Political News

జగన్ తల్లిని అవమానించినా వదిలిపెట్టం… లోకేష్ వార్నింగ్!

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. చంద్రబాబును దూషించన అంబటిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తల్లిని దూషించిన అంబటిపై మండిపడ్డారు.

అయితే, అంబటి వ్యాఖ్యలను జగన్ సమర్థించడం…రెండు మాటలన్నారు అని వెనకేసుకురావడం టీడీపీ శ్రేణులకు మరింత ఆగ్రహం తెప్పించింది. ఈ క్రమంలోనే శాసన మండలి సమావేశాల సందర్భంగా అంబటి ఇష్యూ, జగన్ కామెంట్స్ పై మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఒక మహిళ గురించి మాట్లాడితే తాము ఎమోషనల్ అవుతామని, ఆఖరికి జగన్ మోహన్ రెడ్డి తల్లి గురించి మాట్లాడినా వారిని కూడా వదిలిపెట్టబోమని లోకేశ్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు.

అంబటి రాంబాబు రెండు చిన్న మాటలు అన్నారని మాజీ సీఎం జగన్ చెప్పారని, ఒకరి తల్లిని అవమానించడం చిన్న మాటా అని లోకేశ్ ప్రశ్నించారు. అటువంటి అంబటి రాంబాబును వైసీపీ నేతలు సమర్థించడం సరికాదని హితవు పలికారు. అంబటి రాంబాబుపై తాము కక్ష సాధిస్తున్నామని చెప్పడం సరికాదన్నారు.

అంబటి క్షమాపణలు అడిగితే…సరిపోతుందా అని లోకేశ్ ప్రశ్నించారు. ఎవరి తల్లయిన.. .చెల్లయినా….అక్కయినా…రాష్ట్రంలో మహిళల జోలికి వెళితే.. ఈ ప్రజా ప్రభుత్వం వదిలిపెట్టదని హెచ్చరించారు. మహిళల భద్రతకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కట్టుబడి ఉన్నారని అన్నారు. ముందు ముందు కూడా చూస్తారని హెచ్చరించారు.

మహిళలను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. సొంత తల్లిని, చెల్లిని గౌరవించే అలవాటు వైసీపీ నేతలకు లేదని, కానీ, ఆ అలవాటు తమకుందని చురకలంటించారు. అది తమ సంస్కృతి అని అన్నారు. వైఎస్ భారతి రెడ్డి గారి గురించి టీడీపీ కార్యకర్త మాట్లాడితే తాము చర్యలు తీసుకున్నామని, అతడు ఇప్పుడు జైల్లో ఉన్నాడని గుర్తు చేశారు.

This post was last modified on February 13, 2026 10:50 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Lokesh

Recent Posts

సెంటిమెంట్ ఫాలో కానున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న జైలర్ 2 షూటింగ్ పూర్తి కావొస్తోంది.…

11 minutes ago

300 రూపాయలకు కొని 634 కోట్లకు అమ్మేశాడు

అదృష్టం ఎప్పుడు ఎలా వరిస్తుందో అసలే అర్థం కాదు. ఎలాంటి ఆలోచన లేకుండా.. కేవలం సరదాగా కొన్న ఒక డొమైన్…

1 hour ago

విజయోత్సాహంలో రేవంత్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. 116 మున్సిపాలిటీలకు గాను 64 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం…

1 hour ago

వికెట్ల వెనుక నుంచి బంతి విసరవచ్చా?

టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్, నమీబియా మధ్య జరిగిన మ్యాచ్‌ ఒక ఆసక్తికర చర్చకు దారితీసింది. నమీబియా…

4 hours ago

బీజేపీకి మరింత దగ్గరవుతున్న సాయిరెడ్డి!

వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని కొద్ది నెలల క్రితం ప్రకటించిన…

5 hours ago

సాగర సంగమం తీయలేదు నిజమే కానీ

నిర్మాత నాగవంశీకి మరోసారి అసహనం కలిగింది. ఇవాళ విడుదలైన ఫంకీ స్పందన గురించి మాట్లాడుతూ ఏదో ట్విట్టర్ సైంటిస్టుల్లా ఇందులో…

5 hours ago