ఒకరు అధికార పార్టీకి చెందిన ఎంపీ. మరొకరు విపక్ష పార్టీ నేత. ఇరువురి మధ్య మొదలైన మాటల యుద్దం అనంతపురం జిల్లాలో హాట్ హాట్ గా మారటమే కాదు.. మంట పుట్టిస్తోంది. చలికాలంలో వేడెక్కిపోయేలా ఉన్న ఈ మాటలు ఎక్కడి వరకు తీసుకెళతాయో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అనంత జిల్లాలోని యూత్ రాజకీయాలు ఇప్పుడు మరో స్థాయికి వెళ్లటం గమనార్హం. ఇంతకీ.. ఈ మాటల యుద్ధం అసలెలా మొదలైంది? ఇప్పటివరకు ఎక్కడివరకు వచ్చిందన్న విషయాల్లోకి వెళితే..
తాజాగా అనంతపురంలో వర్చువల్ పద్దతిలో రిజర్వాయర్లకు శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం చేశారో చెప్పే క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఘాటు విమర్శలు చేశారు. గతంలో జరిగిన అంశాల్ని వర్తమానంలో ప్రస్తావించిన వైనం రాజకీయ అలజడికి కారణమైంది. సీమలో పొలాలకు నీరు లేక.. నెర్రలు కొట్టి.. పైరుచస్తుంటే.. పరిటాల రవి నక్సలిజం.. ఫ్యాక్షనిజం పేరుతో ప్రజల తలలు నరికి రక్తపుటేర్లు పారించారంటూ గోరంట్ల వ్యాఖ్యలు చేశారు.
దీంతో.. పరిటాల రవి తనయకుడు పరిటాల శ్రీరామ్ స్పందించారు. ఎంపీ మాటలకు ఘాటుగా రియాక్టు అయ్యారు. అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ‘‘నీ మీద ఉన్న రేప్.. మర్డర్ కేసుల్ని మొదట చూసుకో. తర్వాత మా గురించి మాట్లాడు. మేం గల్లీ ఫ్యాక్షన్ అయితే.. నీవు ఢిల్లీ సథాయి రేపిస్ట్ అయ్యావు’ అంటూ ఘాటుగా స్పందించారు. పరిటాల హయంలో ఎస్ఐగా ఉన్న గోరంట్ల ఏం చేశావని ప్రశ్నించిన శ్రీరామ్.. ‘ఇప్పుడు మీ టైం నడుస్తోంది. భవిష్యత్తులో మా టైం వస్తుంది’ అన్న మాటలు సంచలనంగా మారాయి.
టీడీపీ హయాంలో చేసిన పనుల్ని తమ ప్రభుత్వంలో చేసినట్లుగా చెబుతున్నారన్న పరిటాల శ్రీరామ్.. కొత్త పనులకు టెండర్లు ఎందుకు పిలవటం లేదు? అని ప్రశ్నించారు. పుట్టకనుమ ప్రాజెక్టును ఆపి.. కొత్తవి చేయటం సరికాదని.. ప్రాజెక్టుపేరు మార్చటం ఏమిటని నిలదీశారు. పుట్టకనుమ ప్రాజెక్టును రద్దు చేసి.. మూడు కడతామని అంటున్నారని.. ఎందుకు టెండర్ పిలవటం లేదని ప్రశ్నించారు. అధికార.. విపక్ష నేతల మధ్య నడుస్తున్న మాటలు తూటాల మాదిరి మారి.. రాజకీయ హీట్ ను పెంచేస్తున్నాయని చెప్పక తప్పదు.
This post was last modified on December 12, 2020 12:55 pm
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…