Political News

బెంగాల్ రాజకీయపార్టీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్

ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో బీజేపీ ఒక్కసారిగా అన్నీ రాజకీయపార్టీలపైనా ఏకకాలంలో సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఊహించని రీతిలో కమలం పార్టీ చేసిన స్ట్రైక్ తో అన్నీ పార్టీలు బిత్తరపోయాయి. మిగిలిన పార్టీల మాటెలాగున్నా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం పెద్ద దెబ్బపడిందనే చెప్పాలి. ఎందుకంటే ముగ్గురు ఎంఎల్ఏలు, ఓ ఎంపితో పాటు పదిమంది కీలక నేతలు పార్టీని వదిలేసి బీజేపీలో చేరిపోయారు.

వచ్చే ఏడాదిలో జరగనున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్నది కమలం పార్టీ నేతల టార్గెట్. వచ్చే ఎన్నికల్లో 200 అసెంబ్లీ సీట్లు గెలుచుకోవాలన్న వ్యూహంతో పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి మమతబెనర్జీని ఒకేసారి అన్నీ వైపుల నుండి దిగ్బంధం చేసే ప్లాన్ తో ముందుకెళుతున్నారు. మొదటగా గవర్నర్ వైపు నుండి పొగ పెట్టడం మొదలుపెట్టారు. తర్వాత తృణమూల్ పార్టీ నేతలను లాగేసుకుంటున్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శాంతిభత్రతలు సృష్టిస్తున్నారు.

ఇవన్నీ చాలావన్నట్లుగా మమతకు బాగా నమ్మకస్తులని ముద్రపడిన అఖిల భారత సర్వీసు అధికారులను కేంద్రానికి వచ్చేయాలంటూ ఒత్తిళ్ళు మొదలుపెట్టారు. నోటీసులిచ్చి మరీ వాళ్ళని సతాయిస్తున్నారు. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బెంగాల్లో రెండు రోజుల పర్యటన పెట్టుకున్నారు. మొదటి రోజైన శనివాం తృణమూల్ తో పాటు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఒక్కో ఎంఎల్ఏను బీజేపీ లాగేసుకుంది.

తృణమూల్ పార్టీని వదిలేసిన నేతలందిరిలోకి సువేందు అధికారి చాలా కీలకమైన వ్యక్తి. ఎందుకంటే జంగల్ మండల్ ప్రాంతంలోని సువేందు కుటుంబానికి సుమారు 40 నియోజకవర్గాల్లో అపారమైన పట్టుంది. ఈయన తండ్రి, సోదరులు ఎంపిలుగా ఉన్నారు. అలాగే వీళ్ళ మద్దతుదారులే చాలామంది ఎంఎల్ఏలుగా ఉన్నారు. ప్రస్తుతానికి వీళ్ళంతా అధికారపార్టీలోనే ఉన్నారు. అయితే ఎప్పుడు పార్టీని వదిలేస్తారో తెలీక మమతకు టెన్షన్ పెరిగిపోతోంది. ఈ కుటుంబం వల్ల ఒకేసారి 40 నియోజకవర్గాల్లో తృణమూల్ పార్టీకి దెబ్బపడటం ఖాయంగా అనిపిస్తోంది.

పశ్చిమబెంగాల్లో అధికారంలోకి రావాలన్నది బీజేపీ దశాబ్దాల కల. కానీ 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, సీపీఎం కారణంగా 27 ఏళ్ళు బీజేపీ కల నెరవేరలేదు. తర్వాతైన అధికారంలోకి వచ్చేస్తామనుకుంటే పదేళ్ళు మమతాబెనర్జీ అడ్డుపడ్డారు. దాంతో ఇపుడు జరిగే ఎన్నికల్లో గనుక అధికారంలోకి రాలేకపోతే భవిష్యత్తులో అవకాశాలు తగ్గిపోతాయన్నది కమలంపార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. పైగా ఇపుడు కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో కూడా బెంగాల్లో అధికారంaలోకి రావటం కష్టమన్న ఆలోచనను కూడా మోడి-షా ధ్వయం తట్టుకోలేకపోతోంది. అందుకనే ఎలాగైనా బెంగాల్లో జెండా పాతాలన్న ఆలోచనతోనే పావులు కదుపుతున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

This post was last modified on December 20, 2020 9:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హాలీవుడ్ రికార్డు బద్దలు కొట్టిన మన లెజెండ్

ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…

33 minutes ago

రిస్కులు చూసుకుంటున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…

2 hours ago

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

5 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

5 hours ago

మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…

5 hours ago

30 రోజుల కౌంట్ డౌన్ మొదలయ్యింది

సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…

6 hours ago