైద్య నిపుణులు గుర్తించారు. కరోనా సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఓ రోగికి ట్రీట్మెంట్ ఇస్తున్నపుడు జరిగిన రక్త పరీక్షల్లోనే ఈ వైరస్ ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటి నుండి ఇదే విషయంపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రజ్ఞులు తాజాగా ఇదే విషయాన్ని బయటపెట్టారు.
శాస్త్రజ్ఞుల హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమై ముందుజాగ్రత్తగానే లాక్ డౌన్ విధించటమే కాకుండా విదేశాలతో ప్రమాణ సంబంధాలను కూడా రద్దు చేసింది. బ్రిటన్లో రోగిలో గుర్తించిన ఇటువంటి ప్రమాదకరమైన వైరస్ నే తాజాగా దక్షిణాఫ్రికాలో కూడా మరో రోగిలో బయటపడింది. ఇదే విషయమై బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ తమ దేశంలోని ఓ రోగిలో ప్రమాదకరమైన కరోనా వైరస్ ను గుర్తించినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్యశాఖకు కూడా వెంటనే అప్రమత్తం చేసినట్లు తెలిపారు.
నిత్యావసరాలను తీసుకొచ్చే విమానాలు తప్ప ఇతరత్రా సర్వీసుల విమానాలను రద్దు చేసినట్లు బోరిస్ ప్రకటించటంతో ఇతర దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి. బ్రిటన్ కు వెళ్ళవద్దని ఒకవేళ ఇప్పటికే ఆ దేశంలో ఉండుంటే వెంటనే తిరిగి వచ్చేయాలంటు ఆస్ట్రేలియా, ఇటలీ లాంటి దేశాలు తమ పౌరులకు పిలుపివ్వటంతో వైరస్ తీవ్రత ఏమిటనేది అర్ధమవుతోంది. మరి ఎంతో కష్టపడి బ్రిటన్లోని ఫార్మా కంపెనీ ఫైజర్ ఒకవైపు కరోనా వైరస్ కు యాంటీ వ్యాక్సిన్ తీసుకొచ్చిన నేపధ్యంలోనే వైరస్ రూపు మార్చుకుని మరింత ప్రమాదకరం అవ్వటం ప్రపంచానికి ఆందోళన కలిగించేదనటంలో సందేహం లేదు.
This post was last modified on December 21, 2020 10:53 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…