ఢిల్లీ కాలుష్యం గురించి రోజూ ఏదో ఒక వార్త వింటూనే ఉంటాం. సామాన్యులే కాదు, ఇప్పుడు కేంద్ర మంత్రులు కూడా దీని బారిన పడుతున్నారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీ పొల్యూషన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఢిల్లీలో కేవలం మూడు రోజులు ఉన్నా సరే, ఈ కాలుష్యం వల్ల తనకు అలర్జీలు వస్తున్నాయని ఆయన వాపోయారు. ఒక బుక్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాలను బయటపెట్టారు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కాలుష్యానికి ప్రధాన కారణం తన శాఖే అని ఆయన ఒప్పుకోవడం. ఢిల్లీలో 40 శాతం కాలుష్యం కేవలం వాహనాల వల్లే జరుగుతోందని, రవాణా శాఖ మంత్రిగా ఈ విషయం చెప్పడానికి తాను వెనకాడటం లేదని అన్నారు. ఫాసిల్ ఫ్యూయల్స్ పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించకపోతే దేశానికి నష్టమని అని సూటిగా తెలియజేశారు.
మనం ఏటా పెట్రోల్, డీజిల్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నాం. అందుకే ఎలక్ట్రిక్ వెహికల్స్, హైడ్రోజన్ వాహనాల వైపు మళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని గడ్కరీ నొక్కి చెప్పారు. ఆయన స్వయంగా ఇథనాల్ తో నడిచే ఎకో-ఫ్రెండ్లీ కారును వాడుతున్నట్లు గుర్తుచేశారు.
ప్రస్తుతం ఢిల్లీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గాలి నాణ్యత సూచీ AQI 412 దాటడంతో ‘సివియర్’ కేటగిరీలోకి వెళ్లిపోయింది. నోయిడాలో అయితే ఏకంగా 426 పాయింట్లు నమోదైంది. గడ్కరీ ఇలా మాట్లాడటం కొత్తేమీ కాదు, గతంలో కూడా ఢిల్లీ రావాలంటేనే భయమేస్తోందని, ఇక్కడి కాలుష్యం అంత భయంకరంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…