Political News

ఆలయాలపై జగన్ కు సోము వీర్రాజు బహిరంగ సవాల్

కొద్ది రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదిలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని చారిత్రక రథం దగ్ధం ఘటన ఏపీతో పాటు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనకు నిరసనగా అంతర్వేది ఆలయాన్ని సందర్శించేందుకు సిద్ధమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పలువురు బీజేపీ, జనసేన నేతలను పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా హౌస్‌ అరెస్ట్‌ చేయడం నాడు రాజకీయ దుమారం రేపింది. దీంతో, వైసీపీ సర్కార్ పై కేంద్రం కూడా కాస్త ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ కేసు విచారణను సీబీఐకి అప్పగించారు సీఎం జగన్.

ఆ తర్వాత, తిరుపతిలో జగన్ డిక్లరేషన్ వ్యవహారం కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారాలు వైసీపీ సర్కార్ ను ఇరుకున పెట్టాయి. వైసీపీ సర్కార్ హిందువుల మనోభావాలను గౌరవించడం లేదని బీజేపీ సహా విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ వ్యవహారాలు సద్దుమణిగాయనుకుంటున్న నేపథ్యంలో తాజాగా మరోసారి జగన్ పై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ కు హిందూ సంప్రదాయాలపై గౌరవం, నమ్మకం లేవని సోము వీర్రాజు షాకింగ్ కామెంట్లు చేశారు. విజయవాడలో చంద్రబాబు హయాంలో కూలగొట్టిన 27 ఆలయాలను నిర్మించాలని ప్రకాశం బ్యారేజి వద్ద బీజేపీ నేతలతో సోము ధర్నా చేశారు.

చర్చిలకు రూ. 24 కోట్లు, దర్గాలకు రూ. 5 కోట్లు కేటాయించిన జగన్ పై సోము ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ధనాన్ని చర్చిల నిర్మాణానికి ఎలా ఇస్తారని సోము ప్రశ్నించారు. ఏపీలో దేవాదాయశాఖ తీరు ఆందోళనకరంగా ఉందన్న సోము వీర్రాజు…ఏపీలో శిథిలావస్థలో ఉన్న పలు ఆలయాలను ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు. పుష్కరాల పేరుతో ఆనాడు చంద్రబాబు అనేక ఆలయాలను పడగొట్టారని, వాటికి ఆయన కూడా సమాధానం చెప్పాలన్నారు.

ఆ ఆలయాలను పునర్నిర్మించాలని నాటి బీజేపీ నేత, నేటి దేవాదయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారని సోము వీర్రాజు గుర్తు చేశారు. కానీ, ఇపుడు వెల్లంపల్లి… దర్గాలను కడతామని చెబుతున్నారని, దేవాలయాల భూములను ఇళ్ల స్థలాలకు, ఆలయాల నిధులను ఇతర కార్యక్రమాలకు వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలను వెల్లంపల్లి నిర్వీర్యం చేస్తున్నారని, తన పదవికి వెల్లంపల్లి తక్షణమే రాజీనామా చేయాలని సోము డిమాండ్ చేశారు. ఏపీలోని చర్చిలకు వేల కోట్ల ఆదాయాలున్నాయని, జగన్ కు దమ్ముంటే చర్చిల డబ్బులను ఖర్చు చేయాలని సోము వీర్రాజు సవాల్ విసిరారు. జగన్ కు చర్చిలు, దర్గాలు మాత్రమే కావాలా? ఆలయాలు అవసరం లేదా? అని సోము ప్రశ్నించారు. రేపు అమరావతిలో జరిగే బహిరంగసభకు బీజేపీ మద్దతిస్తోందని, బీజేపీ ప్రతినిధులు అందులో పాల్గొంటారని వెల్లడించారు.

This post was last modified on December 16, 2020 4:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago