ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీలకు అతీతీంగా నాయకులు.. స్పందించారు. జగన్ వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్.. ఇప్పుడు కూడా అదే వైఖరితో ఉన్నారంటూ.. టీడీపీ నాయకులు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు విమర్శలు గుప్పించారు. జగన్ వైఖరికి నిరసనగా.. శుక్రవారం రాజధాని ప్రాంతంలోనూ నిరసనలు చేపట్టనున్నారు.
జగన్ ఏమన్నారు?
వైసీపీ అధినేత జగన్.. గురువారం కొన్ని జాతీయ మీడియా ఛానెళ్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధానిపై ఆయన మరోసారి విమర్శలు గుప్పించారు. “నదీతీరం వెంబడి సోకాల్డ్ రాజధానిని కడుతున్నాడు“ అంటూ.. సీఎం చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. “రివర్ బేసిన్లో చంద్రబాబు సోకాల్డ్ రాజధాని కడుతున్నాడు. అయినా.. అంత భూమి ఎందుకు? ఇంత మంది రైతులను ఇబ్బంది పెట్టడం ఎందుకు?“ అని జగన్ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు ఇటు రాజధాని రైతుల్లోనూ.. అటు వైసీపీయేతర రాజకీయ నాయకుల్లోనూ దుమారం రేపాయి. జగన్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి జగన్ వైఖరి మారలేదని.. నాయకులు విరుచుకుపడ్డారు. వాస్తవానికి ప్రస్తుతం రాజధాని వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. నిర్మాణాన్ని విస్తరించడంతోపాటు.. విమానాశ్రయం.. వంటి తొలిదశలో లేని ప్రాజెక్టులను కూడా ఈ సారి చేర్చింది. దీంతో రెండో దశ భూ సమీకరణ కూడా జరుగుతోంది.
ఇలాంటి సమయంలో ఉద్దేశ పూర్వకంగా జగన్ వ్యాఖ్యలు చేయడాన్ని నాయకులు, రాజధాని రైతులు కూడా తప్పుబట్టారు. జగన్ పై తీవ్రస్థాయి విమర్శలు వచ్చాయి. రాజధాని నిర్మాణాన్ని నదీ వడ్డున నిర్మిస్తున్నారని.. జగన్ గతంలోనూ చెప్పారు. కానీ, ప్రజలు, కేంద్రంలోని హరిత ట్రైబ్యునల్ కూడా యాక్సప్ట్ చేసినప్పుడు.. జగన్కు వచ్చిన సందేహం ఏంటి? వివాదం ఏంటి? అనేది ప్రశ్న. మొత్తంగా.. మరోసారి జగన్ చేసిన వ్యాఖ్యలు.. రాజధానిపై ఆయన నైజాన్ని చాటుతున్నాయని పలువురు వ్యాఖ్యానించారు.
This post was last modified on January 9, 2026 9:36 am
మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…
సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…