ఫిబ్రవరి 1 నుంచి ఒక్క సిగరెట్ ధర రూ.72కు పెరుగుతుందన్న వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రస్తుతం రూ.15 నుంచి రూ.20 మధ్య ఉన్న సిగరెట్ ధర ఒక్కసారిగా నాలుగు రెట్లు పెరుగుతుందన్న ప్రచారం ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోంది. అయితే ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
కేంద్ర ప్రభుత్వం 2026 ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులపై కొత్త పన్ను నిర్మాణాన్ని అమలు చేయనుంది. సిగరెట్లపై 40 శాతం జీఎస్టీతో పాటు అదనపు ఎక్సైజ్ డ్యూటీ విధించనున్నారు. అలాగే బీడీలపై 18 శాతం జీఎస్టీతో పాటు ఆరోగ్య సెస్, జాతీయ భద్రత సెస్, అదనపు ఎక్సైజ్ ట్యాక్స్ వర్తించనుంది. ఈ పన్నుల ప్రభావంతో పొగాకు ఉత్పత్తుల ధరలు పెరగనున్నట్టు స్పష్టమవుతోంది.
అయితే, ఒక్క సిగరెట్ ధరను ఖచ్చితంగా రూ.72గా ప్రభుత్వం నిర్ణయించిందన్నది నిజం కాదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఏ అధికారిక ప్రకటనలోనూ ఒక్క సిగరెట్ ధర రూ.72గా నిర్ధారించలేదు. కొంతమంది విశ్లేషకులు, వార్తా సంస్థలు పన్నుల భారాన్ని పూర్తిగా వినియోగదారులపై మోపితే ధరలు ఆ స్థాయికి చేరవచ్చని అంచనా వేయడమే ఈ ప్రచారానికి కారణంగా తెలుస్తోంది.
ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, రూ.72 అనే ధర ఇప్పటివరకు అంచనామాత్రమే. వాస్తవ ధరలు ఎంత పెరుగుతాయన్నది ఆయా సిగరెట్ కంపెనీలు విడుదల చేసే అధికారిక ధరల జాబితాలపై ఆధారపడి ఉండనుంది.
This post was last modified on January 1, 2026 9:08 pm
ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…
అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…