సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. చంద్రబాబును దూషించన అంబటిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తల్లిని దూషించిన అంబటిపై మండిపడ్డారు.
అయితే, అంబటి వ్యాఖ్యలను జగన్ సమర్థించడం…రెండు మాటలన్నారు అని వెనకేసుకురావడం టీడీపీ శ్రేణులకు మరింత ఆగ్రహం తెప్పించింది. ఈ క్రమంలోనే శాసన మండలి సమావేశాల సందర్భంగా అంబటి ఇష్యూ, జగన్ కామెంట్స్ పై మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఒక మహిళ గురించి మాట్లాడితే తాము ఎమోషనల్ అవుతామని, ఆఖరికి జగన్ మోహన్ రెడ్డి తల్లి గురించి మాట్లాడినా వారిని కూడా వదిలిపెట్టబోమని లోకేశ్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు.
అంబటి రాంబాబు రెండు చిన్న మాటలు అన్నారని మాజీ సీఎం జగన్ చెప్పారని, ఒకరి తల్లిని అవమానించడం చిన్న మాటా అని లోకేశ్ ప్రశ్నించారు. అటువంటి అంబటి రాంబాబును వైసీపీ నేతలు సమర్థించడం సరికాదని హితవు పలికారు. అంబటి రాంబాబుపై తాము కక్ష సాధిస్తున్నామని చెప్పడం సరికాదన్నారు.
అంబటి క్షమాపణలు అడిగితే…సరిపోతుందా అని లోకేశ్ ప్రశ్నించారు. ఎవరి తల్లయిన.. .చెల్లయినా….అక్కయినా…రాష్ట్రంలో మహిళల జోలికి వెళితే.. ఈ ప్రజా ప్రభుత్వం వదిలిపెట్టదని హెచ్చరించారు. మహిళల భద్రతకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కట్టుబడి ఉన్నారని అన్నారు. ముందు ముందు కూడా చూస్తారని హెచ్చరించారు.
మహిళలను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. సొంత తల్లిని, చెల్లిని గౌరవించే అలవాటు వైసీపీ నేతలకు లేదని, కానీ, ఆ అలవాటు తమకుందని చురకలంటించారు. అది తమ సంస్కృతి అని అన్నారు. వైఎస్ భారతి రెడ్డి గారి గురించి టీడీపీ కార్యకర్త మాట్లాడితే తాము చర్యలు తీసుకున్నామని, అతడు ఇప్పుడు జైల్లో ఉన్నాడని గుర్తు చేశారు.
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…
మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో నిర్వహించిన…
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…