Political News

ట్రస్టు భవన్ కు చేరిన విజయనగరం పంచాయితి

మొత్తానికి చిలికి చిలికి గానవానలాగ తయారైన విజయనగరం టీడీపీ పంచాయితి తాజాగా మంగళగరిలోని తెలుగుదేశంపార్టీ సెంట్రల్ ఆఫీసు ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ కు చేరుకుంది. జిల్లాలో మొదటినుండి అంటే దశాబ్దాల తరబడి అశోక్ గజపతిరాజుదే ఆధిపత్యం. జిల్లా అధ్యక్షుడిగా ఎవరున్నా, ఎంపి, ఎంఎల్ఏలు ఎంతమందున్నా అశోక్ చెప్పింది ఫైనల్. ఒకపుడు ఎన్టీయార్ అయినా తర్వాత చంద్రబాబునాయుడు అయినా విజయనగరం జిల్లా వ్యవహరాల్లో జోక్యం చేసుకునే వారుకాదు.

ఈ కారణంగా జిల్లాలో గొడవలు ముదిరి పాకానపడ్డాయి. ఎప్పుడైతే అశోక్ గజపతిరాజు చెప్పిందే వేదంగా జిల్లాలో నడుస్తోందో ఇంకో నేతెవరు ఎదగడానికి అవకాశం లేకుండా పోయింది. అందుకనే మొన్నటి ఎన్నికల్లో జిల్లాలోని ఎంపి సీటుతో పాటు మొత్తం తొమ్మిది అసెంబ్లీల్లోను తెలుగుదేశంపార్టీ చిత్తుగా ఓడిపోయింది. అశోక్ మీదున్న కోపంతోనే టీడీపీలోని చాలామంది వైసీపీకి సహకరించారనే టాక్ కూడా నడుస్తోంది. అశోక్ ఆధిపత్యం ఎంతలా ఉందంటే జిల్లాలో పార్టీ కార్యాలయం కూడా ప్రత్యేకంగా లేదు.

పార్టీ మీటింగులు పెట్టాలంటే అశోక్ బంగ్లాలోని తోటలోనే చెట్లక్రింద పెట్టుకోవాలట. పార్టీకి ప్రత్యేకంగా వేరే కార్యాలయం ఏర్పాటును కూడా రాజుగారు ఇన్ని సంవత్సరాలనుండి ఒప్పుకోలేదట. ఇటువంటి పరిస్ధితుల్లో మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా రాజుగారు పార్టీ నేతల విషయంలో తన వైఖరి మార్చుకోలేదు. దాంతో అశోక్ అంటే పడని చాలామంది సీనియర్లు విజయనగరం మాజీ ఎంఎల్ఏ మీసాల గీతను ముందుపెట్టి కొత్తగా కార్యాలయాన్ని ఏర్పాటు చేయించారు.

ఈ విషయంలో అశోక్ అడ్డుకునే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదట. అందుకనే వెంటనే రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి రాజుగారు ఫిర్యాదు చేశారట. అయినా ఉపయోగం కనబడలేదు. దాంతో విషయం చంద్రబాబుతోనే తేల్చుకోవాలని తన మద్దతుదారులను తీసుకుని అశోక్ ట్రస్టు భవన్ కు చేరుకున్నారు. విషయం తెలియటంతో గీత నేతృత్వంలోని ప్రత్యర్ధివర్గం కూడా ట్రస్టుభవన్ కు బయలుదేరిందట. మరి ఈ పంచాయితీని చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారో చూడాల్సిందే.

This post was last modified on December 17, 2020 12:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago