Political News

ఢిల్లీలో మూడు రోజులు… కేంద్ర మంత్రికి ఎలర్జీలు

ఢిల్లీ కాలుష్యం గురించి రోజూ ఏదో ఒక వార్త వింటూనే ఉంటాం. సామాన్యులే కాదు, ఇప్పుడు కేంద్ర మంత్రులు కూడా దీని బారిన పడుతున్నారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీ పొల్యూషన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఢిల్లీలో కేవలం మూడు రోజులు ఉన్నా సరే, ఈ కాలుష్యం వల్ల తనకు అలర్జీలు వస్తున్నాయని ఆయన వాపోయారు. ఒక బుక్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాలను బయటపెట్టారు.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కాలుష్యానికి ప్రధాన కారణం తన శాఖే అని ఆయన ఒప్పుకోవడం. ఢిల్లీలో 40 శాతం కాలుష్యం కేవలం వాహనాల వల్లే జరుగుతోందని, రవాణా శాఖ మంత్రిగా ఈ విషయం చెప్పడానికి తాను వెనకాడటం లేదని అన్నారు. ఫాసిల్ ఫ్యూయల్స్ పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించకపోతే దేశానికి నష్టమని అని సూటిగా తెలియజేశారు.

మనం ఏటా పెట్రోల్, డీజిల్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నాం. అందుకే ఎలక్ట్రిక్ వెహికల్స్, హైడ్రోజన్ వాహనాల వైపు మళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని గడ్కరీ నొక్కి చెప్పారు. ఆయన స్వయంగా ఇథనాల్ తో నడిచే ఎకో-ఫ్రెండ్లీ కారును వాడుతున్నట్లు గుర్తుచేశారు.

ప్రస్తుతం ఢిల్లీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గాలి నాణ్యత సూచీ AQI 412 దాటడంతో ‘సివియర్’ కేటగిరీలోకి వెళ్లిపోయింది. నోయిడాలో అయితే ఏకంగా 426 పాయింట్లు నమోదైంది. గడ్కరీ ఇలా మాట్లాడటం కొత్తేమీ కాదు, గతంలో కూడా ఢిల్లీ రావాలంటేనే భయమేస్తోందని, ఇక్కడి కాలుష్యం అంత భయంకరంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

This post was last modified on December 24, 2025 2:56 pm

Share

Recent Posts

త్రినాథుడి బ్యాటింగ్ ఆపే టైమొచ్చింది

పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…

5 minutes ago

టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…

59 minutes ago

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

1 hour ago

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

2 hours ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

2 hours ago

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

3 hours ago