Political News

అమిత్ షా ముందు జగన్ కీలక ప్రతిపాదనలు

అధికార వికేంద్రీకరణ కోసం మూడు రాజధానుల ప్రతిపాదనలకు మద్దతివ్వాలంటూ జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తో దాదాపు గంటపాటు భేటీ అయిన జగన్ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇందుకు అనుగుణంగా నోటిఫికేషన్ జారీచేయాలని విజ్ఞప్తి చేయటం గమనార్హం. ఎందుకంటే ఇప్పటివరకు మూడు రాజధానుల ప్రతిపాదన అన్నది రాష్ట్రపరిధిలోనే నలుగుతోంది. ప్రభుత్వ ప్రతిపాదనకు అనుకూలంగా వ్యతిరేకంగా రాజకీయపార్టీల్లోను, న్యాయస్ధానాల్లోను అనేక వివాదాలు రేగుతున్న విషయం తెలిసిందే.

మొదటిసారిగా మూడు రాజధానులకు మద్దతు ఇవ్వాలంటూ జగన్ కేంద్రాన్ని కోరారు. ఇందులో భాగంగానే హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు రీ లొకేషన్ను ఆమోదిస్తు నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. మూడు రాజధానుల ఏర్పాటు అవసరం ఏమిటి ? శాసనరాజధానిగా అమరావతి, పరిపాలనా రాజధానిగా వైజాగ్ ను ఎందుకు నిర్ణయించామనే విషయాలను జగన్ కేంద్ర హోంశాఖ మంత్రికి వివరించారు. కాబట్టి తమ ప్రతిపాదనలకు మద్దతివ్వాలని కోరటం ఇదే మొదటిసారి.

ఇదే సమయంలో రాష్ట్ర రాజధాని విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదంటు గతంలోనే కేంద్రం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లను కూడా జగన్ ప్రస్తావించారట. కాబట్టి తమ ప్రతిపాదనలకు వీలైనంత తొందరగా ఆమోదముద్ర వేయాలని జగన్ అమిత్ ను కోరినట్లు సమాచారం. బీజేపీ మ్యానిఫెస్టోలో కూడా పేర్కొన్నట్టు… హైకోర్టు నోటిఫికేషన్ ఇస్తే కర్నూలుకు హైకోర్టు తరలింపు ఏర్పాట్లు వెంటనే ప్రారంభిస్తామని కూడా జగన్ చెప్పారట.

పనిలోపనిగా పోలవరంపై సవరించిన రూ 55,656 కోట్ల అంచనాలను ఆమోదించమని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు చెప్పాలని, రాష్ట్రానికి రావాల్సిన సుమారు రూ. 15 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. టైం డిలే అయ్యేకొద్దీ పోలవరం అంచనాలు పెరిగిపోతాయన్న విషయాన్ని జగన్ వివరించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని, కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు కేంద్రమార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర సిద్దంగా ఉన్నట్లు కూడా జగన్ చెప్పారు. మొత్తంమీద అమిత్ తో భేటి సందర్భంగా జగన్ కీలకమైన ప్రతిపాదనలే పెట్టినట్లు అర్ధమవుతోంది.

This post was last modified on December 16, 2020 10:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

41 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago