Political News

ఏపీలో ఇకపై టికెట్ రేట్లు అలా పెంచరు

టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు ముందు టికెట్ రేట్లు పెంచడం ఆనవాయితీగా వస్తోంది. ఆయా చిత్రాల నిర్మాతలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడం, వారం లేదా పది రోజులపాటు స్పెషల్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వాలు ఆమోద ముద్ర వేయడం పరిపాటి. అయితే, ఈ రకంగా సినిమా టికెట్ల రేట్లు పెంచడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.

ఇటీవల అఖండ-2 చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచినా సరే కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే అటువంటివి జరగకుండా ఏపీలో సినిమా టికెట్ రేట్ల పెంపు కోసం సరికొత్త విధానాన్ని రూపొందించబోతున్నామని ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

ప్రతిసారి సినిమా బడ్జెట్ ప్రకారం టికెట్ రేట్లు పెంచుతున్నామని ఆయన అన్నారు. కానీ, ఇకనుంచి ఇందుకోసం ఒక నిర్దిష్టమైన విధానాన్ని రూపొందించబోతున్నామని చెప్పారు. సినిమా టికెట్ల రేట్లపై నూతన విధానం కోసం ఏర్పాటైన కమిటీతో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా పలు అంశాలపై సంబంధిత అధికారులతో దుర్గేష్ చర్చించారు. ఆల్రెడీ అమల్లో ఉన్న జీవోతోపాటు సినిమా బడ్జెట్ ప్రకారం సినిమా టికెట్ రేట్లు పెంచుకుంటూ వస్తున్నామని, భవిష్యత్తులో ఒక నూతన విధానాన్ని రూపొందించాలని నిర్ణయించామని చెప్పారు.

కేటగిరీల ప్రకారం సమానంగా టికెట్ రేట్లు పెంచే విధానాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే, లో బడ్జెట్, హై బడ్జెట్ చిత్రాల టికెట్ రేట్లు ఎంత పెంచాలి అనే విషయంపై కమిటీ చర్చించి సరైన తీసుకుంటుందని తెలిపారు. అంతేకాదు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల అభిప్రాయాలను, సలహాలను కూడా పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం వెల్లడిస్తామని చెప్పారు. ఇటు, నిర్మాతలకు, అటు ప్రేక్షకులకు భారం కాకుండా సినీ పరిశ్రమకు, ప్రజలకు మేలు కలిగేలా నూతన విధానాన్ని రూపొందిస్తామన్నారు.

ఐ బొమ్మ రవి అరెస్ట్ నేపథ్యంలో సినిమా టికెట్ల పెంపు వ్యవహారంపై తీవ్ర స్థాయిలో ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ చిత్రాలకు ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతినిచ్చినా కొందరు సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు కోర్టులను ఆశ్రయించడంతో చివరి నిమిషంలో చిత్ర బృందానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే పాత విధానాలకు స్వస్తి పలికి సరికొత్త విధానాన్ని రూపొందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

Kumar

Recent Posts

అంచనాల ఒత్తిడిని ‘రామాయణ’ తట్టుకుంటుందా

ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…

2 hours ago

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

3 hours ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

4 hours ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

6 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

6 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

8 hours ago