Political News

బెంగాల్ రాజకీయపార్టీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్

ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో బీజేపీ ఒక్కసారిగా అన్నీ రాజకీయపార్టీలపైనా ఏకకాలంలో సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఊహించని రీతిలో కమలం పార్టీ చేసిన స్ట్రైక్ తో అన్నీ పార్టీలు బిత్తరపోయాయి. మిగిలిన పార్టీల మాటెలాగున్నా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం పెద్ద దెబ్బపడిందనే చెప్పాలి. ఎందుకంటే ముగ్గురు ఎంఎల్ఏలు, ఓ ఎంపితో పాటు పదిమంది కీలక నేతలు పార్టీని వదిలేసి బీజేపీలో చేరిపోయారు.

వచ్చే ఏడాదిలో జరగనున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్నది కమలం పార్టీ నేతల టార్గెట్. వచ్చే ఎన్నికల్లో 200 అసెంబ్లీ సీట్లు గెలుచుకోవాలన్న వ్యూహంతో పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి మమతబెనర్జీని ఒకేసారి అన్నీ వైపుల నుండి దిగ్బంధం చేసే ప్లాన్ తో ముందుకెళుతున్నారు. మొదటగా గవర్నర్ వైపు నుండి పొగ పెట్టడం మొదలుపెట్టారు. తర్వాత తృణమూల్ పార్టీ నేతలను లాగేసుకుంటున్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శాంతిభత్రతలు సృష్టిస్తున్నారు.

ఇవన్నీ చాలావన్నట్లుగా మమతకు బాగా నమ్మకస్తులని ముద్రపడిన అఖిల భారత సర్వీసు అధికారులను కేంద్రానికి వచ్చేయాలంటూ ఒత్తిళ్ళు మొదలుపెట్టారు. నోటీసులిచ్చి మరీ వాళ్ళని సతాయిస్తున్నారు. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బెంగాల్లో రెండు రోజుల పర్యటన పెట్టుకున్నారు. మొదటి రోజైన శనివాం తృణమూల్ తో పాటు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఒక్కో ఎంఎల్ఏను బీజేపీ లాగేసుకుంది.

తృణమూల్ పార్టీని వదిలేసిన నేతలందిరిలోకి సువేందు అధికారి చాలా కీలకమైన వ్యక్తి. ఎందుకంటే జంగల్ మండల్ ప్రాంతంలోని సువేందు కుటుంబానికి సుమారు 40 నియోజకవర్గాల్లో అపారమైన పట్టుంది. ఈయన తండ్రి, సోదరులు ఎంపిలుగా ఉన్నారు. అలాగే వీళ్ళ మద్దతుదారులే చాలామంది ఎంఎల్ఏలుగా ఉన్నారు. ప్రస్తుతానికి వీళ్ళంతా అధికారపార్టీలోనే ఉన్నారు. అయితే ఎప్పుడు పార్టీని వదిలేస్తారో తెలీక మమతకు టెన్షన్ పెరిగిపోతోంది. ఈ కుటుంబం వల్ల ఒకేసారి 40 నియోజకవర్గాల్లో తృణమూల్ పార్టీకి దెబ్బపడటం ఖాయంగా అనిపిస్తోంది.

పశ్చిమబెంగాల్లో అధికారంలోకి రావాలన్నది బీజేపీ దశాబ్దాల కల. కానీ 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, సీపీఎం కారణంగా 27 ఏళ్ళు బీజేపీ కల నెరవేరలేదు. తర్వాతైన అధికారంలోకి వచ్చేస్తామనుకుంటే పదేళ్ళు మమతాబెనర్జీ అడ్డుపడ్డారు. దాంతో ఇపుడు జరిగే ఎన్నికల్లో గనుక అధికారంలోకి రాలేకపోతే భవిష్యత్తులో అవకాశాలు తగ్గిపోతాయన్నది కమలంపార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. పైగా ఇపుడు కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో కూడా బెంగాల్లో అధికారంaలోకి రావటం కష్టమన్న ఆలోచనను కూడా మోడి-షా ధ్వయం తట్టుకోలేకపోతోంది. అందుకనే ఎలాగైనా బెంగాల్లో జెండా పాతాలన్న ఆలోచనతోనే పావులు కదుపుతున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

This post was last modified on December 20, 2020 9:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

42 minutes ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

2 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

3 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

4 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

4 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

7 hours ago