Political News

త్వరలో కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం: బండి సంజయ్

దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయంతో టీఆర్ఎస్ కు తొలి షాక్ తగిలిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బీజేపీ గట్టిపోటీ ఇచ్చింది. దుబ్బాక గెలుపు…ఆ తర్వాత బల్దియా బరిలో అధికార పార్టీకి ఆధిపత్యానికి గండికొట్టడంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఎంపీ బండి సంజయ్ పగ్గాలు చేపట్టిన తర్వాత బీజేపీ కేడర్ లో ఉత్సాహం వచ్చింది. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ లపై బండి సంజయ్ విమర్శనాస్త్రాలు సంధిస్తూ….దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

గ్రేటర్ వార్ లో బీజేపీ అద్భుత ఫలితాలు సాధించిన జోష్ లో ఉన్న సంజయ్… తాజాగా సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమని సంజయ్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న బండి సంజయ్….కేసీఆర్ పై మరోసారి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కోతల రాయుడని, బల్దియాలో ఓటమి తర్వాత ఢిల్లీకి వెళ్తారని తాను ముందే చెప్పానని అన్నారు. ఢిల్లీలో వంగివంగి దండాలు పెట్టినంత మాత్రాన క్షమించబోమని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు.

బల్దియా ఎన్నికల్లో పరాజయం పాలైన కేసీఆర్…ప్రజల దృష్టి మరల్చేందుకే ఢిల్లీకి వెళ్లారని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ బయటకు చెప్పేదొకటి…లోపల జరిగేది మరొకటని సంజయ్ సెటైర్లు వేశారు. హైదరాబాద్ వరదల్లో చిక్కుకున్నపుడు కేసీఆర్ ఫాం హౌస్ గడప దాటలేదని, ఇపుడు వరద సాయం కోసం ఢిల్లీలో వంగి వంగి పొర్లు దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం మూడో టీఎంసీ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని, అడ్డగోలుగా ప్రాజెక్టు వ్యయం పెంచారని మండిపడ్డారు. కాళేశ్వరానికి అతి తక్కువ సమయంలోనే కేంద్రం అనుమతులిచ్చిందని అన్నారు. మా రాష్ట్రం.. మా నిధులంటూ కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను పెంచడంపై ప్రశ్నించిన వారి గొంతును నొక్కారని…ఈ రాష్ట్రం మీ అయ్య జాగీరా? అని బండి సంజయ్ దుయ్యబట్టారు.

కాగా, కేసీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ విమర్శలు గుప్పించారు. బీజేపీతో ఢిల్లీలో దోస్తీ..గల్లీలో కుస్తీ అన్నట్టు టీఆర్‌ఎస్‌, బీజేపీ వైఖరి ఉందని ఠాగూర్ ఎద్దేవా చేశారు. కేసులకు భయపడి కేసీఆర్ బీజేపీని శరణుకోరారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ కుటుంబంపై మరో 6 నెలల పాటు ఐటీ, ఈడీ దాడులు ఉండవని షాకింగ్ కామెంట్లు చేశారు.

This post was last modified on December 14, 2020 8:09 pm

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

2 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

3 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

3 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

3 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

4 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

6 hours ago