Political News

త‌మ్ముళ్లూ.. ఇది త‌గునా?

ఔను! టీడీపీ నేత‌ల వ్య‌వ‌హారం గురించి.. ఆ పార్టీకి ఎంతో ఇష్ట‌మైన‌.. ఆ పార్టీ నేత‌లు నిత్యం ఫాలో అయ్యే సోష‌ల్ మీడియాలోనే ఇలా కామెంట్లు కుప్ప‌లు తెప్ప‌లుగా కురుస్తున్నాయి. త‌మ్ముళ్లూ.. ఇది త‌గునా?! అంటూ.. ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురుస్తోంది. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అంటే.. టీడీపీలో అనేక మంది సీనియ‌ర్ నాయ‌కులు ఉన్నారు. పార్టీ ప్రారంభం నుంచి ఉన్న‌వారు.. మ‌ధ్య‌లో వ‌చ్చిన వారు.. ఇలా చాలా మ‌ది ఉన్నారు. వీరిలో ఎంతో మంది ప‌దవులు అనుభ‌వించారు. పార్టీ త‌ర‌ఫున అధికారం చ‌లాయించారు. ఈ విష‌యంలో త‌ప్పులేదు. పార్టీ వారికి అవకాశం ఇచ్చింది. వారు ప‌ద‌వులు చేప‌ట్టారు.

అయితే.. పార్టీ అంటే.. కేవ‌లం ప‌ద‌వులు అనుభ‌వించ‌డం వ‌ర‌కే ప‌రిమిత‌మా? మ‌రిఆ పార్టీకి ఏమీ చేయా ల్సిన అవ‌స‌రం లేదా? అనేది కీల‌క ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం.. పార్టీ తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిస్థితిలో ఉంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. పార్టీ ఎప్పుడెప్పుడు పుంజుకుంటుందా.. గ్రాఫ్ ఎప్పుడు పెరుగుతుందా ? అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు వెయ్యిక‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో పార్టీని ప్ర‌జ‌ల‌కు చేరువ చేసేందుకు వివిధ రూపాల్లో ఆయ‌న హైద‌రాబాద్‌లో ఉన్నా.. ఎక్క‌డ ఉన్నా.. ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. మ‌రి గ‌తంలో ప‌ద‌వులు అనుభ‌వించిన వారు ఏం చేస్తున్నారు? 70ఏళ్లు నిండి కూడా ఇంకా చంద్ర‌బాబే చిన్న చిన్న విష‌యాలు కూడా చూసుకోవాలా? అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పేవారు క‌రువ‌య్యారు.

ఇక్క‌డ చిత్ర‌మైన విష‌యం ఏంటంటే.. పార్టీలో ప‌ద‌వులు అనుభ‌వించిన వారు.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఓడిన త‌ర్వాత‌.. పార్టీకి దూరంగా ఉంటున్నారు. స‌రే! ఏదో ఓట‌మి ప‌రాభ‌వం నుంచి ఇంకా తేరుకోలేదులే అని స‌రిపెట్టుకోవ‌చ్చు. కానీ, త‌మ అవ‌స‌రం వ‌చ్చేసరికి లేదా.. త‌మ వ్యాపారాల‌కు ఇబ్బందులు ఏర్ప‌డుతున్నాయ‌ని అనుకునే స‌రికి మాత్రంగంట‌ల త‌ర‌బ‌డి మీడియా మీటింగులు పెడుతున్నారు. జ‌గ‌న్ స‌ర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. మ‌రి పార్టీ కోసం ఏనాడైనా.. ఈ ఏడాదిన్న‌ర కాలంలో ఒక్క‌రైనా బ‌య‌టకు వ‌చ్చారా? అంటే ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

ఉదాహ‌ర‌ణ‌కు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర‌, అనంత‌కు చెందిన జేసీ కుటుంబం, ప‌రిటాల ఫ్యామిలీ.. అంతా కూడా త‌మ‌కు నొప్పి క‌లిగితే.. మీడియా ముందుకు వ‌చ్చారు త‌ప్ప‌.. పార్టీ కోసం మైకు ప‌ట్టిన ప‌రిస్థితి ఈ ఏడాదిన్నర కాలంలో ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డాన్నే .. సోష‌ల్ మీడియాజ‌నాలు ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌జ‌లే కాదు.. పార్టీల‌ను కూడా వాడుకునే వ‌దిలేసే టైపేనా? అని ఘాటుగానే వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా త‌మ్ముళ్లు మార‌తారో లేదో చూడాలి.

This post was last modified on December 13, 2020 2:41 pm

Share

Recent Posts

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

2 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

2 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

2 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

3 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

3 hours ago

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…

4 hours ago