Political News

టాప్ జర్నలిస్ట్ గాలి తీసేసిన బీజేపీ లీడర్

ప్రముఖ జాతీయ ఛానెళ్లతో పాటు వాటిని లీడ్ చేసే జర్నలిస్టులు సైతం పొలిటికల్ అజెండాతో పని చేస్తారన్న సంగతి స్పష్టంగా తెలిసిపోతుంటుంది. రిపబ్లిక్ టీవీని నడిపించే అర్నాబ్ గోస్వామి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతిస్తుంటాడన్న సంగతి తెలిసిందే. ఇక ఇండియా టుడే టీవీ ఛానెల్‌కు ముఖచిత్రంగా ఉంటున్న రాజ్‌దీప్ సర్దేశాయ్ ముందు నుంచి కాంగ్రెస్ మద్దతుదారుగానే ఉంటున్నాడు. ఆయన ఎప్పుడూ కూడా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచే ఛానెళ్లలోనే పని చేస్తుంటాడు కూడా.

మరీ ఓపెన్‌గా కాంగ్రెస్‌ను వెనకేసుకురావడం, బీజేపీని విమర్శించడం చేయడు కానీ.. పరోక్షంగా ఆయనీ ఈ రకంగా వ్యవహరిస్తుంటాడని అందరికీ తెలుసు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వ్యవసాయ బిల్లులపై చర్చా కార్యక్రమాల ద్వారా మోడీ సర్కారును రాజ్‌దీప్ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.మంగళవారం భారత్ బంద్ నేపథ్యంలోనూ ఆయన ఈ అంశంపై చర్చ నిర్వహించారు.

కానీ ఆ చర్చలో పాల్గొన్న బీజేపీ నాయకుడొకరు రాజ్‌దీప్‌కు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి కల్పించాడు. లైవ్ డిస్కషన్లో భాగంగా వ్యవసాయ బిల్లుల గురించి రాజ్‌దీప్ విమర్శలు గుప్పిస్తూ ఉండగా.. ఉన్నట్లుండి ఆ నేత రాజ్‌దీప్‌కు ఒక ప్రశ్న వేశాడు. మీరు అభ్యంతరకరమైనవిగా చెబుతున్న ఆ మూడు వ్యవసాయ బిల్లుల పేర్లేంటో, వాటి వివరాలేంటో ఒకసారి చెప్పండి అని అడిగాడు. దానికి రాజ‌్‌దీప్ దగ్గర సమాధానం లేదు. ఒక సీనియర్ జర్నలిస్టుగా కనీసం ఈ వ్యవసాయ బిల్లుల పేర్లు కూడా చెప్పలేని మీరు.. చర్చ ఏం చేపడతారు అని ఆ నాయకుడు రాజ్‌దీప్‌ను ప్రశ్నించగా.. ఆయనకు ఏమీ పాలు పోలేదు.

ఓవైపు నీళ్లు నములుతూనే.. తన ముందున్న ట్యాబ్లెట్ మీద గూగుల్ చేసి బిల్లుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడు రాజ్‌దీప్. ఆయన్ని ప్రశ్నించిన నాయకుడు ఆ విషయాన్ని పసిగట్టి.. బిల్లుల పేర్లడిగితే గూగుల్ చేస్తున్నారా అని ఎద్దేవా చేశాడు. తర్వాత రాజ్‌దీప్ కొంచెం తేరుకుని ఈ షోలో నేను ప్రశ్నలేయాలి, మీరు సమాధానం చెప్పాలి అంటూ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేయగా.. మీరేమైనా డిక్టేటరా అంటూ రాజ్‌దీప్‌ గాలి మరింతగా తీసేశాడు ఆ బీజేపీ నేత.

This post was last modified on December 9, 2020 4:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క‌విత న‌న్ను ప‌దికోట్లు అడిగారు: పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ సువార్తీకుడు కేఏ పాల్‌.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ…

20 minutes ago

మ‌మ‌త ప‌రిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!

త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. బీజేపీ విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. త‌న‌కు అవ‌కాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…

3 hours ago

‘అడ్డంకులెన్నైనా.. ఆకివీడు రామాలయ నిర్మాణం ఆగదు’

ఏపీలో మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.…

3 hours ago

కెపాసిటీ లేకే ర‌జినీ సినిమా వ‌దిలేశా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో ఎంత త‌ల‌నొప్పి ఎదురైందో…

5 hours ago

తొలిసారి బాల‌య్య‌తో అనిరుధ్‌?

టాలీవుడ్లో ఇప్ప‌టికే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో పాటు నాని, విజ‌య్…

5 hours ago

పవన్ వచ్చాక పిఠాపురంలో ఏం చేశారు?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌కవ‌ర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ 2024…

6 hours ago