కరోనా వైరస్ కు యాంటీ వ్యాక్సిన్ వచ్చేస్తోందని ఆనందిస్తున్న వేళ బ్రిటన్లో కొత్త వణుకు మొదలైంది. కరోనా వైరస్సే తన రూపాన్ని మార్చుకుని మరింత ప్రమాదకరంగా విజృంభిస్తోందని బ్రిటన్ శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో బ్రిటన్ ప్రభుత్వం కూడా ముందుజాగ్రత్తగా రెండు వారాల పాటు లాక్ డౌన్ విధించేసింది. అంతేకాకుండా బ్రిటన్ నుండి ఇతర ఐరోపా దేశాలకు విమాన సేవలను రద్దు చేసేసింది. విదేశీయులెవరు తమ దేశంలోకి రావద్దని స్పష్టంగా ప్రకటించటం చూస్తుంటేనే వైరస్ తీవ్రత ఎంతగా వణికించేస్తోందో అర్ధమైపోతోంది.
రూపు మార్చుకున్న కరోనా వైరస్ ను తొలిసారిగా మొన్నటి సెప్టెంబర్ నెలలోనే బ్రిటన్ వైద్య నిపుణులు గుర్తించారు. కరోనా సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఓ రోగికి ట్రీట్మెంట్ ఇస్తున్నపుడు జరిగిన రక్త పరీక్షల్లోనే ఈ వైరస్ ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటి నుండి ఇదే విషయంపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రజ్ఞులు తాజాగా ఇదే విషయాన్ని బయటపెట్టారు.
శాస్త్రజ్ఞుల హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమై ముందుజాగ్రత్తగానే లాక్ డౌన్ విధించటమే కాకుండా విదేశాలతో ప్రమాణ సంబంధాలను కూడా రద్దు చేసింది. బ్రిటన్లో రోగిలో గుర్తించిన ఇటువంటి ప్రమాదకరమైన వైరస్ నే తాజాగా దక్షిణాఫ్రికాలో కూడా మరో రోగిలో బయటపడింది. ఇదే విషయమై బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ తమ దేశంలోని ఓ రోగిలో ప్రమాదకరమైన కరోనా వైరస్ ను గుర్తించినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్యశాఖకు కూడా వెంటనే అప్రమత్తం చేసినట్లు తెలిపారు.
నిత్యావసరాలను తీసుకొచ్చే విమానాలు తప్ప ఇతరత్రా సర్వీసుల విమానాలను రద్దు చేసినట్లు బోరిస్ ప్రకటించటంతో ఇతర దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి. బ్రిటన్ కు వెళ్ళవద్దని ఒకవేళ ఇప్పటికే ఆ దేశంలో ఉండుంటే వెంటనే తిరిగి వచ్చేయాలంటు ఆస్ట్రేలియా, ఇటలీ లాంటి దేశాలు తమ పౌరులకు పిలుపివ్వటంతో వైరస్ తీవ్రత ఏమిటనేది అర్ధమవుతోంది. మరి ఎంతో కష్టపడి బ్రిటన్లోని ఫార్మా కంపెనీ ఫైజర్ ఒకవైపు కరోనా వైరస్ కు యాంటీ వ్యాక్సిన్ తీసుకొచ్చిన నేపధ్యంలోనే వైరస్ రూపు మార్చుకుని మరింత ప్రమాదకరం అవ్వటం ప్రపంచానికి ఆందోళన కలిగించేదనటంలో సందేహం లేదు.
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై…